ETV Bharat / bharat

'అభివృద్ధికే బిహార్​ ప్రజల పట్టం'

author img

By

Published : Nov 14, 2020, 6:35 AM IST

బిహార్​లో ఎన్డీఏ గెలుపుపై ఈనాడుతో మాట్లాడారు భాజపా సీనియర్​ నేత, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​. ఈ సారి కులాలకు అతీతంగా ప్రజలు ఓటేశారని, అభివృద్ధినే ఆకాంక్షించారని ఆయన వెల్లడించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే సామర్థ్యం తమకే ఉందని ఉద్ఘాటించారు.

Ravi Shankar Prasad interview to eenadu about NDA victory in Bihar
'అభివృద్ధికే బిహార్​ ప్రజల పట్టం'

ఎన్డీఏ అమలుచేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలని బిహార్​ ప్రజలు కోరుకుంటున్నట్లు భాజపా నేత, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ తెలిపారు. అందువల్లే వారు మరోసారి ఎన్డీఏను గెలిపించారని అన్నారు. మహాఘట్​ బంధన్​, ఎన్డీఏ అభ్యర్థుల మధ్య ఓట్ల శాతం స్వల్పంగా ఉన్నమాట వాస్తవమేనన్నారు. అయితే, చిరాగ్​ పాసవాన్​ నేతృత్వంలోని లోక్​జనశక్తి పార్టీ వల్లే ఎన్డీఏ ఓట్లు చీలిపోయాయని, లేకుంటే 135 స్థానాల వరకూ గెలుచుకునేవారమని ఈనాడుకు తెలిపారు.

''బిహార్​ చాలాకాలం పాటు సామాజిక వర్గాల అస్తిత్వ రాజకీయాలకు మారుపేరుగా ఉండేది. ఈ దఫా కులాలకు అతీతంగా ప్రజలు ఓటేశారు. అభివృద్ధినే ఆకాంక్షించారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించగల సామర్థ్యం ఎవరికుందో వాళ్లు గుర్తించారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ల నాయకత్వాన్ని విశ్వసించారు. బిహార్​లో ఇప్పుడు రెండు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఒక ఎయిమ్స్​ పనిచేస్తున్నాయి. మరో ఎయిమ్స్​ కూడా రాబోతోంది. నిఫ్ట్​, ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు రాష్ట్రంలో ఏర్పాటయ్యాయి. ఉజ్వల పథకం ద్వారా గ్యాస్​ కనెక్షన్లను మహిళలు పొందారు. వివిధ పథకాల ద్వారా నగదు బదిలీ నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకే వెళ్తోంది.

రైతులు పీఎం కిసాన్​ పథకం ద్వారా ఏటా రూ. 6 వేలు పొందుతున్నారు. లాక్​డౌన్​లో 8 కోట్ల మంది బిహారీలకు ఉచిత భోజనాలు అందించాయి. ఇవి పేదలను ఆకట్టుకున్నాయి. 15 ఏళ్ల క్రితం నాటి జంగిల్​ రాజ్​లోని కష్టాలను వాళ్లింకా మరవలేదు. అందుకే ఎన్డీఏకు పట్టం కట్టారు.''

- రవిశంకర్​ ప్రసాద్​, కేంద్ర న్యాయశాఖ మంత్రి

ఎన్డీఏ అమలుచేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలని బిహార్​ ప్రజలు కోరుకుంటున్నట్లు భాజపా నేత, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ తెలిపారు. అందువల్లే వారు మరోసారి ఎన్డీఏను గెలిపించారని అన్నారు. మహాఘట్​ బంధన్​, ఎన్డీఏ అభ్యర్థుల మధ్య ఓట్ల శాతం స్వల్పంగా ఉన్నమాట వాస్తవమేనన్నారు. అయితే, చిరాగ్​ పాసవాన్​ నేతృత్వంలోని లోక్​జనశక్తి పార్టీ వల్లే ఎన్డీఏ ఓట్లు చీలిపోయాయని, లేకుంటే 135 స్థానాల వరకూ గెలుచుకునేవారమని ఈనాడుకు తెలిపారు.

''బిహార్​ చాలాకాలం పాటు సామాజిక వర్గాల అస్తిత్వ రాజకీయాలకు మారుపేరుగా ఉండేది. ఈ దఫా కులాలకు అతీతంగా ప్రజలు ఓటేశారు. అభివృద్ధినే ఆకాంక్షించారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించగల సామర్థ్యం ఎవరికుందో వాళ్లు గుర్తించారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ల నాయకత్వాన్ని విశ్వసించారు. బిహార్​లో ఇప్పుడు రెండు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఒక ఎయిమ్స్​ పనిచేస్తున్నాయి. మరో ఎయిమ్స్​ కూడా రాబోతోంది. నిఫ్ట్​, ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు రాష్ట్రంలో ఏర్పాటయ్యాయి. ఉజ్వల పథకం ద్వారా గ్యాస్​ కనెక్షన్లను మహిళలు పొందారు. వివిధ పథకాల ద్వారా నగదు బదిలీ నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకే వెళ్తోంది.

రైతులు పీఎం కిసాన్​ పథకం ద్వారా ఏటా రూ. 6 వేలు పొందుతున్నారు. లాక్​డౌన్​లో 8 కోట్ల మంది బిహారీలకు ఉచిత భోజనాలు అందించాయి. ఇవి పేదలను ఆకట్టుకున్నాయి. 15 ఏళ్ల క్రితం నాటి జంగిల్​ రాజ్​లోని కష్టాలను వాళ్లింకా మరవలేదు. అందుకే ఎన్డీఏకు పట్టం కట్టారు.''

- రవిశంకర్​ ప్రసాద్​, కేంద్ర న్యాయశాఖ మంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.