ETV Bharat / bharat

స్పీకర్​ నిర్ణయంతో 'బలపరీక్ష'పై అనుమానాలు..!

కన్నడ రాజకీయ సంక్షోభం.. మలుపులు తిరుగుతూనే ఉంది. ఈ రోజు బలపరీక్ష జరుగుతుందనుకుంటున్న తరుణంలో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. స్వతంత్ర ఎమ్మెల్యేల పిటిషన్లకు సుప్రీంలో చుక్కెదురైంది. మరోవైపు.. రెబల్స్​కు నోటీసులు పంపారు సభాపతి.

author img

By

Published : Jul 22, 2019, 11:46 AM IST

Updated : Jul 22, 2019, 1:01 PM IST

కర్ణాటకీయం: రెబల్స్​కు స్పీకర్​ నోటీసులు
కర్ణాటక అసెంబ్లీలో కీలక పరిణామాలు

కన్నడ అసెంబ్లీలో నేడు బలపరీక్ష.. జరిగే అవకాశాలపై అనిశ్చితి నెలకొంది. రెండు రోజుల అనంతరం... ప్రారంభమైన అసెంబ్లీలో ముఖ్యమంత్రి బలనిరూపణ జరుగుతుందని అంతా అనుకున్న తరుణంలో స్పీకర్​ కీలక నిర్ణయం తీసుకున్నారు.

రాజీనామాలు చేసిన రెబల్స్​ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు సభాపతి రమేశ్​ కుమార్​. మంగళవారం ఉదయం 11 గంటలకు తన కార్యాలయంలో కలవాల్సిందిగా ఆదేశించారు. సంకీర్ణ కూటమి నేతల ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు స్పీకర్​.

సుప్రీంలో చుక్కెదురు...

మరోవైపు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన స్వతంత్ర ఎమ్మెల్యేలిద్దరికీ చుక్కెదురైంది. కన్నడ అసెంబ్లీలో ఇవాళే.. ముఖ్యమంత్రి బలనిరూపణ చేసుకునేలా ఆదేశించాలని అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్​ దాఖలు చేశారు స్వతంత్ర శాసనసభ్యులు శంకర్​, నగేశ్​. తమ పిటిషన్లపై త్వరగా విచారణ చేపట్టాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చారు ప్రధాన న్యాయమూర్తి రంజన్​ గొగొయి. రేపు విచారణ జరుపుతామని స్పష్టం చేశారు.

బలనిరూపణపై అనుమానాలు...

ఇప్పటికే.. విప్​పై స్పష్టత అంశంలో సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, రాష్ట్ర కాంగ్రెస్​ అధ్యక్షుడు దినేశ్​ గుండూరావు. వీటన్నింటిపై అత్యున్నత న్యాయస్థానం.. రేపే విచారణ చేపట్టే అవకాశముంది. ఈ పరిణామాల నేపథ్యంలో నేడు బలపరీక్ష జరగదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంకీర్ణ కూటమి కూడా విశ్వాస పరీక్షపై చర్చను సాగదీసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

కర్ణాటక అసెంబ్లీలో కీలక పరిణామాలు

కన్నడ అసెంబ్లీలో నేడు బలపరీక్ష.. జరిగే అవకాశాలపై అనిశ్చితి నెలకొంది. రెండు రోజుల అనంతరం... ప్రారంభమైన అసెంబ్లీలో ముఖ్యమంత్రి బలనిరూపణ జరుగుతుందని అంతా అనుకున్న తరుణంలో స్పీకర్​ కీలక నిర్ణయం తీసుకున్నారు.

రాజీనామాలు చేసిన రెబల్స్​ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు సభాపతి రమేశ్​ కుమార్​. మంగళవారం ఉదయం 11 గంటలకు తన కార్యాలయంలో కలవాల్సిందిగా ఆదేశించారు. సంకీర్ణ కూటమి నేతల ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు స్పీకర్​.

సుప్రీంలో చుక్కెదురు...

మరోవైపు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన స్వతంత్ర ఎమ్మెల్యేలిద్దరికీ చుక్కెదురైంది. కన్నడ అసెంబ్లీలో ఇవాళే.. ముఖ్యమంత్రి బలనిరూపణ చేసుకునేలా ఆదేశించాలని అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్​ దాఖలు చేశారు స్వతంత్ర శాసనసభ్యులు శంకర్​, నగేశ్​. తమ పిటిషన్లపై త్వరగా విచారణ చేపట్టాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చారు ప్రధాన న్యాయమూర్తి రంజన్​ గొగొయి. రేపు విచారణ జరుపుతామని స్పష్టం చేశారు.

బలనిరూపణపై అనుమానాలు...

ఇప్పటికే.. విప్​పై స్పష్టత అంశంలో సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, రాష్ట్ర కాంగ్రెస్​ అధ్యక్షుడు దినేశ్​ గుండూరావు. వీటన్నింటిపై అత్యున్నత న్యాయస్థానం.. రేపే విచారణ చేపట్టే అవకాశముంది. ఈ పరిణామాల నేపథ్యంలో నేడు బలపరీక్ష జరగదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంకీర్ణ కూటమి కూడా విశ్వాస పరీక్షపై చర్చను సాగదీసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

AP Video Delivery Log - 0500 GMT News
Monday, 22 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0426: Australia PNG No access Australia 4221481
PNG, Australian PMs meet, Marape on China
AP-APTN-0357: Mexico Child Migrants AP Clients Only 4221474
Teen mum, newborn eye new life from Tijuana
AP-APTN-0344: China Tech Stocks No access mainland China 4221480
Trading begins on new Chinese stock exchange board
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jul 22, 2019, 1:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.