మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ రైల్వేస్టేషన్లోని రెండో నెంబర్ ప్లాట్ఫాం వద్ద ఉన్న పాదచారుల వంతెనలోని ఓ భాగం కూలిపోయింది. ఈ ఘటనలో ఎనిమిదిమందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంలో 10 మందికి పైగా గాయపడ్డట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
పాదచారుల వంతెన కూలడం వల్ల వచ్చే రైళ్లను ఇతర ప్లాట్ఫాంల పైకి మళ్లిస్తున్నారు. వంతెన పరిస్థితి బాగా లేదని స్టేషన్ మాస్టార్కు ఇదివరకే ఫిర్యాదులు అందాయని.. అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.