ETV Bharat / bharat

'మద్దాలి శివారెడ్డి'తో ఈటీవీ భారత్​ ముఖాముఖి

author img

By

Published : Apr 22, 2019, 7:32 AM IST

మద్దాలి శివారెడ్డి... అల్లు అర్జున్​ 'రేసుగుర్రం' సినిమాలో ప్రతినాయకుడు. ఆ పాత్ర పోషించిన నటుడు రవి కిషన్​. రాజకీయ నేతగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు​. ఇప్పుడు నిజ జీవితంలో రాజకీయాల్లోకి దిగాడు. ఉత్తర్​ప్రదేశ్​ గోరఖ్​పుర్​ నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. రియల్​ లైఫ్​లో ఈ సరికొత్త సినిమా విజయావకాశాలపై ఈటీవీ భారత్​ ఆయనతో ముచ్చటించింది.

'మద్దాలి శివారెడ్డి'తో ఈటీవీ భారత్​ ముఖాముఖి
'మద్దాలి శివారెడ్డి'తో ఈటీవీ భారత్​ ముఖాముఖి

గోరఖ్​పుర్​.... ఉత్తర్​ప్రదేశ్​లోని లోక్​సభ నియోజకవర్గం. భాజపాకు ఎంతో ప్రతిష్టాత్మకం. ఎందుకంటే... అది ఒకప్పుడు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ సొంత నియోజకవర్గం. 2018 ఉపఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ పొత్తు ప్రభావంతో పరాజయం చవిచూసింది కమలదళం. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల రూపంలో ఆ సీటును తిరిగి దక్కించుకునే అవకాశం వచ్చింది. విస్తృత కసరత్తు చేసి, సినీ నటుడు రవి కిషన్​ను రంగంలోకి దింపింది భాజపా.

రవి కిషన్​కు రాజకీయం కొత్త. అలాంటి వ్యక్తి... గోరఖ్​పుర్​లో విజయం కోసం ఎలాంటి వ్యూహం అనుసరిస్తున్నారు? గెలిస్తే... అక్కడి ప్రజల కోసం ఏం చేస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం రాబట్టే ప్రయత్నం చేసింది ఈటీవీ భారత్​.

ప్ర- గోరఖ్​పుర్​ నుంచి భాజపా అభ్యర్థిగా బరిలో నిలిచారు భోజ్​పూరి సూపర్​స్టార్​ రవికిషన్​. ఈ ఎన్నికల్లో ఎలా గెలుస్తారనే విషయంపై ఆయననే అడిగి తెలుసుకుందాం? రవికిషన్.. ఏమంటారు?

జ- బాబా గోరఖ్​నాథుని నేలపై నుంచి ఈటీవీ భారత్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా గెలుపు అవకాశాలపై ఎక్కడ్నుంచి మొదలు పెట్టాలంటారు. నేను గోరఖ్​పుర్​లో అడుగుపెట్టగానే జనం బ్రహ్మరథం పట్టారు. అసలు ఊహించలేదు. పార్టీకి, మరెవరికీ ఎలాంటి ఏర్పాట్లు చేయమని చెప్పలేదు. రోడ్లపైకి భారీగా ప్రజలంతా స్వయంగా తరలివచ్చారు. ఇదంతా ఆ గోరఖ్​నాథుని దయ. గురువు గారి దయ. యోగి మహరాజ్ దయ. ప్రజలు ఎంతో ఉత్తేజంతో ఉన్నారు. 2018 ఓటమికి జవాబివ్వాలని కోరుకుంటున్నారు. మే 23న చరిత్ర లిఖించాలని చూస్తున్నారు.

ప్ర- అంటే కూటమి పటాపంచలు అవుతుందా? రవికిషన్ గెలుస్తారా?

జ- హర్ హర్ మహ దేవ్. ఈసారి ఎన్నికల్లో వారికి ఓటమి తప్పదు. రవికిషన్​ విజయం తథ్యం.

ప్ర- సినిమా నటుడైన మీరు ఇప్పుడు నిజమైన రాజకీయ నేత పాత్ర పోషిస్తున్నారు. ఎలాంటి ప్రణాళికలతో వచ్చారు?

జ- ఎక్కువేం లేదు. ఎక్కువ బుర్ర బద్ధలు కొట్టుకునేది లేదు. మోదీ ఉన్నారు. ముఖ్యమంత్రి యోగి ఉన్నారు. వాళ్లే చూసుకుంటారు. నా పని చౌకీదారీ. దిల్లీ నుంచి ఇదిగో ఇది తీసుకెళ్లు. ప్రజలకు చేరాలి. ఊళ్లో ఇవ్వు. రైతులకు ఇవ్వు. ఫలానా ప్రాంతానికివ్వు. అని మోదీ, యోగి ఆదేశిస్తే నేను చేరుస్తా. అంతే నా పని. ఒక స్టూడియో కోసం పోరాటం చేస్తా. భోజ్​పురి అభివృద్ధికి కృషి చేస్తా. ఎనిమిదో షెడ్యూల్​లో చేర్పించేందుకు పోరాడతా. నాకు తెలిసిన సమస్యలన్నింటిపై పోరాడతా.

