ETV Bharat / bharat

అంతిమ యాత్రలో పాల్గొన్న 500 మందిపై కేసు

author img

By

Published : Jun 12, 2020, 11:17 AM IST

ఓ వైపు కరోనా మహమ్మారి ఏ వైపు నుంచి వచ్చి దాడి చేస్తుందో తెలియక.. గడప దాటేందుకే భయపడుతున్నారు జనం. కానీ, ఒడిశాలో మాత్రం కొందరు కొవిడ్​ను లెక్కచేయలేదు. కరోనా జాగ్రత్తలు పాటించకుండా.. హత్యకు గురైన ఓ వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ​

Od-rkl-3-police registered case-avo-ru-7204000
అంతిమ యాత్రలో పాల్గొన్న 500 మందిపై కేసు నమోదు!

ఒడిశా రవుర్కెలాలో ఓ అంతిమ యాత్రలో 500 మందికి పైగా హాజరై కరోనా భయాలను తుంగలో తొక్కారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో కలకలం రేపుతోంది. నిబంధనలు ఉల్లంఘిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు నెటిజన్లు.

లాక్​డౌన్​ నిబంధనల ఉల్లంఘన

ఈ ఘటనపై రవుర్కెలాా పోలీసులు స్పందించారు. లాక్​డౌన్​ నియమాలు ఉల్లంఘించినవారిపై కేసు నమోదు చేశారు. భారతీయ శిక్షా స్మృతి సెక్షన్ 167/202, 269/34, అంటువ్యాధుల చట్టం 3ల కింద కేసు నమోదు చేసి.. వారిని వెతికి పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Rourkela funeral procession: Plantsite police registered case
అంతిమ యాత్రలో పాల్గొన్న 500 మందిపై కేసు నమోదు!

"రవుర్కెలా, ప్లాంటైట్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని.. రైల్వే కాలనీలో ఈ నెల 8న ఓ హత్య జరిగింది. పోస్ట్​మార్టం చేసిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. అంతిమ యాత్రలో 500కు పైగా జనం పాల్గొన్నారు. కరోనా కాలంలో మాస్క్​ లేకుండా, భౌతిక దూరం పాటించకుండా లాక్​డౌన్​ నిబంధనలను ఉల్లంఘించారు. వీరి వల్ల కరోనా వ్యాప్తి మరింత పెరిగే అవకాశముంది."

-సూపరింటెండెంట్​ ఆఫ్​ పోలీస్​, రవుర్కెలా

ఇదీ చదవండి: 'యూ ఫర్ అగ్లీ' అని నేర్పిన టీచర్లు.. సస్పెండ్​!

ఒడిశా రవుర్కెలాలో ఓ అంతిమ యాత్రలో 500 మందికి పైగా హాజరై కరోనా భయాలను తుంగలో తొక్కారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో కలకలం రేపుతోంది. నిబంధనలు ఉల్లంఘిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు నెటిజన్లు.

లాక్​డౌన్​ నిబంధనల ఉల్లంఘన

ఈ ఘటనపై రవుర్కెలాా పోలీసులు స్పందించారు. లాక్​డౌన్​ నియమాలు ఉల్లంఘించినవారిపై కేసు నమోదు చేశారు. భారతీయ శిక్షా స్మృతి సెక్షన్ 167/202, 269/34, అంటువ్యాధుల చట్టం 3ల కింద కేసు నమోదు చేసి.. వారిని వెతికి పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Rourkela funeral procession: Plantsite police registered case
అంతిమ యాత్రలో పాల్గొన్న 500 మందిపై కేసు నమోదు!

"రవుర్కెలా, ప్లాంటైట్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని.. రైల్వే కాలనీలో ఈ నెల 8న ఓ హత్య జరిగింది. పోస్ట్​మార్టం చేసిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. అంతిమ యాత్రలో 500కు పైగా జనం పాల్గొన్నారు. కరోనా కాలంలో మాస్క్​ లేకుండా, భౌతిక దూరం పాటించకుండా లాక్​డౌన్​ నిబంధనలను ఉల్లంఘించారు. వీరి వల్ల కరోనా వ్యాప్తి మరింత పెరిగే అవకాశముంది."

-సూపరింటెండెంట్​ ఆఫ్​ పోలీస్​, రవుర్కెలా

ఇదీ చదవండి: 'యూ ఫర్ అగ్లీ' అని నేర్పిన టీచర్లు.. సస్పెండ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.