Ed Involved in KTR Formula E Car Race Case : బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఫార్ములా ఈ-కారు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఇందులో మనీ లాండరింగ్ వ్యవహారం కూడా దాగి ఉండటంతో కేసు నమోదు చేసింది. ఉదయం ఏసీబీ నుంచి సమాచారం తెప్పించుకున్న ఈడీ అధికారులు ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం కేసు రిజిస్టర్ చేసినట్లు తెలిపారు.
ఫార్ములా-ఈ కార్ రేస్ కేసుపై సీఐయూ ఏర్పాటు - తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసులు
విదేశీ సంస్థకు నగదు చెల్లింపులు ఎలా జరిగాయి : ఫార్ములా-ఈ రేసు వ్యవహారంపై ఇప్పటికే ఏసీబీ విచారణ ప్రారంభించింది. ఇవాళ ఈ కేసుపై హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం కేటీఆర్ను ఈనెల 30 వరకు అరెస్ట్ చేయవద్దని, అయితే దర్యాప్తు చేసుకోవచ్చని సూచించింది. దీంతో త్వరలోనే ఏసీబీ ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్, ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ , ఏ3 హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలకు నోటీసులు జారీ చేయనుంది.
హెచ్ఎండీఏ, రాష్ట్ర ఆర్థికశాఖ, ఆర్బీఐ అనుమంతి లేకుండానే నేరుగా విదేశీ సంస్థకు రూ.55 కోట్ల చెల్లింపులు జరిగాయి. వీటిలోనూ రూ.46 కోట్ల వరకు డైరెక్ట్గా డాలర్ల రూపంలో చెల్లించడం ఉల్లంఘనే అనేది కేసులో ప్రధాన అభియోగం. విదేశీ సంస్థకు నగదు చెల్లింపులు ఎలా జరిగాయనే కోణంలో ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. తాజాగా ఇందులోకి ఈడీ కూడా చేరింది. మరోవైపు ఫార్ములా ఈ-కారు ఒప్పందంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని బీఆర్ఎస్ చెబుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధించు చర్యల్లో భాగంగానే కేటీఆర్ పేరును చేర్చారని వారు ఆరోపిస్తున్నారు. దీనిని తాము న్యాయపరంగానే ఎదుర్కొంటామని చెబుతున్నారు. ఇవాళ ఈ అంశంపై అసెంబ్లీ పూర్తిస్థాయి చర్చకు బీఆర్ఎస్ పట్టు పట్టింది.
ఫార్మలా-ఈ రేస్ కేసు - హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్
'నేను ఏ తప్పు చేయలేదు భయపడేది లేదు - న్యాయపరంగా ఏం చేయాలో అది చేస్తాం : కేటీఆర్