ETV Bharat / bharat

ఇలాంటివి చూస్తుంటే నా రక్తం మరిగిపోతోంది: రాహుల్​

author img

By

Published : Jul 27, 2020, 1:34 PM IST

చైనా దురాక్రమణలపై మరోసారి కేంద్రాన్ని విమర్శించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. మోదీ ప్రభుత్వం నిజాలను దాస్తూ.. జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. చైనా.. భారత భూభాగాన్ని ఆక్రమించిందని ఉద్ఘాటించారు. ఈ మేరకు.. తన మైక్రోబ్లాగ్​లో నాలుగో వీడియోను విడుదల చేశారు రాహుల్​.

Rahul Gandhi claims China has occupied Indian land, "allowing them to take it is anti-national"
'ఇలాంటివి చూస్తుంటే నా రక్తం మరిగిపోతోంది'

భారత్​-చైనా సరిహద్దు అంశమై కేంద్రంపై విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. భారత భూభాగాన్ని ఆక్రమించుకునేలా చైనాకు అవకాశమివ్వడం.. దేశ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించడమేనని, కేంద్రం నిజాన్ని దాస్తోందని ఆరోపించారు.

ఈ మేరకు మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ... తన మైక్రోబ్లాగింగ్​ సైట్​లో మరో వీడియోను విడుదల చేశారు రాహుల్​. సరిహద్దు ఉద్రిక్తతలపై రాహుల్​.. వీడియో విడుదల చేయడం ఇది నాలుగోసారి. అంతకుముందు జులై 17,20,23 తేదీల్లోనూ మోదీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • The Chinese have occupied Indian land.

    Hiding the truth and allowing them to take it is anti-national.

    Bringing it to people’s attention is patriotic. pic.twitter.com/H37UZaFk1x

    — Rahul Gandhi (@RahulGandhi) July 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

''చైనా.. భారత భూభాగాన్ని ఆక్రమించుకుంది. నిజాన్ని దాస్తూ.. జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించింది. దీనిని ఇప్పుడు ప్రజల దృష్టికి తీసుకొచ్చి.. దేశభక్తిని చాటుకొనే ప్రయత్నం చేస్తోంది.''

- రాహుల్​ గాంధీ ​, కాంగ్రెస్​ అగ్రనేత

చైనా దళాలు చొచ్చుకురావడం తనకు తీవ్ర ఆవేదన కలిగించిందని అన్నారు రాహుల్​. అసలు వేరే దేశ సైన్యం.. భారత్​లోకి ఎలా ప్రవేశించగలదని ప్రశ్నించారు. ఇలాంటివి చూస్తుంటే తన రక్తం మరిగిపోతోందని పేర్కొన్నారు కాంగ్రెస్​ నేత.

''రాజకీయాల్లో ఉంటూ మౌనంగా కూర్చోలేను. ప్రజలకు అబద్ధం చెప్పలేను. నేను శాటిలైట్​ ఫొటోలు చూశాను. ఆర్మీ మాజీ అధికారులతో మాట్లాడాను. చైనా.. భారత భూభాగంలోకి రాలేదని మీరు నమ్మించే ప్రయత్నాలు చేసినా నేను నమ్మను. నా రాజకీయ జీవితం ఏమైనా.. నేను అబద్ధం చెప్పలేను.''

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

చైనా.. భారత భూభాగాన్ని ఆక్రమించలేదని చెప్పేవారు జాతీయ వాదులు కాదని, వారికి దేశ భక్తి లేదని మండిపడ్డారు రాహుల్​.

ఇటీవలి కాలంలో భారత్​,చైనా మధ్య గల్వాన్​ లోయలో తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి. సుదీర్ఘ.. సైనిక, దౌత్య స్థాయి చర్చల అనంతరం బలగాల ఉపసంహరణపై ఇరు దేశాలు ఒక అంగీకారానికి వచ్చిన అనంతరం.. పరిస్థితులు కాస్త సద్దుమణిగాయి.

భారత్​-చైనా సరిహద్దు అంశమై కేంద్రంపై విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. భారత భూభాగాన్ని ఆక్రమించుకునేలా చైనాకు అవకాశమివ్వడం.. దేశ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించడమేనని, కేంద్రం నిజాన్ని దాస్తోందని ఆరోపించారు.

ఈ మేరకు మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ... తన మైక్రోబ్లాగింగ్​ సైట్​లో మరో వీడియోను విడుదల చేశారు రాహుల్​. సరిహద్దు ఉద్రిక్తతలపై రాహుల్​.. వీడియో విడుదల చేయడం ఇది నాలుగోసారి. అంతకుముందు జులై 17,20,23 తేదీల్లోనూ మోదీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • The Chinese have occupied Indian land.

    Hiding the truth and allowing them to take it is anti-national.

    Bringing it to people’s attention is patriotic. pic.twitter.com/H37UZaFk1x

    — Rahul Gandhi (@RahulGandhi) July 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

''చైనా.. భారత భూభాగాన్ని ఆక్రమించుకుంది. నిజాన్ని దాస్తూ.. జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించింది. దీనిని ఇప్పుడు ప్రజల దృష్టికి తీసుకొచ్చి.. దేశభక్తిని చాటుకొనే ప్రయత్నం చేస్తోంది.''

- రాహుల్​ గాంధీ ​, కాంగ్రెస్​ అగ్రనేత

చైనా దళాలు చొచ్చుకురావడం తనకు తీవ్ర ఆవేదన కలిగించిందని అన్నారు రాహుల్​. అసలు వేరే దేశ సైన్యం.. భారత్​లోకి ఎలా ప్రవేశించగలదని ప్రశ్నించారు. ఇలాంటివి చూస్తుంటే తన రక్తం మరిగిపోతోందని పేర్కొన్నారు కాంగ్రెస్​ నేత.

''రాజకీయాల్లో ఉంటూ మౌనంగా కూర్చోలేను. ప్రజలకు అబద్ధం చెప్పలేను. నేను శాటిలైట్​ ఫొటోలు చూశాను. ఆర్మీ మాజీ అధికారులతో మాట్లాడాను. చైనా.. భారత భూభాగంలోకి రాలేదని మీరు నమ్మించే ప్రయత్నాలు చేసినా నేను నమ్మను. నా రాజకీయ జీవితం ఏమైనా.. నేను అబద్ధం చెప్పలేను.''

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

చైనా.. భారత భూభాగాన్ని ఆక్రమించలేదని చెప్పేవారు జాతీయ వాదులు కాదని, వారికి దేశ భక్తి లేదని మండిపడ్డారు రాహుల్​.

ఇటీవలి కాలంలో భారత్​,చైనా మధ్య గల్వాన్​ లోయలో తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి. సుదీర్ఘ.. సైనిక, దౌత్య స్థాయి చర్చల అనంతరం బలగాల ఉపసంహరణపై ఇరు దేశాలు ఒక అంగీకారానికి వచ్చిన అనంతరం.. పరిస్థితులు కాస్త సద్దుమణిగాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.