ETV Bharat / bharat

ఆర్టికల్ 370 రద్దుపై అత్యవసర విచారణకు నో

author img

By

Published : Aug 8, 2019, 12:52 PM IST

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370, 35ఏ రద్దు, ఆ ప్రాంతంలో ఆంక్షల విధింపుపై సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రపతి ఉత్తర్వులపై అత్యవసర విచారణ చేపట్టాలన్న పిటిషనర్​ వినతిని సుప్రీం కోర్టు నిరాకరించింది. నిర్ణీత సయమంలో విచారించనున్నట్లు స్పష్టం చేసింది.

ఆర్టికల్ 370 రద్దుపై అత్యవసర విచారణకు సుప్రీం నో

'ఆపరేషన్​ కశ్మీర్'​పై అత్యవసర విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. నిర్ణీత సమయంలో విచారణ చేపడతామని స్పష్టం చేసింది.

ఆర్టికల్​ 370 రద్దుపై...

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు చేస్తూ ఇచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులపై సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలయింది. అత్యవసరంగా విచారణ చేపట్టాలని పిటిషనరైన న్యాయవాది ఎంఎల్​ శర్మ కోరారు. ఆగస్టు 12 లేదా 13న విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఆంక్షల తొలగింపునకు..

ఆర్టికల్​ 370, 35ఏ రద్దు కోసం జమ్ముకశ్మీర్​లో విధించిన ఆంక్షలు సడలించి, కర్ఫ్యూ ఎత్తివేయాలని పిటిషన్​ దాఖలు చేశారు కాంగ్రెస్​ కార్యకర్త తెహ్​సీన్​ పూనావాలా. కశ్మీర్​లో సమాచార వ్యవస్థను పునరుద్ధరించేందుకు, అరెస్ట్​ చేసిన నాయకులను వెంటనే విడుదల చేసేందుకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కశ్మీర్​ పరిస్థితులపై కమిషన్​ ఏర్పాటు చేయాలని విన్నవించారు. పిటిషన్​పై అత్యవసర విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

రెండు పిటిషన్లను పరిశీలించిన జస్టిస్ ఎన్​వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం అత్యవసర విచారణకు నిరాకరించింది. నిర్ణీత సమయంలో విచారణ జరుగుతుందని స్పష్టం చేసింది. ఈ పిటిషన్​ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనానికి పంపనున్నట్లు పేర్కొంది.

ఇదీ చూడండి: దేశంలో ఉగ్ర దాడులకు కుట్ర..! హై అలర్ట్​

'ఆపరేషన్​ కశ్మీర్'​పై అత్యవసర విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. నిర్ణీత సమయంలో విచారణ చేపడతామని స్పష్టం చేసింది.

ఆర్టికల్​ 370 రద్దుపై...

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు చేస్తూ ఇచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులపై సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలయింది. అత్యవసరంగా విచారణ చేపట్టాలని పిటిషనరైన న్యాయవాది ఎంఎల్​ శర్మ కోరారు. ఆగస్టు 12 లేదా 13న విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఆంక్షల తొలగింపునకు..

ఆర్టికల్​ 370, 35ఏ రద్దు కోసం జమ్ముకశ్మీర్​లో విధించిన ఆంక్షలు సడలించి, కర్ఫ్యూ ఎత్తివేయాలని పిటిషన్​ దాఖలు చేశారు కాంగ్రెస్​ కార్యకర్త తెహ్​సీన్​ పూనావాలా. కశ్మీర్​లో సమాచార వ్యవస్థను పునరుద్ధరించేందుకు, అరెస్ట్​ చేసిన నాయకులను వెంటనే విడుదల చేసేందుకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కశ్మీర్​ పరిస్థితులపై కమిషన్​ ఏర్పాటు చేయాలని విన్నవించారు. పిటిషన్​పై అత్యవసర విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

రెండు పిటిషన్లను పరిశీలించిన జస్టిస్ ఎన్​వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం అత్యవసర విచారణకు నిరాకరించింది. నిర్ణీత సమయంలో విచారణ జరుగుతుందని స్పష్టం చేసింది. ఈ పిటిషన్​ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనానికి పంపనున్నట్లు పేర్కొంది.

ఇదీ చూడండి: దేశంలో ఉగ్ర దాడులకు కుట్ర..! హై అలర్ట్​

Kathmandu (Nepal), Aug 07 (ANI): Fire broke out at Subisu Cable Net Office in Kathmandu's Baluwatar earlier today. The incident took place near the residence of Nepal Prime Minister KP Sharma Oli. No casualty has been reported till now. SSP Ranipokhari, Shyam Gyawali said, "There were around 200 persons inside at the time of incident. All were evacuated safely and there was no human casualty. We suspect fuel leakage from a barrel of petrol kept in the building to be the reason for start of blaze that later engulfed the building."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.