ETV Bharat / bharat

సౌదీ రాజుతో మోదీ సంభాషణ.. ఆ విషయంపైనే చర్చ​

author img

By

Published : Sep 9, 2020, 10:57 PM IST

కొవిడ్​-19 అనంతరం ప్రపంచం ఎదుర్కొనే సవాళ్లపై సౌదీ రాజు సల్మాన్​ బిన్​తో చర్చించారు భారత ప్రధాని మోదీ. ఈ మేరకు ఇద్దరు నేతలు ఫోన్​లో సంభాషించినట్లు సమాచారం.

PM Modi speaks to Saudi King, two leaders exchange views on global challenges following COVID
కొవిడ్​ అనంతర పరిస్థితులపై సౌదీ రాజుతో మోదీ మాటామంతి

సౌదీ అరేబియా రాజు సల్మాన్​ బిన్​ అబ్దులాజిజ్​ అల్​-సౌద్​తో భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఫోన్​లో సంభాషించారు. కొవిడ్​ అనంతరం.. ప్రపంచం ఎదుర్కొనే సవాళ్లపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది జరగనున్న జీ-20 సదస్సుకు సౌదీ అరేబియా నాయకత్వం వహించడంపై.. మోదీ అభినందనలు తెలిపారని ప్రధాని కార్యాలయం(పీఎంఓ) వెల్లడించింది. ఈ మేరకు జీ-20 ఎజెండాపై కూడా ఇరువురు నేతలు చర్చించినట్టు వివరించింది.

కరోనా కాలంలో ప్రవాస భారతీయులకు సహకరించిన సౌదీ అధికారులు, సల్మాన్​కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రధాని. భారత్​-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లోనూ సహాయ సహకారాల్ని మరింత బలోపేతం చేయడానికి ఇరు దేశాలూ కట్టుబడి ఉన్నాయని పీఎంఓ ఓ ప్రకటనను విడుదల చేసింది.

ఇదీ చదవండి: 'ఆక్స్​ఫర్డ్​ టీకా ప్రయోగాలకు ఇక్కడ బ్రేక్​ పడదు'

సౌదీ అరేబియా రాజు సల్మాన్​ బిన్​ అబ్దులాజిజ్​ అల్​-సౌద్​తో భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఫోన్​లో సంభాషించారు. కొవిడ్​ అనంతరం.. ప్రపంచం ఎదుర్కొనే సవాళ్లపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది జరగనున్న జీ-20 సదస్సుకు సౌదీ అరేబియా నాయకత్వం వహించడంపై.. మోదీ అభినందనలు తెలిపారని ప్రధాని కార్యాలయం(పీఎంఓ) వెల్లడించింది. ఈ మేరకు జీ-20 ఎజెండాపై కూడా ఇరువురు నేతలు చర్చించినట్టు వివరించింది.

కరోనా కాలంలో ప్రవాస భారతీయులకు సహకరించిన సౌదీ అధికారులు, సల్మాన్​కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రధాని. భారత్​-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లోనూ సహాయ సహకారాల్ని మరింత బలోపేతం చేయడానికి ఇరు దేశాలూ కట్టుబడి ఉన్నాయని పీఎంఓ ఓ ప్రకటనను విడుదల చేసింది.

ఇదీ చదవండి: 'ఆక్స్​ఫర్డ్​ టీకా ప్రయోగాలకు ఇక్కడ బ్రేక్​ పడదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.