ETV Bharat / bharat

పట్టు వీడని జూడాలు- దీదీ క్షమాపణకై డిమాండ్​

బంగాల్​లో జూనియర్​ డాక్టర్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్​ చేస్తున్నారు వైద్యులు. దీదీ చర్చలకు ఆహ్వానించినప్పటికీ నిరాకరించారు.

author img

By

Published : Jun 15, 2019, 12:19 PM IST

పట్టు వీడని జూడాలు- దీదీ క్షమాపణకై డిమాండ్​

బంగాల్​లో జూనియర్​ డాక్టర్ల సమ్మె ఐదో రోజుకు చేరింది. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చర్చల కోసం సచివాలయానికి ఆహ్వానించినప్పటికీ జూడాలు తిరస్కరించారు. సీఎం ప్రవర్తించిన తీరుకు.. ఆమె బేషరతు క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబడుతున్నారు వైద్యులు.

పట్టు వీడని జూడాలు- దీదీ క్షమాపణకై డిమాండ్​

మరో ఆరు డిమాండ్లను పరిష్కరించాలని మమత ముందుంచారు. వాటి పరిష్కారానికి హామీ ఇస్తేనే.. తిరిగి విధుల్లోకి చేరతామని తేల్చిచెప్పారు.

"ముఖ్యమంత్రి చర్చలకు పిలిచినప్పటికీ మేము సచివాలయానికి వెళ్లదలచుకోలేదు. గురువారం ఎస్​ఎస్​కేఎమ్​ ఆసుపత్రికి వెళ్లి ఆమె చేసిన ఆరోపణలకు ఎన్​ఆర్​ఎస్​ కళాశాలకు, ఆసుపత్రికి వచ్చి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి." - అరిందామ్​ దత్తా, జూడాల సంఘం ప్రతినిధి

కేంద్ర ఆరోగ్యమంత్రితో...

భారత వైద్య సంఘం (ఐఎమ్​ఏ) సభ్యుల బృందం బంగాల్​లో వైద్యుల ఆందోళనపై కేంద్ర ఆరోగ్యమంత్రిని కలిసి వివరించారు.

స్థానిక వైద్యుల సంఘం (ఆర్​డీఏ)...

మొత్తం సీనియర్, జూనియర్​ వైద్యులందరూ తమ విధులకు హజరవుతున్నట్లు ఎయిమ్స్​లోని ఆర్​డీఎ (స్థానిక వైద్యుల సంఘం) అధ్యక్షుడు తెలిపారు. అయితే నల్ల రిబ్బన్లు, శిరస్త్రాణాలు ధరించి నిరసన తెలుపుతామన్నారు. జూన్​ 17 లోపు బంగాల్​ ప్రభుత్వం డిమాండ్లను నెరవేర్చకపోతే నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు.

ఇదీ వివాదం...

కోల్​కతాలోని ఎస్​ఎస్​కేఎం ఆసుపత్రిలో రోగి మృతికి కారణమయ్యారన్న ఆరోపణలతో ఇద్దరు వైద్యులపై బంధువులు దాడి చేశారు. నిరసనగా జూడాలు సమ్మెకు పిలుపునిచ్చారు. దాడికి కారణమైన వారిని అరెస్టు చేయాలని, అన్ని ఆస్పత్రుల వద్ద భద్రతను పెంచాలని డిమాండ్ చేశారు.

జూనియర్ డాక్టర్లను గురువారం హెచ్చరించారు బంగాల్​ ముఖ్యమంత్రి. 4 గంటల్లోగా విధుల్లోకి చేరాలని హుకుం జారీ చేశారు. ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో బయటివారు వచ్చి గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వైద్యుల సమ్మె భాజపా, సీపీఎంల కుట్ర అని ఆరోపించారు మమత.

బంగాల్​లో జూనియర్​ డాక్టర్ల సమ్మె ఐదో రోజుకు చేరింది. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చర్చల కోసం సచివాలయానికి ఆహ్వానించినప్పటికీ జూడాలు తిరస్కరించారు. సీఎం ప్రవర్తించిన తీరుకు.. ఆమె బేషరతు క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబడుతున్నారు వైద్యులు.

పట్టు వీడని జూడాలు- దీదీ క్షమాపణకై డిమాండ్​

మరో ఆరు డిమాండ్లను పరిష్కరించాలని మమత ముందుంచారు. వాటి పరిష్కారానికి హామీ ఇస్తేనే.. తిరిగి విధుల్లోకి చేరతామని తేల్చిచెప్పారు.

"ముఖ్యమంత్రి చర్చలకు పిలిచినప్పటికీ మేము సచివాలయానికి వెళ్లదలచుకోలేదు. గురువారం ఎస్​ఎస్​కేఎమ్​ ఆసుపత్రికి వెళ్లి ఆమె చేసిన ఆరోపణలకు ఎన్​ఆర్​ఎస్​ కళాశాలకు, ఆసుపత్రికి వచ్చి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి." - అరిందామ్​ దత్తా, జూడాల సంఘం ప్రతినిధి

కేంద్ర ఆరోగ్యమంత్రితో...

భారత వైద్య సంఘం (ఐఎమ్​ఏ) సభ్యుల బృందం బంగాల్​లో వైద్యుల ఆందోళనపై కేంద్ర ఆరోగ్యమంత్రిని కలిసి వివరించారు.

స్థానిక వైద్యుల సంఘం (ఆర్​డీఏ)...

మొత్తం సీనియర్, జూనియర్​ వైద్యులందరూ తమ విధులకు హజరవుతున్నట్లు ఎయిమ్స్​లోని ఆర్​డీఎ (స్థానిక వైద్యుల సంఘం) అధ్యక్షుడు తెలిపారు. అయితే నల్ల రిబ్బన్లు, శిరస్త్రాణాలు ధరించి నిరసన తెలుపుతామన్నారు. జూన్​ 17 లోపు బంగాల్​ ప్రభుత్వం డిమాండ్లను నెరవేర్చకపోతే నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు.

ఇదీ వివాదం...

కోల్​కతాలోని ఎస్​ఎస్​కేఎం ఆసుపత్రిలో రోగి మృతికి కారణమయ్యారన్న ఆరోపణలతో ఇద్దరు వైద్యులపై బంధువులు దాడి చేశారు. నిరసనగా జూడాలు సమ్మెకు పిలుపునిచ్చారు. దాడికి కారణమైన వారిని అరెస్టు చేయాలని, అన్ని ఆస్పత్రుల వద్ద భద్రతను పెంచాలని డిమాండ్ చేశారు.

జూనియర్ డాక్టర్లను గురువారం హెచ్చరించారు బంగాల్​ ముఖ్యమంత్రి. 4 గంటల్లోగా విధుల్లోకి చేరాలని హుకుం జారీ చేశారు. ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో బయటివారు వచ్చి గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వైద్యుల సమ్మె భాజపా, సీపీఎంల కుట్ర అని ఆరోపించారు మమత.

Rohtak (Haryana), Jun 15 (ANI): A 30-year-old doctor from Karnataka committed suicide after being denied leave for his sister's wedding by HOD in Haryana's Rohtak on Friday. He was pursuing MD at Post Graduate Institute of Medical Sciences. He was found hanged in his hostel's room. Fellow doctors have gone on strike in protest over the harassment on him.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.