కర్ణాటక ఉడుపి జిల్లా కర్కాల ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ పర్యటకుల బస్సు అదుపు తప్పి కొండను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు.
బస్సులో మొత్తం 35 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. బస్సు మైసూరు నుంచి మంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇదీ చదవండి: ఇద్దరు ఫేస్బుక్ రారాజులు త్వరలో కలవబోతున్నారు!