కరోనాపై పోరులో భాగంగా దేశం లాక్డౌన్లోకి వెళ్లిపోయినప్పటి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే కేసుల విచారణ చేపడుతోంది సుప్రీం కోర్టు. లాక్డౌన్ నెల రోజుల వ్యవధిలో 593 కేసులను విచారించిన సుప్రీం 215 తీర్పులుచ్చింది.
తొలి దశ లాక్డౌన్కు రెండు రోజుల(మార్చి 23) ముందే కోర్టులోకి పిటిషనర్లు, న్యాయవాదులకు అనుమతిని నిరాకరించింది అత్యున్నత న్యాయస్థానం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యవసర కేసులను మాత్రమే విచారించనున్నట్టు స్పష్టం చేసింది.
మార్చి 23- ఏప్రిల్ 24 వరకు ఇలా...
- 87 ధర్మాసనాలు మొత్తం 593కేసులను విచారించాయి.
- 84 రివ్యూ పిటిషన్లను కొట్టివేసింది.
- 87 ధర్మాసనాలు 34 కొత్త కేసులను విచారించగా... 53 రివ్యూ పిటిషన్లు పరిశీలించాయి.
- వీటిలో 390 ముఖ్య కేసులు, 203 అనుబంధ కేసులున్నాయి.
వీసీ ద్వారా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు 100ఎంబీపీఎస్ హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అందించినట్టు సమాచారం.
ఇదీ చూడండి:- ఒకప్పుడు కాలుష్య కేంద్రాలు- ఇప్పుడు గ్రీన్ జోన్లు