ప్ర- గోరఖ్​పుర్​ నుంచి గెలుపొందాక ఇక్కడే ఉంటారా?

- ఎక్కడికెళ్తాను? ఎక్కడికీ వెళ్లను. ఇక్కడే ఉంటాను. గోరఖ్​నాథుని పాదాల చెంత పడి ఉంటాను. ఇక్కడే నాకు సంతోషం. యోగి మహరాజ్ ఈ నగరాన్ని ఎంతో సుందరీకరించారు. విద్యుద్దీపాల కాంతులీనుతోంది గోరఖ్​పుర్. 7 కోట్ల మంది మహిళలకు మోదీ గ్యాస్ కనెక్షన్ ఇప్పించారు. 50 కోట్ల మందికి 5లక్షల ఆరోగ్య బీమా ఇప్పించారు. అలాంటప్పుడు.. ఈదేశాన్ని, ఈ గోరఖ్​పుర్​ను వదిలి ఎక్కడికెళ్తాను.

మోదీ అంటే నా దృష్టిలో ఓ లిట్టీ చోఖా వంటకం. ఈటీవీ భారత్ మాధ్యమం ద్వారా 30 కోట్ల మంది భోజ్​పురి జనాభాకు నా విన్నపం.. మన గడ్డ నుంచే(యూపీ, పూర్వాంచల్) ప్రధాని ఎన్నికవుతారు. అంతటి శక్తిమంతమైన నేల మనది. మనమంతా మోదీ గురించి కాస్త ఆలోచించాలి. మోదీ అంటే ఓ పెద్ద లిట్టీ చోఖా. ఇతర విపక్షాలు కట్​లెస్​, కేక్, పిజ్జా, బర్గర్​ లాంటి వాళ్లు.

ప్ర-ఇవన్నీ చేసినా మోదీని విపక్ష నేతలు నిందిస్తున్నారంటారా?

- వాళ్లంతా పిచ్చోళ్లయ్యారు. మే 23 తర్వాత వాళ్లంతట వాళ్లే వెళ్లి పిచ్చాసుపత్రిలో చేరుతారు. వాళ్ల కార్యకర్తలూ గందరగోళంలో పడిపోయారు. ఇలాంటి పరిస్థితిని వారు అసలు ఊహించలేదు. వాళ్ల నేతనే పార్లమెంటులో మోదీ మరోసారి ప్రధాని కావాలి అంటున్నారు.

ప్ర- భోజ్​పురి నటుడిగా మీకు ఎనలేని గుర్తింపు ఉంది. భోజ్​పురి కోసం ఏంచేస్తారు?

- భోజ్​పురిని ఎనిమిదో షెడ్యూల్​లో చేర్చాలి. తిరిగి గంగా నది ప్రవాహంలా పునరుత్తేజింపజేయాలి.

'మద్దాలి శివారెడ్డి'తో ఈటీవీ భారత్​ ముఖాముఖి

గోరఖ్​పుర్​.... ఉత్తర్​ప్రదేశ్​లోని లోక్​సభ నియోజకవర్గం. భాజపాకు ఎంతో ప్రతిష్టాత్మకం. ఎందుకంటే... అది ఒకప్పుడు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ సొంత నియోజకవర్గం. 2018 ఉపఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ పొత్తు ప్రభావంతో పరాజయం చవిచూసింది కమలదళం. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల రూపంలో ఆ సీటును తిరిగి దక్కించుకునే అవకాశం వచ్చింది. విస్తృత కసరత్తు చేసి, సినీ నటుడు రవి కిషన్​ను రంగంలోకి దింపింది భాజపా.

రవి కిషన్​కు రాజకీయం కొత్త. అలాంటి వ్యక్తి... గోరఖ్​పుర్​లో విజయం కోసం ఎలాంటి వ్యూహం అనుసరిస్తున్నారు? గెలిస్తే... అక్కడి ప్రజల కోసం ఏం చేస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం రాబట్టే ప్రయత్నం చేసింది ఈటీవీ భారత్​.

ప్ర- గోరఖ్​పుర్​ నుంచి భాజపా అభ్యర్థిగా బరిలో నిలిచారు భోజ్​పూరి సూపర్​స్టార్​ రవికిషన్​. ఈ ఎన్నికల్లో ఎలా గెలుస్తారనే విషయంపై ఆయననే అడిగి తెలుసుకుందాం? రవికిషన్.. ఏమంటారు?

జ- బాబా గోరఖ్​నాథుని నేలపై నుంచి ఈటీవీ భారత్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా గెలుపు అవకాశాలపై ఎక్కడ్నుంచి మొదలు పెట్టాలంటారు. నేను గోరఖ్​పుర్​లో అడుగుపెట్టగానే జనం బ్రహ్మరథం పట్టారు. అసలు ఊహించలేదు. పార్టీకి, మరెవరికీ ఎలాంటి ఏర్పాట్లు చేయమని చెప్పలేదు. రోడ్లపైకి భారీగా ప్రజలంతా స్వయంగా తరలివచ్చారు. ఇదంతా ఆ గోరఖ్​నాథుని దయ. గురువు గారి దయ. యోగి మహరాజ్ దయ. ప్రజలు ఎంతో ఉత్తేజంతో ఉన్నారు. 2018 ఓటమికి జవాబివ్వాలని కోరుకుంటున్నారు. మే 23న చరిత్ర లిఖించాలని చూస్తున్నారు.

