కేంద్రం తీసుకొచ్చిన మోటారు వాహనాల కొత్త చట్టాన్ని తమిళనాడు పోలీసులు కఠినంగా అమలుచేస్తున్నారు. ఎంతలా అంటే సైకిల్పై వెళుతున్న ఓ పాఠశాల విద్యార్థిని హెల్మెట్ లేదని ఆపేసి అతని వాహనాన్ని జప్తు చేశారు. ఈ ఘటన ధర్మపురి జిల్లాలోని పెన్నగరమ్లో జరిగింది.
పెన్నగరమ్ ఠాణా పరిధిలో ఎస్ఐ సుబ్రమణియన్ ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. అదే సమయంలో ఆ వైపుగా సైకిల్పై వెళుతున్న విద్యార్థిని ఆపారు ఎస్ఐ. హెల్మెట్ ఎందుకు ధరించలేదని విద్యార్థిని అడిగారు. అతనేమీ సమాధానం ఇవ్వకపోవటం వల్ల టైర్ నుంచి గాలి తీసి సైకిల్ జప్తు చేశారు.
ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇదీ చూడండి: భారత్ సైన్యం దెబ్బకు పాక్ ఉగ్రవాదుల పరుగులు