ETV Bharat / bharat

'చైనా రక్షణమంత్రితో రాజ్​నాథ్​ భేటీ లేదు'

షాంఘై సహకార సంస్థ సమావేశంలో భారత్- చైనా రక్షణ మంత్రుల మధ్య భేటీ ఉండే అవకాశం లేదని అధికార వర్గాలు తెలిపాయి. రాజ్​నాథ్ సింగ్ షెడ్యూల్​లో అలాంటి సమావేశం లేదని వెల్లడించాయి. మూడు రోజుల పర్యటన కోసం రష్యాకు బయల్దేరారు రాజ్​నాథ్ సింగ్.

author img

By

Published : Sep 2, 2020, 12:22 PM IST

Updated : Sep 2, 2020, 12:37 PM IST

Rajnath Singh to not meet Chinese counterpart at SCO meeting
'రష్యా పర్యటనలో చైనాతో రాజ్​నాథ్​ భేటీ లేదు'

రష్యా పర్యటనలో భాగంగా చైనా రక్షణ మంత్రితో రాజ్​నాథ్​ సింగ్ సమావేశం ఉండబోదని అధికార వర్గాలు తెలిపాయి. రాజ్​నాథ్ షెడ్యూల్​లో అలాంటి సమావేశం లేదని స్పష్టం చేశాయి.

షాంఘై సహకార సంస్థ(ఎస్​సీఓ) రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు రాజ్​నాథ్ సింగ్ రష్యాకు బయల్దేరారు. మూడు రోజుల పాటు ఆ దేశంలో పర్యటించనున్నారు. భారత్​-రష్యా రక్షణ, వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం దిశగా వివిధ స్థాయిల్లో చర్చలు జరపనున్నారు.

ఎస్సీఓలో సభ్యదేశం కావడం వల్ల చైనా రక్షణ మంత్రి జెన్​ ఉయ్​ ఫెంఘీ కూడా ఈ భేటీకి హాజరుకానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భారత్​-చైనా సరిహద్దు ఉద్రిక్తల కారణంగా ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.

రష్యాతో అధికారులతో చర్చలు..

ఎస్​సీఓ సమావేశంతో పాటు సెప్టెంబర్ 3న.. రష్యా రక్షణమంత్రి సహా ఇతర అత్యున్నత సైనిక అధికారులతో రాజ్​నాథ్ చర్చలు జరపనున్నారు. భారత్​ చేపట్టిన రక్షణ పరికరాల కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని కోరనున్నారు. సెప్టెంబర్ 5న సింగ్ తిరిగి భారత్​కు రానున్నారు.

రష్యాలో జరగనున్న సైనిక విన్యాసాలకు దూరంగా ఉండాలని భారత్ నిర్ణయం తీసుకున్న ఐదు రోజులకే రాజ్​నాథ్ ఈ పర్యటన చేపట్టడం గమనార్హం. పాక్, చైనా సైన్యాలు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాల సమాచారం.

ఇదీ చదవండి- మరోసారి రష్యా పర్యటనకు రాజ్​నాథ్​ సింగ్​

రష్యా పర్యటనలో భాగంగా చైనా రక్షణ మంత్రితో రాజ్​నాథ్​ సింగ్ సమావేశం ఉండబోదని అధికార వర్గాలు తెలిపాయి. రాజ్​నాథ్ షెడ్యూల్​లో అలాంటి సమావేశం లేదని స్పష్టం చేశాయి.

షాంఘై సహకార సంస్థ(ఎస్​సీఓ) రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు రాజ్​నాథ్ సింగ్ రష్యాకు బయల్దేరారు. మూడు రోజుల పాటు ఆ దేశంలో పర్యటించనున్నారు. భారత్​-రష్యా రక్షణ, వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం దిశగా వివిధ స్థాయిల్లో చర్చలు జరపనున్నారు.

ఎస్సీఓలో సభ్యదేశం కావడం వల్ల చైనా రక్షణ మంత్రి జెన్​ ఉయ్​ ఫెంఘీ కూడా ఈ భేటీకి హాజరుకానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భారత్​-చైనా సరిహద్దు ఉద్రిక్తల కారణంగా ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.

రష్యాతో అధికారులతో చర్చలు..

ఎస్​సీఓ సమావేశంతో పాటు సెప్టెంబర్ 3న.. రష్యా రక్షణమంత్రి సహా ఇతర అత్యున్నత సైనిక అధికారులతో రాజ్​నాథ్ చర్చలు జరపనున్నారు. భారత్​ చేపట్టిన రక్షణ పరికరాల కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని కోరనున్నారు. సెప్టెంబర్ 5న సింగ్ తిరిగి భారత్​కు రానున్నారు.

రష్యాలో జరగనున్న సైనిక విన్యాసాలకు దూరంగా ఉండాలని భారత్ నిర్ణయం తీసుకున్న ఐదు రోజులకే రాజ్​నాథ్ ఈ పర్యటన చేపట్టడం గమనార్హం. పాక్, చైనా సైన్యాలు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాల సమాచారం.

ఇదీ చదవండి- మరోసారి రష్యా పర్యటనకు రాజ్​నాథ్​ సింగ్​

Last Updated : Sep 2, 2020, 12:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.