ETV Bharat / bharat

'రూ.100 కోట్లకు ఐఎన్​ఎస్​ విరాట్ అమ్మకం'

author img

By

Published : Oct 1, 2020, 7:52 PM IST

అత్యంత ఎక్కువ కాలం యుద్ధ రంగంలో సేవలందించిన నౌక ఐఎన్ఎస్​ విరాట్​. 2017 వరకు భారత నావికా దళంలో కొనసాగిన ఈ నౌక.. ప్రస్తుతం ఓ ప్రైవేటు సంస్థ అధీనంలో ఉంది. త్వరలోనే 'విరాట్​'ను విచ్ఛిన్నం చేయాలని భావిస్తోంది ఆ సంస్థ. అయితే యుద్ధ నౌకను మ్యూజియంలా మార్చాలని భావిస్తున్న మరో సంస్థ... రూ.100కోట్లకు విరాట్​ను కొనుగోలు చేయడంపై చర్చలు జరుపుతోంది.

Ready to sell 'Viraat' for Rs 100 cr if co gets NOC: Firm
అమ్మకానికి విరాట్​.. విచ్ఛిన్నాన్ని అడ్డుకుంటున్న ముంబయి కంపెనీ

ఐఎన్​ఎస్​ విరాట్​ యుద్ధనౌకను రూ.100 కోట్లకు అమ్మడానికి సిద్ధమైంది శ్రీరామ్​ గ్రూప్​. ముంబయికి చెందిన ఓ కంపెనీ ఈ నౌకను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ యుద్ధనౌకను విచ్ఛిన్నం కాకుండా ఆపి, మ్యూజియమ్​లాగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తోంది.

1987 నుంచి 2017 వరకు భారత నావికా దళంలో సేవలందించిన 'విరాట్'ను.. ఈ ఏడాది జులైలో రూ.38.54 కోట్లకు వేలంలో శ్రీరామ్​ గ్రూప్​ కొనుగోలు చేసింది. ఈ నౌకను విచ్ఛిన్నం చేసేందుకు గుజరాత్​లోని అలంగ్​ తీర ప్రాంతానికి గతవారం తరలించారు.

ఎన్​ఓసీ తప్పనిసరి..

ఈ నౌకను ఎవరైనా కొనుగోలు చేయాలంటే, రక్షణ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్​ఓసీ) తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు శ్రీరామ్​ గ్రూప్​ ఛైర్మన్​ ముఖేష్​ పటేల్​.

"దేశం మీద ప్రేమతో నేను ఈ యుద్ధనౌకను కొన్నాను. ప్రస్తుతం ముంబయికి చెందిన ఓ కంపెనీ.. ఈ నౌకను కొని, మ్యూజియమ్​లాగా మార్చాలని భావిస్తోంది. వాళ్లు దేశ భక్తితోనే ఈ పని చేస్తున్నందున.. నేను వారికి అమ్మేందుకు అంగీకరించాను. అయితే.. వారు రక్షణ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. అది లేకుండా నేను వారికి అమ్మలేను. ఎన్​ఓసీ కోసం ఆ కంపెనీ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. అయినప్పటికీ.. నేను ఎక్కువకాలం వేచిచూడను. వారం వరకే గడువు ఇస్తాను. ఆ తర్వాత ఈ నౌకను విచ్ఛిన్నం చేస్తాను."

- ముఖేష్​ పటేల్, శ్రీరామ్​ గ్రూప్​ ఛైర్మన్

'మాకు ఎన్​ఓసీ అందుతుంది'

ఎన్విటెక్​ మెరైన్​ కన్సల్టెన్సీస్​ ప్రైవేట్​ లిమిటెడ్​ సంస్థ మేనేజింగ్​ డైరెక్టర్​ వీకే శర్మ ఈ నౌకను కొనగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఎన్​ఓసీ పొందేందుకు గోవా ప్రభుత్వం సహకరిస్తోందని చెప్పారు.

"ఎన్​ఓసీ కోసం మేము తీవ్రంగా ప్రయత్నిస్తున్నాము. మాకు త్వరలోనే అది లభిస్తుంది. నేను వ్యక్తిగతంగా ముఖేష్​ను కలిశాను. ధర విషయంలోనూ ఓ అంగీకారానికి వచ్చాం."

- వీకే శర్మ, ఈఎమ్​సీఎస్​ ప్రైవేట్​ లిమిటెడ్​

ఇదీ విరాట్​ చరిత్ర..

  • ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం యుద్ధ రంగంలో సేవలు అందించిన నౌకగా గుర్తింపు.
  • విరాట్​ను విడదీస్తే.. భారత్​లో విచ్ఛిన్నమవుతున్న రెండో యుద్ధ నౌకగా పేరుపొందుతుంది. అంతకుముందు 2014లో ఐఎన్​ఎస్​ విక్రాంత్​ను విచ్ఛిన్నం చేశారు.
  • డెబ్భై ఏళ్ల చరిత్ర కలిగిన ఐఎన్​ఎస్​ విరాట్​.. 1982లో రాయల్​ బ్రిటిష్​ నేవీ తరఫున ​ఫాక్లాండ్స్​ తరఫున పోరాడి.. అర్జెంటీనా యుద్ధంలో విజయాన్నందించింది.
  • ఐఎన్​ఎస్​ విరాట్​ బరువు 27,800 టన్నులు.
  • ​1959 నవంబర్ నుంచి 1984 ఏప్రిల్​ వరకు బ్రిటిష్​ నేవీ హెచ్​ఎమ్​ఎస్ హెర్మెస్​లో సేవలు అందించింది.
  • పునరుద్ధరణ అనంతరం.. 1987లో భారత నౌకా దళంలో అడుగుపెట్టింది. 2017లో సేవలను విరమించింది.

