అయోధ్య తీర్పుపై సమీక్షకు నిరాకరించింది సుప్రీంకోర్టు. నవంబర్ 9న ఇచ్చిన చారిత్రక తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన 19 వ్యాజ్యాలను కొట్టేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం రివ్యూ పిటిషన్లను పరిశీలించింది. ఆ వ్యాజ్యాలకు విచారణ అర్హత లేదని, అన్నింటినీ కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.
అయోధ్య కేసు తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన వ్యాజ్యాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆ పిటిషన్లకు అసలు విచారణ అర్హత లేదని తేల్చిచెప్పింది.
అయోధ్య కేసుతో సంబంధమున్న అఖిల భారత ముస్లిం లా బోర్డు, సున్నీ వక్ఫ్ బోర్డు సహా ముస్లిం పార్టీల తరఫున 10 వ్యాజ్యాలు దాఖలయ్యాయి. 40 మంది హక్కుల ఉద్యమకారులు మిగిలిన 9 వ్యాజ్యాల్ని ఇతరులు వేశారు.
ఇదీ తీర్పు...
అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి సుప్రీం కోర్టు నవంబర్ 9న ముగింపు పలికింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమిలో రామ మందిర నిర్మాణం చేపట్టాలని స్పష్టంచేసింది. మసీదు నిర్మాణానికి.. 5 ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు అయోధ్యలోనే కేటాయించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
ఇదీ చూడండి: 'మహా' పంపకం: సేనకు హోం, ఎన్సీపీకి ఆర్థిక శాఖ