ETV Bharat / bharat

మసీదుల్లో మహిళల ప్రవేశంపై కేంద్రానికి నోటీసులు

author img

By

Published : Apr 16, 2019, 12:44 PM IST

Updated : Apr 16, 2019, 3:14 PM IST

మసీదుల్లోకి మహిళల ప్రవేశం కోరుతూ దాఖలైన పిటిషన్​ను​ విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. వ్యాజ్యంపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్​ వక్ఫ్​ బోర్డు, ఆలిండియా ముస్లిం పర్సనల్​ లా బోర్డులకు నోటీసులు జారీ చేసింది. వ్యాజ్యం స్వీకరించడానికి శబరిమల తీర్పే కారణమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

మసీదుల్లో మహిళల ప్రవేశంపై కేంద్రానికి నోటీసులు
మసీదుల్లో మహిళల ప్రవేశంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

మసీదుల్లోకి మహిళలను అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు సమ్మతించింది. పుణెకు చెందిన ముస్లిం దంపతులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని జస్టిస్ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది.

కేంద్రానికి నోటీసులు

వ్యాజ్యంపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు, జాతీయ మహిళా కమిషన్, ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డులకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ప్రపంచంలో ఇంకెక్కడైనా మసీదుల్లోకి మహిళలను ప్రార్థనలకు అనుమతిస్తున్నారా అని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.

కెనడా, సౌదీ అరేబియా సహా కొన్నిచోట్ల అనుమతి ఉందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వివరించారు. మహిళలను అనుమతించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని, మహిళా హక్కులకు భంగమని వాదించారు.

శబరిమల తీర్పే కారణం

శబరిమల అయ్యప్ప ఆలయం విషయంలో ఇచ్చిన తీర్పు కారణంగానే ఈ పిటిషన్‌నూ విచారణకు స్వీకరించినట్లు ధర్మాసనం పేర్కొంది.

మసీదుల్లో మహిళల ప్రవేశంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

మసీదుల్లోకి మహిళలను అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు సమ్మతించింది. పుణెకు చెందిన ముస్లిం దంపతులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని జస్టిస్ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది.

కేంద్రానికి నోటీసులు

వ్యాజ్యంపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు, జాతీయ మహిళా కమిషన్, ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డులకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ప్రపంచంలో ఇంకెక్కడైనా మసీదుల్లోకి మహిళలను ప్రార్థనలకు అనుమతిస్తున్నారా అని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.

కెనడా, సౌదీ అరేబియా సహా కొన్నిచోట్ల అనుమతి ఉందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వివరించారు. మహిళలను అనుమతించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని, మహిళా హక్కులకు భంగమని వాదించారు.

శబరిమల తీర్పే కారణం

శబరిమల అయ్యప్ప ఆలయం విషయంలో ఇచ్చిన తీర్పు కారణంగానే ఈ పిటిషన్‌నూ విచారణకు స్వీకరించినట్లు ధర్మాసనం పేర్కొంది.

Lucknow (UP), Apr 16 (ANI): Uttar Pradesh's Chief Minister Yogi Adityanath reached the Hanuman Setu temple in Lucknow on Tuesday, where he worshiped and took god's blessings. During this time, the CM Yogi Adityanath in the temple also recited Hanuman Chalisa. CM Yogi Adityanath has been banned for 72 hours due to the violation of the Model Code of Conduct.

Last Updated : Apr 16, 2019, 3:14 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.