ETV Bharat / bharat

తితిదే తరహాలో శబరిమలకు ప్రత్యేక నిర్వహణ బోర్డు!

author img

By

Published : Nov 20, 2019, 3:08 PM IST

శబరిమల ఆలయ నిర్వహణపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. అయ్యప్ప దేవస్థానం నిర్వహణకు కొత్త చట్టం రూపొందించాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2020 జనవరి మూడో వారంలోపు కొత్త చట్టం వివరాల్ని కోర్టుకు నివేదించాలని స్పష్టం చేసింది. మహిళల ప్రవేశంపై 2018లో ఇచ్చిన తీర్పు కొనసాగుతుందని తెలిపింది.

తితిదే తరహాలో శబరిమలకు ప్రత్యేక నిర్వహణ బోర్డు!

శబరిమల ఆలయ నిర్వహణకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. అయ్యప్ప ఆలయ నిర్వహణపై 2011లో దాఖలైన వ్యాజ్యాన్ని విచారించింది న్యాయస్థానం. భక్తుల సంక్షేమంతో పాటు దేవస్థాన నిర్వహణకు సంబంధించిన చట్టాన్ని వచ్చే ఏడాది జనవరి మూడో వారంలోగా కోర్టుకు నివేదించాలని ఆదేశించింది.

ప్రత్యేక బోర్డు అవసరం

కేరళలోని ఇతర ఆలయాలతో కలిపి చట్టం తీసుకురావడం సమంజసం కాదని జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. తితిదే, గురవాయూర్‌ తరహాలో ప్రత్యేక బోర్డు ఎందుకు ఏర్పాటు చేయకూడదని ప్రశ్నించింది. ఆలయంలోకి మహిళలందరినీ అనుమతించిన గతేడాది తీర్పులో ఏ మార్పూ లేదని స్పష్టం చేసింది.

" ఒకే ఐఏఎస్‌ అధికారి పర్యవేక్షణలో 3 వేల ఆలయాల నిర్వహణ ఉండటం సరికాదు. భక్తుల రద్దీ దృష్ట్యా శబరిమలను ప్రత్యేకంగా గుర్తించాలి. మహిళల ప్రవేశంపై 2018లో ఇచ్చిన తీర్పు కొనసాగుతుంది."
- సుప్రీంకోర్టు

విస్తృత ధర్మాసనానికి బదిలీ

శబరిమలకు మహిళలందరినీ అనుమతిస్తూ గతేడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ దాఖలైన వ్యాజ్యాలను పెండింగ్​లో ఉంచింది న్యాయస్థానం. ఈ అంశాన్ని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. గతేడాది తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

శబరిమల ఆలయ నిర్వహణకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. అయ్యప్ప ఆలయ నిర్వహణపై 2011లో దాఖలైన వ్యాజ్యాన్ని విచారించింది న్యాయస్థానం. భక్తుల సంక్షేమంతో పాటు దేవస్థాన నిర్వహణకు సంబంధించిన చట్టాన్ని వచ్చే ఏడాది జనవరి మూడో వారంలోగా కోర్టుకు నివేదించాలని ఆదేశించింది.

ప్రత్యేక బోర్డు అవసరం

కేరళలోని ఇతర ఆలయాలతో కలిపి చట్టం తీసుకురావడం సమంజసం కాదని జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. తితిదే, గురవాయూర్‌ తరహాలో ప్రత్యేక బోర్డు ఎందుకు ఏర్పాటు చేయకూడదని ప్రశ్నించింది. ఆలయంలోకి మహిళలందరినీ అనుమతించిన గతేడాది తీర్పులో ఏ మార్పూ లేదని స్పష్టం చేసింది.

" ఒకే ఐఏఎస్‌ అధికారి పర్యవేక్షణలో 3 వేల ఆలయాల నిర్వహణ ఉండటం సరికాదు. భక్తుల రద్దీ దృష్ట్యా శబరిమలను ప్రత్యేకంగా గుర్తించాలి. మహిళల ప్రవేశంపై 2018లో ఇచ్చిన తీర్పు కొనసాగుతుంది."
- సుప్రీంకోర్టు

విస్తృత ధర్మాసనానికి బదిలీ

శబరిమలకు మహిళలందరినీ అనుమతిస్తూ గతేడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ దాఖలైన వ్యాజ్యాలను పెండింగ్​లో ఉంచింది న్యాయస్థానం. ఈ అంశాన్ని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. గతేడాది తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

AP Video Delivery Log - 0800 GMT News
Wednesday, 20 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0717: US DC Impeach GOP Reax AP Clients Only 4240806
Republicans: 'a good day for the president
AP-APTN-0706: In Air Pope Thailand AP Clients Only 4240801
Pope greets journalists on plane to Thailand
AP-APTN-0610: Hong Kong Clean Up AP Clients Only 4240802
Clear-up of Hong Kong tunnel after clashes
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.