ETV Bharat / bharat

'ముజఫర్​పూర్ మరణాల'పై విచారణకు సుప్రీం అంగీకారం

బిహార్​లో ఏఈఎస్​ బాధిత మరణాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. చిన్నారుల ప్రాణాల రక్షణకు చర్యలు తీసుకునేలా కేంద్రాన్ని, బిహార్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఈ పిటిషన్​లో న్యాయవాది మనోహర్​ ప్రతాప్ కోరారు. దీనిపై జూన్​ 24న విచారణ చేపడతామని సుప్రీం ధర్మాసనం తెలిపింది.

author img

By

Published : Jun 19, 2019, 12:55 PM IST

Updated : Jun 19, 2019, 3:15 PM IST

'ముజఫర్​పూర్ మరణాల'పై విచారణకు సుప్రీం అంగీకారం
'ముజఫర్​పూర్ మరణాల'పై విచారణకు సుప్రీం అంగీకారం

'ఏఈఎస్' ​బాధిత చిన్నారుల చికిత్స కోసం అత్యవసరంగా వైద్య బృందాలను ఏర్పాటు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్​ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది.

బిహార్​ ముజఫర్​పూర్​లో 'అక్యూట్​ ఎన్​సెఫాలిటీస్​​ సిండ్రోమ్'​ అంటువ్యాధితో ఇప్పటి వరకు 126కు పైగా చిన్నారులు మరణించారు. మరెంతో మంది చిన్నారులు ఇంకా చికిత్స పొందుతున్నారు. వీరంతా సరాసరిన 10 ఏళ్ల వయస్సువారే.

ఈ పరిస్థితి తీవ్రత దృష్ట్యా... దీనిపై అత్యవసర విచారణ జరపాలని న్యాయవాది మనోహర్​ ప్రతాప్​ సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం తక్షణమే చర్యలు తీసుకునేలా కేంద్రాన్ని, బిహార్​ ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ వ్యాజ్యాన్ని పరిశీలించిన జస్టిస్​ దీపక్​ గుప్తా, జస్టిస్ సూర్యకాంత్​ల ద్విసభ్య ధర్మాసనం.. 'ఏఈఎస్​' బాధిత చిన్నారుల మరణాలపై సోమవారం (జూన్​ 24న) విచారణ చేపడతామని తెలిపింది.

ఇదీ చూడండి: తమిళనాడు: ఐటీ కంపెనీలకూ నీటికొరత సెగ!

'ముజఫర్​పూర్ మరణాల'పై విచారణకు సుప్రీం అంగీకారం

'ఏఈఎస్' ​బాధిత చిన్నారుల చికిత్స కోసం అత్యవసరంగా వైద్య బృందాలను ఏర్పాటు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్​ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది.

బిహార్​ ముజఫర్​పూర్​లో 'అక్యూట్​ ఎన్​సెఫాలిటీస్​​ సిండ్రోమ్'​ అంటువ్యాధితో ఇప్పటి వరకు 126కు పైగా చిన్నారులు మరణించారు. మరెంతో మంది చిన్నారులు ఇంకా చికిత్స పొందుతున్నారు. వీరంతా సరాసరిన 10 ఏళ్ల వయస్సువారే.

ఈ పరిస్థితి తీవ్రత దృష్ట్యా... దీనిపై అత్యవసర విచారణ జరపాలని న్యాయవాది మనోహర్​ ప్రతాప్​ సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం తక్షణమే చర్యలు తీసుకునేలా కేంద్రాన్ని, బిహార్​ ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ వ్యాజ్యాన్ని పరిశీలించిన జస్టిస్​ దీపక్​ గుప్తా, జస్టిస్ సూర్యకాంత్​ల ద్విసభ్య ధర్మాసనం.. 'ఏఈఎస్​' బాధిత చిన్నారుల మరణాలపై సోమవారం (జూన్​ 24న) విచారణ చేపడతామని తెలిపింది.

ఇదీ చూడండి: తమిళనాడు: ఐటీ కంపెనీలకూ నీటికొరత సెగ!

Intro:Body:

we


Conclusion:
Last Updated : Jun 19, 2019, 3:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.