ETV Bharat / bharat

కుటుంబ పోషణ కోసం బాలిక రిక్షా తొక్కుతూ..

author img

By

Published : Jul 27, 2020, 6:44 AM IST

కరోనా సంక్షోభం వల్ల ఎంతో మంది జీవనోపాధి కోల్పోయారు. కనీస అవసరాలు తీర్చుకోడానికే ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిలో బిహార్​ రోహతాస్​కు చెందిన 14 ఏళ్ల బాలిక కూడా ఒకరు. కుటుంబ భారాన్ని మోసేందుకు.. కష్టమైనా రిక్షా చోదకురాలిగా మారింది. ఆ కథేంటో మీరే చదవండి.

Teenage girl in Bihar forced to pull rickshaw to sustain family amid COVID-19 pandemic
ఆ బాలిక రిక్షా తొక్కితేనే.. కుటుంబానికి పూట గడుస్తుంది!

తల్లిదండ్రులు తెచ్చిన సంపాదనతో ఆడుతూ.. పాడుతూ.. హాయిగా గడపాల్సిన వయస్సు ఆ బాలికది. కానీ కరోనా మహమ్మారి వల్ల తనే ఆ కుటుంబానికి ఆధారంగా నిలిచింది. రిక్షా తొక్కుతూ.. తనవాళ్లను పోషిస్తోంది బిహార్​ రోహతాస్​ జిల్లాకు చెందిన 14 ఏళ్ల నందిని కుమారి.

ఏం జరిగిందంటే..!

దేశంలో కరోనా పరిస్థితుల వల్ల ఎందరో జీవితాలు చిన్నా భిన్నమైపోయాయి. మరెంతో మంది తమ జీవనోపాధి కోల్పోయారు. ఆ కోవకు చెందినదే నందిని కుటుంబం కూడా. తన తండ్రి రోజంతా రిక్షా తొక్కి తెచ్చిన సంపాదనతో ఇళ్లు గడిచేది. నందిని కూడా వయసులో చిన్నదే అయినా.. ఓ ఇంట్లో పనిమనిషిగా ఉంటూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేది.

అయితే మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో.. తన తండ్రి ఉపాధిపై దెబ్బపడింది. అదే సమయంలో పనిమనిషిగానూ ఉపాధి కోల్పోయింది నందిని. ఇక పూట గడవడమే ఎంతో కష్టమైంది ఆ కుటుంబానికి. ఆ ఇబ్బందులను చూసి ఓర్వలేక ఆ కుటుంబ భారాన్ని తనపై వేసుకుంది నందిని. ఓ రిక్షాను అద్దెకు తీసుకుని, రోజంతా రిక్షా తొక్కి.. వచ్చిన డబ్బులతోనే తల్లిదండ్రులను పోషిస్తోంది ఆ బాలిక.

ఆ బాలిక రిక్షా తొక్కితేనే.. కుటుంబానికి పూట గడుస్తుంది!

ఇదీ చూడండి: రాజస్థాన్‌: బలనిరూపణకు కాదు, కరోనాపై చర్చకే!

తల్లిదండ్రులు తెచ్చిన సంపాదనతో ఆడుతూ.. పాడుతూ.. హాయిగా గడపాల్సిన వయస్సు ఆ బాలికది. కానీ కరోనా మహమ్మారి వల్ల తనే ఆ కుటుంబానికి ఆధారంగా నిలిచింది. రిక్షా తొక్కుతూ.. తనవాళ్లను పోషిస్తోంది బిహార్​ రోహతాస్​ జిల్లాకు చెందిన 14 ఏళ్ల నందిని కుమారి.

ఏం జరిగిందంటే..!

దేశంలో కరోనా పరిస్థితుల వల్ల ఎందరో జీవితాలు చిన్నా భిన్నమైపోయాయి. మరెంతో మంది తమ జీవనోపాధి కోల్పోయారు. ఆ కోవకు చెందినదే నందిని కుటుంబం కూడా. తన తండ్రి రోజంతా రిక్షా తొక్కి తెచ్చిన సంపాదనతో ఇళ్లు గడిచేది. నందిని కూడా వయసులో చిన్నదే అయినా.. ఓ ఇంట్లో పనిమనిషిగా ఉంటూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేది.

అయితే మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో.. తన తండ్రి ఉపాధిపై దెబ్బపడింది. అదే సమయంలో పనిమనిషిగానూ ఉపాధి కోల్పోయింది నందిని. ఇక పూట గడవడమే ఎంతో కష్టమైంది ఆ కుటుంబానికి. ఆ ఇబ్బందులను చూసి ఓర్వలేక ఆ కుటుంబ భారాన్ని తనపై వేసుకుంది నందిని. ఓ రిక్షాను అద్దెకు తీసుకుని, రోజంతా రిక్షా తొక్కి.. వచ్చిన డబ్బులతోనే తల్లిదండ్రులను పోషిస్తోంది ఆ బాలిక.

ఆ బాలిక రిక్షా తొక్కితేనే.. కుటుంబానికి పూట గడుస్తుంది!

ఇదీ చూడండి: రాజస్థాన్‌: బలనిరూపణకు కాదు, కరోనాపై చర్చకే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.