ETV Bharat / bharat

మోదీ పిలుపుతో విద్యుత్​ సంస్థల సమాయత్తం

author img

By

Published : Apr 4, 2020, 3:12 PM IST

ఆదివారం రాత్రి లైట్లు ఆర్పే సమయంలో విద్యుత్ గ్రిడ్​పై పడే ప్రభావాన్ని తగ్గించేందుకు ఆయా రాష్ట్రాల విద్యుత్​ సరఫరా, పంపిణీ సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఒక్కసారిగా లోడ్​ తగ్గిపోతే దాని ప్రభావానికి గ్రిడ్ కుప్పకూలే ప్రమాదం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో చర్యలు చేపట్టాయి. బ్లాకౌట్​ నిర్వహించటం ఇదే మొదటి సారి కాదని.. జాతీయ గ్రిడ్​పై ఎలాంటి ప్రభావం ఉండబోదని స్పష్టం చేశాయి.

State power utilities
ఆదివారం బ్లాకౌట్​ కోసం విద్యుత్తు సంస్థల సన్నద్ధం

కరోనాపై పోరులో భాగంగా ఆదివారం రాత్రి 9 గంటలకు ఇళ్లల్లోని విద్యుత్​ లైట్లు ఆర్పి ఐక్యతను చాటాలన్న ప్రధాని మోదీ పిలుపుతో బ్లాకౌట్ (అంధకారం)​కు స్టేట్​ లోడ్​ డిస్పాచ్​ కేంద్రాలు (ఎస్​ఎల్​డీసీ), విద్యుత్​ ట్రాన్స్​మిషన్​ సంస్థలు సమాయత్తమవుతున్నాయి. విద్యుత్​ గ్రిడ్​పై ఏదైనా ప్రతికూల ప్రభావం ఏర్పడితే దానిని పరిష్కరించేందుకు అనుసరించాల్సిన చర్యలకు సిద్ధమవుతున్నాయి.

రాత్రి 9 గంటల ప్రాంతంలో అత్యధికంగా విద్యుత్ డిమాండ్​ ఉంటుంది. ఆ సమయంలో ఒక్కసారిగా లోడ్​ తగ్గిపోతే గ్రిడ్​పై అధిక ప్రభావం పడుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే.. ఈనెల 2న విద్యుత్ డిమాండ్​ గతేడాదితో పోల్చితే 25 శాతం (125.81జీడబ్ల్యూ) మేర తగ్గిపోయింది.

అయితే.. అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న కారణంగా గ్రిడ్ స్థిరత్వంపై ఎలాంటి ప్రభావం ఉండదని విద్యుత్​ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.

యూపీ ఎస్​ఎల్​డీసీ ఆదేశాలు..

విద్యుత్ డిమాండ్​ ఒక్కసారిగా తగ్గిపోతే అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యుత్తు సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది ఉత్తరప్రదేశ్​ స్టేట్​ లోడ్​ డిస్పాచ్​ కేంద్రం(ఎస్​ఎల్​డీసీ). రాష్ట్ర గ్రిడ్​లోని అన్ని రియాక్టర్లను ఆన్​లో ఉంచుతూ.. కెపాసిటర్​ బ్యాంకును ఆఫ్​ చేయాలని సూచించింది. రాత్రి 8-9 గంటల మధ్య లోడ్​ను క్రమంగా తగ్గిస్తూ విద్యుత్ గ్రిడ్​పై ప్రభావాన్ని తగ్గించాలని పేర్కొంది.

తమిళనాడులోనూ..

ఉత్తర్​ప్రదేశ్​ ఎస్​ఎల్​డీసీ చేసినటువంటి సూచనలే చేసింది తమిళనాడు ట్రాన్స్​మిషన్​ కార్పోరేషన్​. ఆదివారం రాత్రి బ్లాకౌట్​ సమయంలో అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని కోరింది. ఎస్​ఎల్​డీసీ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

ఇదే తొలిసారి కాదు..

బ్లాకౌట్​ సమయంలో విద్యుత్ డిమాండ్​ సుమారు 10-12 గిగావాట్లు తగ్గుతుందని అధికారులు అంచనావేస్తున్నారు. ఇది జాతీయ పవర్​ గ్రిడ్​పై ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా బ్లాకౌట్​ నిర్వహించటం ఇదే మొదటి సారి కాదని.. ఎర్త్​ అవర్​ వంటి పలు సందర్భాల్లో బ్లాకౌట్​ నిర్వహించినట్లు గుర్తు చేశారు.

విపక్షాల విమర్శలు..

దేశవ్యాప్తంగా ప్రజలు విద్యుత్ దీపాలను ఆర్పాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును విపక్షాలు విమర్శించాయి. ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రజలు లైట్లు ఆర్పకూడదని ఓ కేంద్ర మంత్రి కోరటం గమనార్హం.

2012లో..

