ETV Bharat / bharat

కరోనా పంజా: దేశంలో 24 గంటల్లోనే 478 కొత్త కేసులు - CORONAVIRUS CASES IN INDIA

దేశంలో గడిచిన 24 గంటల్లోనే 478 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. వీటితో కలిపి దేశవ్యాప్తగా కరోనా కేసుల సంఖ్య 2547కు చేరింది. ఇప్పటివరకు 62 మంది మృత్యువాత పడ్డారు.

Total number of Coronavirus positive cases in India rises to 2547
దేశంలో 24 గంటల్లోనే 478 కరోనా పాజిటివ్​ కేసులు!
author img

By

Published : Apr 3, 2020, 9:05 PM IST

దేశంలో కరోనా మహమ్మారి కేసులు సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 478 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఫలితంగా దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2547కు చేరింది. ఇందులో 2322 యాక్టివ్​ కేసులుండగా.. మరో 163 మంది కోలున్నారు. ఇప్పటివరకు 62 మంది ఈ మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోయారు.

మహారాష్ట్ర-335, తమిళనాడు-309, కేరళ-286, దిల్లీ-219, ఉత్తర్​ప్రదేశ్​-172, రాజస్థాన్​-167, తెలంగాణ-158, ఆంధ్రప్రదేశ్​(132)లో అత్యధిక కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి.

గుజరాత్​లో మరొకరు మృతి

కరోనా వైరస్​ కారణంగా గుజరాత్​ మరొకరు మృతి చెందారు. ఫలితంగా రాష్ట్రంలో కొవిడ్​-19 మృతుల సంఖ్య 9కి చేరింది.

దేశంలో కరోనా మహమ్మారి కేసులు సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 478 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఫలితంగా దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2547కు చేరింది. ఇందులో 2322 యాక్టివ్​ కేసులుండగా.. మరో 163 మంది కోలున్నారు. ఇప్పటివరకు 62 మంది ఈ మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోయారు.

మహారాష్ట్ర-335, తమిళనాడు-309, కేరళ-286, దిల్లీ-219, ఉత్తర్​ప్రదేశ్​-172, రాజస్థాన్​-167, తెలంగాణ-158, ఆంధ్రప్రదేశ్​(132)లో అత్యధిక కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి.

గుజరాత్​లో మరొకరు మృతి

కరోనా వైరస్​ కారణంగా గుజరాత్​ మరొకరు మృతి చెందారు. ఫలితంగా రాష్ట్రంలో కొవిడ్​-19 మృతుల సంఖ్య 9కి చేరింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.