కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన అక్కాచెల్లెళ్లు చేపలు అమ్ముతూ కుటుంబానికి అండగా ఉంటున్నారు. చిన్నవయసులోనే కుటుంబాన్ని పోషిస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
కుటుంబ నేపథ్యం :
ఇడుక్కి జిల్లా ఇరుంబుపాలెం గ్రామానికి చెందిన వెట్టిక్కల్ మనోజ్కు శిల్ప, నందన ఇద్దరు కూతుళ్లు. మనోజ్ చేపల వ్యాపారం చేసి కుటుంబాన్ని పోషించేవారు. శిల్ప బీబీఏ చదువుతోంది. నందన 10వతరగతి పూర్తిచేసింది.
అన్నీ తామైన అక్కాచెల్లెళ్లు :
తండ్రి వెట్టిక్కల్ మనోజ్కు ప్రమాదవశాత్తు రెండు కాళ్లకు గాయాలయ్యాయి. డాక్టర్లు కాలు బయట పెట్టొద్దన్నారు. ఆ కుటుంబానికి మనోజ్ సంపాదన మాత్రమే ఆధారం. దీంతో మంచాన పడ్డ తండ్రిని చూసి కుమిలిపోకుండా అన్నీ తామై తండ్రి బాటలో చేపలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు ఆ అక్కాచెల్లెళ్లు.
మనోధైర్యంతో ముందడుగు :
అక్కాచెల్లెళ్లు రోజూ ఉదయాన్నే మార్కెట్కి వెళ్లి చేపలు తెచ్చి ఊర్లో విక్రయిస్తున్నారు.మొదట్లో గ్రామస్థులు హేళన చేసినా తరువాత వారి ధైర్యం, శ్రమ చూసి మెచ్చుకున్నారు. చేపలు కొంటూ వారికి సహకరిస్తున్నారు.
ఇదీ చదవండి :ఆ నిందితుడికి పూల మాలతో పోలీసుల స్వాగతం