సాంకేతిక కారణాలతో 2012లో గ్రిడ్​ విఫలమై దేశం అంధకారంలోకి వెళ్లింది. అయితే.. ప్రస్తుతం పటిష్ఠమైన ట్రాన్స్​మిషన్​ నెట్​వర్క్​ ఉంది. పవర్​ డిమాండ్​లో హెచ్చుతగ్గులు ఏర్పడినా దానిని తట్టుకునే శక్తి ఉంది.

ఇదీ చూడండి: 'మోదీ చెప్పినట్లు లైట్లు ఆర్పితే దేశం అంధకారమే'

కరోనాపై పోరులో భాగంగా ఆదివారం రాత్రి 9 గంటలకు ఇళ్లల్లోని విద్యుత్​ లైట్లు ఆర్పి ఐక్యతను చాటాలన్న ప్రధాని మోదీ పిలుపుతో బ్లాకౌట్ (అంధకారం)​కు స్టేట్​ లోడ్​ డిస్పాచ్​ కేంద్రాలు (ఎస్​ఎల్​డీసీ), విద్యుత్​ ట్రాన్స్​మిషన్​ సంస్థలు సమాయత్తమవుతున్నాయి. విద్యుత్​ గ్రిడ్​పై ఏదైనా ప్రతికూల ప్రభావం ఏర్పడితే దానిని పరిష్కరించేందుకు అనుసరించాల్సిన చర్యలకు సిద్ధమవుతున్నాయి.

రాత్రి 9 గంటల ప్రాంతంలో అత్యధికంగా విద్యుత్ డిమాండ్​ ఉంటుంది. ఆ సమయంలో ఒక్కసారిగా లోడ్​ తగ్గిపోతే గ్రిడ్​పై అధిక ప్రభావం పడుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే.. ఈనెల 2న విద్యుత్ డిమాండ్​ గతేడాదితో పోల్చితే 25 శాతం (125.81జీడబ్ల్యూ) మేర తగ్గిపోయింది.

అయితే.. అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న కారణంగా గ్రిడ్ స్థిరత్వంపై ఎలాంటి ప్రభావం ఉండదని విద్యుత్​ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.

యూపీ ఎస్​ఎల్​డీసీ ఆదేశాలు..

విద్యుత్ డిమాండ్​ ఒక్కసారిగా తగ్గిపోతే అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యుత్తు సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది ఉత్తరప్రదేశ్​ స్టేట్​ లోడ్​ డిస్పాచ్​ కేంద్రం(ఎస్​ఎల్​డీసీ). రాష్ట్ర గ్రిడ్​లోని అన్ని రియాక్టర్లను ఆన్​లో ఉంచుతూ.. కెపాసిటర్​ బ్యాంకును ఆఫ్​ చేయాలని సూచించింది. రాత్రి 8-9 గంటల మధ్య లోడ్​ను క్రమంగా తగ్గిస్తూ విద్యుత్ గ్రిడ్​పై ప్రభావాన్ని తగ్గించాలని పేర్కొంది.

తమిళనాడులోనూ..

ఉత్తర్​ప్రదేశ్​ ఎస్​ఎల్​డీసీ చేసినటువంటి సూచనలే చేసింది తమిళనాడు ట్రాన్స్​మిషన్​ కార్పోరేషన్​. ఆదివారం రాత్రి బ్లాకౌట్​ సమయంలో అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని కోరింది. ఎస్​ఎల్​డీసీ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

ఇదే తొలిసారి కాదు..

బ్లాకౌట్​ సమయంలో విద్యుత్ డిమాండ్​ సుమారు 10-12 గిగావాట్లు తగ్గుతుందని అధికారులు అంచనావేస్తున్నారు. ఇది జాతీయ పవర్​ గ్రిడ్​పై ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా బ్లాకౌట్​ నిర్వహించటం ఇదే మొదటి సారి కాదని.. ఎర్త్​ అవర్​ వంటి పలు సందర్భాల్లో బ్లాకౌట్​ నిర్వహించినట్లు గుర్తు చేశారు.

విపక్షాల విమర్శలు..

దేశవ్యాప్తంగా ప్రజలు విద్యుత్ దీపాలను ఆర్పాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును విపక్షాలు విమర్శించాయి. ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రజలు లైట్లు ఆర్పకూడదని ఓ కేంద్ర మంత్రి కోరటం గమనార్హం.

2012లో..

సాంకేతిక కారణాలతో 2012లో గ్రిడ్​ విఫలమై దేశం అంధకారంలోకి వెళ్లింది. అయితే.. ప్రస్తుతం పటిష్ఠమైన ట్రాన్స్​మిషన్​ నెట్​వర్క్​ ఉంది. పవర్​ డిమాండ్​లో హెచ్చుతగ్గులు ఏర్పడినా దానిని తట్టుకునే శక్తి ఉంది.

ఇదీ చూడండి: 'మోదీ చెప్పినట్లు లైట్లు ఆర్పితే దేశం అంధకారమే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.