ETV Bharat / bharat

టార్గెట్​ యూపీ... ప్రియాంక వ్యూహం ఫలించేనా?

2022లో జరగనున్న ఉత్తరప్రదేశ్  అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నారు. కార్యకర్తలతో మమేకమవుతూ పార్టీని క్షేతస్థాయిలో బలోపేతం చేసే దిశగా పావులు కదుపుతున్నారు. లోక్​సభకు ఎన్నికయిన 11మంది రాష్ట్ర శాసనసభ్యుల రాజీనామాల ద్వారా వచ్చే ఉపఎన్నికలకు కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు.

author img

By

Published : Jun 17, 2019, 5:31 AM IST

Updated : Jun 17, 2019, 7:30 AM IST

యూపీ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ప్రియాంక పర్యటనలు
టార్గెట్​ యూపీ... ప్రియాంక వ్యూహం ఫలించేనా?

లోక్​సభ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం పార్టీలో నూతనోత్సాహం నింపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. ఉత్తరప్రదేశ్ శాసనసభ సభ్యులుగా ఉండి లోక్​సభకు ఎన్నికయిన 11 మంది నేతల రాజీనామాల ద్వారా అసెంబ్లీకి ఉపఎన్నికలు రానున్నాయి. 2022లో యూపీ​ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కార్యకర్త​ల్లో నూతనోత్సాహం నింపేందుకు తూర్పు యూపీ బాధ్యురాలైన ప్రియాంక యత్నిస్తున్నారు. వారానికి రెండు సార్లు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఎలాంటి ముందస్తు అపాయింట్​మెంట్ లేకుండా కార్యకర్తలను కలుస్తున్నారు.

లోక్​సభ ఎన్నికల ఫలితాల అనంతరం కార్యకర్తలతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం. కార్యకర్తలు, నేతల మధ్య సహకారం, సమన్వయాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. రానున్న రోజుల్లో యూపీలో ప్రియాంక మరిన్ని పర్యటనలు చేపట్టనున్నారు.

తన తల్లి, యూపీఏ ఛైర్​పర్సన్​ సోనియాగాంధీతో కలసి రాయ్​బరేలీలో బుధవారం ప్రియాంక పర్యటించారు. ఈ సందర్భంగా లోక్​సభ ఎన్నికల ప్రచారంలో కొంతమంది కార్యకర్తలు సరిగా పనిచేయలేదని ఆరోపించారని సమాచారం.

80 లోక్​సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్​లో కేవలం సోనియా గాంధీ పోటీ చేసిన నియోజకవర్గం రాయ్​బరేలీలో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది.

ఇదీ చూడండి: నేటి నుంచే 17వ లోక్​సభ తొలి సమావేశాలు

టార్గెట్​ యూపీ... ప్రియాంక వ్యూహం ఫలించేనా?

లోక్​సభ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం పార్టీలో నూతనోత్సాహం నింపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. ఉత్తరప్రదేశ్ శాసనసభ సభ్యులుగా ఉండి లోక్​సభకు ఎన్నికయిన 11 మంది నేతల రాజీనామాల ద్వారా అసెంబ్లీకి ఉపఎన్నికలు రానున్నాయి. 2022లో యూపీ​ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కార్యకర్త​ల్లో నూతనోత్సాహం నింపేందుకు తూర్పు యూపీ బాధ్యురాలైన ప్రియాంక యత్నిస్తున్నారు. వారానికి రెండు సార్లు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఎలాంటి ముందస్తు అపాయింట్​మెంట్ లేకుండా కార్యకర్తలను కలుస్తున్నారు.

లోక్​సభ ఎన్నికల ఫలితాల అనంతరం కార్యకర్తలతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం. కార్యకర్తలు, నేతల మధ్య సహకారం, సమన్వయాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. రానున్న రోజుల్లో యూపీలో ప్రియాంక మరిన్ని పర్యటనలు చేపట్టనున్నారు.

తన తల్లి, యూపీఏ ఛైర్​పర్సన్​ సోనియాగాంధీతో కలసి రాయ్​బరేలీలో బుధవారం ప్రియాంక పర్యటించారు. ఈ సందర్భంగా లోక్​సభ ఎన్నికల ప్రచారంలో కొంతమంది కార్యకర్తలు సరిగా పనిచేయలేదని ఆరోపించారని సమాచారం.

80 లోక్​సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్​లో కేవలం సోనియా గాంధీ పోటీ చేసిన నియోజకవర్గం రాయ్​బరేలీలో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది.

ఇదీ చూడండి: నేటి నుంచే 17వ లోక్​సభ తొలి సమావేశాలు

New Delhi, Apr 30 (ANI): Emotional over all the love and praise pouring in for his movie 'Avengers: Endgame', Chris Hemsworth shared a video on Instagram thanking his fans for making the film a 'great success' on the box office over the globe. A few days back, the actor also posted a series of pictures and a heartfelt message on his Instagram handle to express happiness over the kind of response 'Avengers: Endgame' has received by the fans from all over the globe. The film which released on April 26 emerged as the highest opener of any Hollywood film in India by minting over Rs 150 crore in just three days. The film marks the end of Marvel Cinematic Universe's current generation, which comprises of 22 films, including 'Spider-Man: Homecoming' and the recently released 'Captain Marvel'. It will also be the last Marvel movie for some of the key actors, including Chris Evans as Captain America.

Last Updated : Jun 17, 2019, 7:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.