ETV Bharat / bharat

ప్రింట్​ మీడియా అధినేతలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్​

దేశంలోని ప్రింట్​ మీడియా అధినేతలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. కరోనా వైరస్​ నేపథ్యంలో వారితో చర్చలు జరిపారు. ప్రాణాంతక వైరస్​పై పోరులో మీడియా పాత్రను కొనియాడారు. ఈనాడు వ్యవస్థాపకులు రామోజీ రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించడం ఇది వరుసగా రెండో రోజు.

author img

By

Published : Mar 24, 2020, 2:30 PM IST

Updated : Mar 24, 2020, 3:57 PM IST

rime Minister Narendra Modi interacts with print media heads through video conferencing, over #COVID19
ప్రింట్​ మీడియా అధినేతలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్​
ప్రింట్​ మీడియా అధినేతలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్​

కరోనా ​వైరస్​పై కలిసికట్టుగా పోరాడాలన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. దేశంలో కరోనా వైరస్​ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రింట్​ మీడియా అధినేతలతో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా భేటీ అయ్యారు. ఈనాడు వ్యవస్థాపకులు రామోజీ రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

వైరస్ నియంత్రణకు సమాచార మాధ్యమాలు చేస్తున్న కృషిని అభినందించారు మోదీ. వైరస్​ కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.

కరోనా వైరస్ తీవ్రతను అర్థం చేసుకొని.. వైరస్​పై అవగాహన పెంచడంలో మీడియా చేసిన కృషిని మోదీ కొనియాడారు. సుదీర్ఘమైన ఈ యుద్ధాన్ని ఎదుర్కోవడానికి తాజా సమాచారాన్ని ప్రజలకు అర్థమయ్యే భాషలో ప్రజలకు అందించాలని పేర్కొన్నారు. మీడియా అందించే సమాచారం ప్రభుత్వానికి సైతం కీలకమైన ఫీడ్​బ్యాక్​లా ఉంటుందన్నారు. శాస్త్రీయమైన రిపోర్టులను ప్రజలకు తెలియజేయాలని కోరారు. మీడియా అధినేతలతో మోదీ.. వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొనడం వరుసగా ఇది రెండోరోజు.

ప్రింట్​ మీడియా అధినేతలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్​

కరోనా ​వైరస్​పై కలిసికట్టుగా పోరాడాలన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. దేశంలో కరోనా వైరస్​ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రింట్​ మీడియా అధినేతలతో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా భేటీ అయ్యారు. ఈనాడు వ్యవస్థాపకులు రామోజీ రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

వైరస్ నియంత్రణకు సమాచార మాధ్యమాలు చేస్తున్న కృషిని అభినందించారు మోదీ. వైరస్​ కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.

కరోనా వైరస్ తీవ్రతను అర్థం చేసుకొని.. వైరస్​పై అవగాహన పెంచడంలో మీడియా చేసిన కృషిని మోదీ కొనియాడారు. సుదీర్ఘమైన ఈ యుద్ధాన్ని ఎదుర్కోవడానికి తాజా సమాచారాన్ని ప్రజలకు అర్థమయ్యే భాషలో ప్రజలకు అందించాలని పేర్కొన్నారు. మీడియా అందించే సమాచారం ప్రభుత్వానికి సైతం కీలకమైన ఫీడ్​బ్యాక్​లా ఉంటుందన్నారు. శాస్త్రీయమైన రిపోర్టులను ప్రజలకు తెలియజేయాలని కోరారు. మీడియా అధినేతలతో మోదీ.. వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొనడం వరుసగా ఇది రెండోరోజు.

Last Updated : Mar 24, 2020, 3:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.