ప్ర- అంటే కూటమి పటాపంచలు అవుతుందా? రవికిషన్ గెలుస్తారా?

జ- హర్ హర్ మహ దేవ్. ఈసారి ఎన్నికల్లో వారికి ఓటమి తప్పదు. రవికిషన్​ విజయం తథ్యం.

ప్ర- సినిమా నటుడైన మీరు ఇప్పుడు నిజమైన రాజకీయ నేత పాత్ర పోషిస్తున్నారు. ఎలాంటి ప్రణాళికలతో వచ్చారు?

జ- ఎక్కువేం లేదు. ఎక్కువ బుర్ర బద్ధలు కొట్టుకునేది లేదు. మోదీ ఉన్నారు. ముఖ్యమంత్రి యోగి ఉన్నారు. వాళ్లే చూసుకుంటారు. నా పని చౌకీదారీ. దిల్లీ నుంచి ఇదిగో ఇది తీసుకెళ్లు. ప్రజలకు చేరాలి. ఊళ్లో ఇవ్వు. రైతులకు ఇవ్వు. ఫలానా ప్రాంతానికివ్వు. అని మోదీ, యోగి ఆదేశిస్తే నేను చేరుస్తా. అంతే నా పని. ఒక స్టూడియో కోసం పోరాటం చేస్తా. భోజ్​పురి అభివృద్ధికి కృషి చేస్తా. ఎనిమిదో షెడ్యూల్​లో చేర్పించేందుకు పోరాడతా. నాకు తెలిసిన సమస్యలన్నింటిపై పోరాడతా.

ప్ర- గోరఖ్​పుర్​ నుంచి గెలుపొందాక ఇక్కడే ఉంటారా?

- ఎక్కడికెళ్తాను? ఎక్కడికీ వెళ్లను. ఇక్కడే ఉంటాను. గోరఖ్​నాథుని పాదాల చెంత పడి ఉంటాను. ఇక్కడే నాకు సంతోషం. యోగి మహరాజ్ ఈ నగరాన్ని ఎంతో సుందరీకరించారు. విద్యుద్దీపాల కాంతులీనుతోంది గోరఖ్​పుర్. 7 కోట్ల మంది మహిళలకు మోదీ గ్యాస్ కనెక్షన్ ఇప్పించారు. 50 కోట్ల మందికి 5లక్షల ఆరోగ్య బీమా ఇప్పించారు. అలాంటప్పుడు.. ఈదేశాన్ని, ఈ గోరఖ్​పుర్​ను వదిలి ఎక్కడికెళ్తాను.

మోదీ అంటే నా దృష్టిలో ఓ లిట్టీ చోఖా వంటకం. ఈటీవీ భారత్ మాధ్యమం ద్వారా 30 కోట్ల మంది భోజ్​పురి జనాభాకు నా విన్నపం.. మన గడ్డ నుంచే(యూపీ, పూర్వాంచల్) ప్రధాని ఎన్నికవుతారు. అంతటి శక్తిమంతమైన నేల మనది. మనమంతా మోదీ గురించి కాస్త ఆలోచించాలి. మోదీ అంటే ఓ పెద్ద లిట్టీ చోఖా. ఇతర విపక్షాలు కట్​లెస్​, కేక్, పిజ్జా, బర్గర్​ లాంటి వాళ్లు.

ప్ర-ఇవన్నీ చేసినా మోదీని విపక్ష నేతలు నిందిస్తున్నారంటారా?

- వాళ్లంతా పిచ్చోళ్లయ్యారు. మే 23 తర్వాత వాళ్లంతట వాళ్లే వెళ్లి పిచ్చాసుపత్రిలో చేరుతారు. వాళ్ల కార్యకర్తలూ గందరగోళంలో పడిపోయారు. ఇలాంటి పరిస్థితిని వారు అసలు ఊహించలేదు. వాళ్ల నేతనే పార్లమెంటులో మోదీ మరోసారి ప్రధాని కావాలి అంటున్నారు.

ప్ర- భోజ్​పురి నటుడిగా మీకు ఎనలేని గుర్తింపు ఉంది. భోజ్​పురి కోసం ఏంచేస్తారు?

- భోజ్​పురిని ఎనిమిదో షెడ్యూల్​లో చేర్చాలి. తిరిగి గంగా నది ప్రవాహంలా పునరుత్తేజింపజేయాలి.

Chittorgarh (Rajasthan), Apr 21 (ANI): Prime Minister Narendra Modi condemned the dastardly attacks in Sri Lankan capital of Colombo where over 150 people have been killed and over 400 got injured in multiple bombings that occurred in churches and hotels. PM Modi added that India stands with Sri Lanka in these though times and will do whatever it can to help its neighbour.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.