ఇదీ చదవండి: 30 ఏళ్లపాటు సేవలందించిన నౌక ఆఖరి యాత్ర

ఐఎన్​ఎస్​ విరాట్​ యుద్ధనౌకను రూ.100 కోట్లకు అమ్మడానికి సిద్ధమైంది శ్రీరామ్​ గ్రూప్​. ముంబయికి చెందిన ఓ కంపెనీ ఈ నౌకను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ యుద్ధనౌకను విచ్ఛిన్నం కాకుండా ఆపి, మ్యూజియమ్​లాగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తోంది.

1987 నుంచి 2017 వరకు భారత నావికా దళంలో సేవలందించిన 'విరాట్'ను.. ఈ ఏడాది జులైలో రూ.38.54 కోట్లకు వేలంలో శ్రీరామ్​ గ్రూప్​ కొనుగోలు చేసింది. ఈ నౌకను విచ్ఛిన్నం చేసేందుకు గుజరాత్​లోని అలంగ్​ తీర ప్రాంతానికి గతవారం తరలించారు.

ఎన్​ఓసీ తప్పనిసరి..

ఈ నౌకను ఎవరైనా కొనుగోలు చేయాలంటే, రక్షణ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్​ఓసీ) తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు శ్రీరామ్​ గ్రూప్​ ఛైర్మన్​ ముఖేష్​ పటేల్​.

"దేశం మీద ప్రేమతో నేను ఈ యుద్ధనౌకను కొన్నాను. ప్రస్తుతం ముంబయికి చెందిన ఓ కంపెనీ.. ఈ నౌకను కొని, మ్యూజియమ్​లాగా మార్చాలని భావిస్తోంది. వాళ్లు దేశ భక్తితోనే ఈ పని చేస్తున్నందున.. నేను వారికి అమ్మేందుకు అంగీకరించాను. అయితే.. వారు రక్షణ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. అది లేకుండా నేను వారికి అమ్మలేను. ఎన్​ఓసీ కోసం ఆ కంపెనీ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. అయినప్పటికీ.. నేను ఎక్కువకాలం వేచిచూడను. వారం వరకే గడువు ఇస్తాను. ఆ తర్వాత ఈ నౌకను విచ్ఛిన్నం చేస్తాను."

- ముఖేష్​ పటేల్, శ్రీరామ్​ గ్రూప్​ ఛైర్మన్

'మాకు ఎన్​ఓసీ అందుతుంది'

ఎన్విటెక్​ మెరైన్​ కన్సల్టెన్సీస్​ ప్రైవేట్​ లిమిటెడ్​ సంస్థ మేనేజింగ్​ డైరెక్టర్​ వీకే శర్మ ఈ నౌకను కొనగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఎన్​ఓసీ పొందేందుకు గోవా ప్రభుత్వం సహకరిస్తోందని చెప్పారు.

"ఎన్​ఓసీ కోసం మేము తీవ్రంగా ప్రయత్నిస్తున్నాము. మాకు త్వరలోనే అది లభిస్తుంది. నేను వ్యక్తిగతంగా ముఖేష్​ను కలిశాను. ధర విషయంలోనూ ఓ అంగీకారానికి వచ్చాం."

- వీకే శర్మ, ఈఎమ్​సీఎస్​ ప్రైవేట్​ లిమిటెడ్​

ఇదీ విరాట్​ చరిత్ర..

  • ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం యుద్ధ రంగంలో సేవలు అందించిన నౌకగా గుర్తింపు.
  • విరాట్​ను విడదీస్తే.. భారత్​లో విచ్ఛిన్నమవుతున్న రెండో యుద్ధ నౌకగా పేరుపొందుతుంది. అంతకుముందు 2014లో ఐఎన్​ఎస్​ విక్రాంత్​ను విచ్ఛిన్నం చేశారు.
  • డెబ్భై ఏళ్ల చరిత్ర కలిగిన ఐఎన్​ఎస్​ విరాట్​.. 1982లో రాయల్​ బ్రిటిష్​ నేవీ తరఫున ​ఫాక్లాండ్స్​ తరఫున పోరాడి.. అర్జెంటీనా యుద్ధంలో విజయాన్నందించింది.
  • ఐఎన్​ఎస్​ విరాట్​ బరువు 27,800 టన్నులు.
  • ​1959 నవంబర్ నుంచి 1984 ఏప్రిల్​ వరకు బ్రిటిష్​ నేవీ హెచ్​ఎమ్​ఎస్ హెర్మెస్​లో సేవలు అందించింది.
  • పునరుద్ధరణ అనంతరం.. 1987లో భారత నౌకా దళంలో అడుగుపెట్టింది. 2017లో సేవలను విరమించింది.

ఇదీ చదవండి: 30 ఏళ్లపాటు సేవలందించిన నౌక ఆఖరి యాత్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.