ETV Bharat / bharat

సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్​ కన్నుమూత

author img

By

Published : Sep 11, 2020, 8:12 PM IST

Updated : Sep 11, 2020, 9:38 PM IST

ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్​ ఇకలేరు. కొద్దిరోజులుగా అనారోగ్యం, కాలేయ సమస్యలతో సతమతమౌతున్న ఆయన.. దిల్లీలోని ఓ ఆసుపత్రిలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు.

Social activist Swami Agnivesh passes away
సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్​ కన్నుమూత

ఆర్య సమాజ్‌ నేత, ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్​ తుదిశ్వాస విడిచారు. తీవ్ర అనారోగ్యం, కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.. ఇటీవల దిల్లీలోని ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ లివర్​ అండ్​ బిలియరీ సైన్సెస్​(ఐఎల్​బీఎస్​)లో చేరారు. నాలుగు రోజులుగా వెంటిలేటర్​పై చికిత్స పొందుతన్న ఆయన.. శుక్రవారం గుండెపోటు రావడం వల్ల తుదిశ్వాస విడిచారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

ఆర్యసమాజ్​ అధ్యక్షుడిగా..

1939 సెప్టెంబర్‌ 21న ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు అగ్నివేశ్​. నాలుగేళ్లకే తండ్రి మరణించడం వల్ల తాత వద్దే పెరిగారు. కోల్‌కతాలోని సెయింట్‌ గ్జేవియర్‌ కాలేజీ నుంచి లా, కామర్స్‌లో పట్టా పొందారు. ఆర్య సమాజ్‌ సూత్రాలతో 1970లో ఆర్యసభ అనే రాజకీయ పార్టీని స్థాపించిన అగ్నివేశ్​.. 1977లో హరియాణాలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగానూ సేవలందించారు. బాలల వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించేందుకు 'బాండెడ్‌ లేబర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌'ను స్థాపించారు. మావోయిస్టులతో చర్చలు జరపడంలో కీలకంగా వ్యవహరించారు. 1875లో స్వామి దయానంద సరస్వతి స్థాపించిన ఆర్యసమాజ్​ అంతర్జాతీయ మండలి అధ్యక్షుడిగా పదేళ్ల పాటు(2004-2014) కొనసాగారు. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రజాందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా గడపదాటని జనం.. రోడ్డెక్కని వాహనం!

ఆర్య సమాజ్‌ నేత, ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్​ తుదిశ్వాస విడిచారు. తీవ్ర అనారోగ్యం, కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.. ఇటీవల దిల్లీలోని ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ లివర్​ అండ్​ బిలియరీ సైన్సెస్​(ఐఎల్​బీఎస్​)లో చేరారు. నాలుగు రోజులుగా వెంటిలేటర్​పై చికిత్స పొందుతన్న ఆయన.. శుక్రవారం గుండెపోటు రావడం వల్ల తుదిశ్వాస విడిచారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

ఆర్యసమాజ్​ అధ్యక్షుడిగా..

1939 సెప్టెంబర్‌ 21న ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు అగ్నివేశ్​. నాలుగేళ్లకే తండ్రి మరణించడం వల్ల తాత వద్దే పెరిగారు. కోల్‌కతాలోని సెయింట్‌ గ్జేవియర్‌ కాలేజీ నుంచి లా, కామర్స్‌లో పట్టా పొందారు. ఆర్య సమాజ్‌ సూత్రాలతో 1970లో ఆర్యసభ అనే రాజకీయ పార్టీని స్థాపించిన అగ్నివేశ్​.. 1977లో హరియాణాలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగానూ సేవలందించారు. బాలల వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించేందుకు 'బాండెడ్‌ లేబర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌'ను స్థాపించారు. మావోయిస్టులతో చర్చలు జరపడంలో కీలకంగా వ్యవహరించారు. 1875లో స్వామి దయానంద సరస్వతి స్థాపించిన ఆర్యసమాజ్​ అంతర్జాతీయ మండలి అధ్యక్షుడిగా పదేళ్ల పాటు(2004-2014) కొనసాగారు. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రజాందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా గడపదాటని జనం.. రోడ్డెక్కని వాహనం!

Last Updated : Sep 11, 2020, 9:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.