దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వెల్లడించింది భారత వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వచ్చే 3-4 రోజుల్లో ఎడతెరపి లేకుండా వానలు కురిసే సూచనలున్నాయని తెలిపింది. ఒడిశా, ఝార్ఖండ్, బంగాల్ రాష్ట్రాల్లో ఈ అల్పపీడన ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది.
"ఝార్ఖండ్, ఒడిశా, బంగాల్ రాష్ట్రాల్లో దాదాపు నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ తీరాన ఒడిశా ఉత్తరాన, బంగాల్కు వాయువ్యంగా ఏర్పడిన అల్పపీడనం కారణంగా అక్టోబర్ 2-6 తేదీల్లో.. కుండపోత వర్షాలు కురిసే సూచనలున్నాయి."
- భారత వాతావరణ శాఖ
మేఘాలయ, త్రిపుర, అసోం రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తాయని వెల్లడించిన వాతావరణశాఖ.. వాయువ్య భారతంలో చాలా చోట్ల పొడి వాతావరణం నెలకొనే అవకాశముందని తెలిపింది..
ఇదీ చదవండి: ఆశాజనకంగా ఆస్ట్రాజెనెకా ఫలితాలు!