ETV Bharat / bharat

భూమిపూజకు ముందు మెరిసిపోతున్న రామ్​లల్లా

author img

By

Published : Aug 5, 2020, 10:23 AM IST

రామమందిర శంకుస్థాపన వేడుక కోసం రామ జన్మభూమి ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ముఖ్యంగా రామ్​లల్లా విగ్రహాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు.

The idol of 'Ram Lalla' at the Ram Janambhoomi site in #Ayodhya.
కన్నులపండువగా రామయ్య విగ్రహాం అలంకరణ

రామమందిర భూమిపూజ కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ముఖ్యంగా రామ జన్మభూమిలోని రామ్​లల్లా విగ్రహాన్ని అత్యద్భుతంగా అలంకరించారు. వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో శ్రీరాముని ప్రతిమను తీర్చిదిద్దారు. దీపాల వెలుగులో రామ్​లల్లా విగ్రహం ధగధగా మెరిసిపోతోంది.

రామ జన్మభూమి ప్రాంగణాన్ని కూడా ప్రత్యేకంగా ముస్తాబు చేసింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్​. వేదిక ముందు వేసిన రంగురంగుల ముగ్గులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

The idol of 'Ram Lalla' at the Ram Janambhoomi site in #Ayodhya.
రామ జన్మభూమి ప్రాంగణం
The idol of 'Ram Lalla' at the Ram Janambhoomi site in #Ayodhya.
వేదిక ప్రాంగణం

రామమందిర శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిల్లీ నుంచి అయోధ్యకు బయలుదేరారు. 11:30 గంటలకు అయోధ్య చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల 15నిమిషాల 15సెకన్లకు మొదలుపెట్టి 32 సెకన్లలో భూమిపూజలోని కీలక క్రతువు ముగుస్తుంది. గర్భగుడిలో 40 కిలోల వెండి ఇటుకను స్థాపించి.. ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు మోదీ.

ఇవీ చూడండి:-

రామమందిర భూమిపూజ కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ముఖ్యంగా రామ జన్మభూమిలోని రామ్​లల్లా విగ్రహాన్ని అత్యద్భుతంగా అలంకరించారు. వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో శ్రీరాముని ప్రతిమను తీర్చిదిద్దారు. దీపాల వెలుగులో రామ్​లల్లా విగ్రహం ధగధగా మెరిసిపోతోంది.

రామ జన్మభూమి ప్రాంగణాన్ని కూడా ప్రత్యేకంగా ముస్తాబు చేసింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్​. వేదిక ముందు వేసిన రంగురంగుల ముగ్గులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

The idol of 'Ram Lalla' at the Ram Janambhoomi site in #Ayodhya.
రామ జన్మభూమి ప్రాంగణం
The idol of 'Ram Lalla' at the Ram Janambhoomi site in #Ayodhya.
వేదిక ప్రాంగణం

రామమందిర శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిల్లీ నుంచి అయోధ్యకు బయలుదేరారు. 11:30 గంటలకు అయోధ్య చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల 15నిమిషాల 15సెకన్లకు మొదలుపెట్టి 32 సెకన్లలో భూమిపూజలోని కీలక క్రతువు ముగుస్తుంది. గర్భగుడిలో 40 కిలోల వెండి ఇటుకను స్థాపించి.. ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు మోదీ.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.