ETV Bharat / bharat

'ఎల్​ఏసీ నుంచి ఎల్​ఓసీ వరకు.. నేతాజీ మార్గంలోనే​'

author img

By

Published : Jan 23, 2021, 5:36 PM IST

Updated : Jan 23, 2021, 8:27 PM IST

నేతాజీ అడుగుజాడల్లోనే దేశం నడుస్తోందని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. రఫేల్​, తేజస్​ వంటి యుద్ధవిమానాలతో సైనిక శక్తి ధృడంగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుత భారత్​ను చూస్తే నేతాజీ గర్వపడతారని పేర్కొన్నారు.

the-country-has-decided-that-from-now-we-will-celebrate-netajis-birth-anniversary-january-23-as-parakram-divas-pm-narendra-modi
స్వాతంత్ర్య ఉద్యమంలో కొత్త పంథా 'నేతాజీ': మోదీ

వాస్తవాధీన రేఖ నుంచి నియంత్రణ రేఖ వరకు.. నేతాజీ సుభాష్​ చంద్రబోస్​ ఆడుగుజాడల్లోనే దేశం నడుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఆయన ఇప్పుడు ఉండి ఉంటే.. భారత్​ను చూసి గర్వపడేవారని పేర్కొన్నారు.

కోల్​కతాలో నేతాజీ 125వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు ప్రధాని. ఇతర దేశాలకు వ్యాక్సిన్లు అందించే స్థాయికి భారత్​ చేరిందన్నారు మోదీ. నేతాజీ ఇలాంటి భారత్​ కోసమే కలలు కన్నారని వెల్లడించారు.

"సమర్థంగా తయారవుతోన్న భారత్​ ఎదుగుదలను చూస్తే నేతాజీ ఏమనుకునేవారో అని ఆలోచిస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. నేతాజీ ఇలాంటి భారత్​ కోసమే కలలు కన్నారు. విపత్కర పరిస్థితులు ఎప్పుడు ఎదురైనా దేశం దాన్ని ధైర్యంగా ఎదుర్కుంటోంది. ప్రత్యర్థి దేశాల వక్ర బుద్ధికి దీటైన సమాధానం ఇస్తోంది."

----నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ప్రస్తుతం దేశంలో తేజస్​, రఫేల్​ వంటి అధునాతన యుద్ధ విమానాలున్నాయని గుర్తుచేశారు మోదీ. సైనిక శక్తిలోనూ భారత్​ తీసిపోదని అభివర్ణించారు.

ఈ సందర్భంగా బంగాల్​ చరిత్రపై ప్రశంసల వర్షం కురిపించారు మోదీ. బంగాల్​ పుణ్యభూమిలో మహామహా వ్యక్తులు జన్మించారని తెలిపారు. ఎందరో మహానుభావులతో పాటు గొప్ప విజ్ఞానానికి కూడా కోల్​కతా పుట్టినిల్లు అని వెల్లడించారు. జాతీయగీతం, జాతీయం గేయం కూడా ఈ పుణ్యభూమి నుంచే పుట్టాయని గుర్తుచేశారు.

వేడుకల్లో భాగంగా.. నేతాజీ లేఖలతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించారు మోదీ. నేతాజీ స్మరణలో పోస్టల్​ స్టాంప్​ను కూడా విడుదల చేశారు.

ఈ వేడుకలో బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు గవర్నర్​ ధన్​కర్​ కూడా పాల్గొన్నారు.

the-country-has-decided-that-from-now-we-will-celebrate-netajis-birth-anniversary-january-23-as-parakram-divas-pm-narendra-modi
పోస్టల్​ స్టాంప్​ ఆవిష్కరణ

అంతకుముందు కోల్​కతాకు చేరిన వెంటనే నేతాజీ భవన్​, నేషనల్​ లైబ్రరీలను సందర్శించారు మోదీ.

ఇదీ చూడండి:- 'సవాళ్లు ఎదురవుతాయని నేతాజీ ఊహించారు'

వాస్తవాధీన రేఖ నుంచి నియంత్రణ రేఖ వరకు.. నేతాజీ సుభాష్​ చంద్రబోస్​ ఆడుగుజాడల్లోనే దేశం నడుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఆయన ఇప్పుడు ఉండి ఉంటే.. భారత్​ను చూసి గర్వపడేవారని పేర్కొన్నారు.

కోల్​కతాలో నేతాజీ 125వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు ప్రధాని. ఇతర దేశాలకు వ్యాక్సిన్లు అందించే స్థాయికి భారత్​ చేరిందన్నారు మోదీ. నేతాజీ ఇలాంటి భారత్​ కోసమే కలలు కన్నారని వెల్లడించారు.

"సమర్థంగా తయారవుతోన్న భారత్​ ఎదుగుదలను చూస్తే నేతాజీ ఏమనుకునేవారో అని ఆలోచిస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. నేతాజీ ఇలాంటి భారత్​ కోసమే కలలు కన్నారు. విపత్కర పరిస్థితులు ఎప్పుడు ఎదురైనా దేశం దాన్ని ధైర్యంగా ఎదుర్కుంటోంది. ప్రత్యర్థి దేశాల వక్ర బుద్ధికి దీటైన సమాధానం ఇస్తోంది."

----నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ప్రస్తుతం దేశంలో తేజస్​, రఫేల్​ వంటి అధునాతన యుద్ధ విమానాలున్నాయని గుర్తుచేశారు మోదీ. సైనిక శక్తిలోనూ భారత్​ తీసిపోదని అభివర్ణించారు.

ఈ సందర్భంగా బంగాల్​ చరిత్రపై ప్రశంసల వర్షం కురిపించారు మోదీ. బంగాల్​ పుణ్యభూమిలో మహామహా వ్యక్తులు జన్మించారని తెలిపారు. ఎందరో మహానుభావులతో పాటు గొప్ప విజ్ఞానానికి కూడా కోల్​కతా పుట్టినిల్లు అని వెల్లడించారు. జాతీయగీతం, జాతీయం గేయం కూడా ఈ పుణ్యభూమి నుంచే పుట్టాయని గుర్తుచేశారు.

వేడుకల్లో భాగంగా.. నేతాజీ లేఖలతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించారు మోదీ. నేతాజీ స్మరణలో పోస్టల్​ స్టాంప్​ను కూడా విడుదల చేశారు.

ఈ వేడుకలో బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు గవర్నర్​ ధన్​కర్​ కూడా పాల్గొన్నారు.

the-country-has-decided-that-from-now-we-will-celebrate-netajis-birth-anniversary-january-23-as-parakram-divas-pm-narendra-modi
పోస్టల్​ స్టాంప్​ ఆవిష్కరణ

అంతకుముందు కోల్​కతాకు చేరిన వెంటనే నేతాజీ భవన్​, నేషనల్​ లైబ్రరీలను సందర్శించారు మోదీ.

ఇదీ చూడండి:- 'సవాళ్లు ఎదురవుతాయని నేతాజీ ఊహించారు'

Last Updated : Jan 23, 2021, 8:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.