ETV Bharat / bharat

'బొగ్గు గనుల వేలంతో స్వయం సమృద్ధికి తొలి మెట్టు'

author img

By

Published : Jun 18, 2020, 11:48 AM IST

Updated : Jun 18, 2020, 1:00 PM IST

PM Modi
మోదీ

12:51 June 18

కరోనా పూర్వస్థితికి వినియోగ సామర్థ్యం, డిమాండ్​: మోదీ

దేశంలో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో వినియోగం, డిమాండ్​ పెరుగుతున్నాయని ప్రధాని మోదీ వెల్లడించారు. కరోనా విపత్తు పూర్వ స్థితికి చేరుకుంటున్నాయని స్పష్టం చేశారు.  

బొగ్గు గనుల వేలం ప్రక్రియ ప్రారంభోత్సవంలో ప్రసంగించిన మోదీ.. వాణిజ్య కార్యకలాపాలు వేగంగా సాధారణ పరిస్థితులకు వస్తున్నాయన్నారు. విద్యుత్​, ఇంధన వినియోగంలో పెరిగిన డిమాండ్​ను మోదీ ఉదహరించారు.

"ఈ సూచనలు భారత ఆర్థిక వ్యవస్థ ఎంత మేర తిరిగి పురోగమిస్తోందో తెలియజేస్తున్నాయి. గతంలో భారత్ చాలా పెద్ద సంక్షోభం నుంచి బయటపడింది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతోంది. దిగుమతులు తగ్గించుకుని స్వయం సమృద్ధి సాధిస్తే భారత వృద్ధి, విజయం రెండు సాధ్యమవుతాయి."

- ప్రధాని నరేంద్రమోదీ

11:23 June 18

బొగ్గు గనుల వేలంలో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న మోదీ

కరోనా సంక్షోభాన్ని భారత్​ అవకాశంగా మలుచుకుంటుందని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. దిగుమతుల కోసం ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గించి స్వావలంబన సాధించాల్సిన అవసరాన్ని ఈ విపత్తు గుర్తుచేసిందని అన్నారు. వాణిజ్య మైనింగ్ కోసం 41 బొగ్గు గనుల వేలం ప్రక్రియ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ విధంగా వ్యాఖ్యానించారు మోదీ.  

వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రసగించిన మోదీ.. విద్యుత్​ రంగంలో భారత్​ను స్వయం సమృద్ధి సాధించే దిశగా బొగ్గు గనుల వేలం కీలక నిర్ణయమని అభిప్రాయపడ్డారు.  

"దశాబ్దాలుగా బొగ్గు ఉత్పత్తి రంగం వలలో బందీగా చిక్కుకుపోయింది. ఈ రంగంలో పోటీతత్వం పూర్తిగా కొరవడింది. ఫలితంగా పారదర్శకత లోపించింది. 2014 తర్వాత ఈ  పరిస్థితిని మార్చేందుకు తీసుకున్న చర్యలతో బొగ్గు ఉత్పత్తి రంగం బలపడింది."

   - ప్రధాని నరేంద్రమోదీ

3.5 లక్షలమందికి ఉపాధి..

దేశ ఇంధన రంగంలో స్వయం సమృద్ధి, పారిశ్రామిక వృద్ధిని గణనీయంగా పెంచడమే లక్ష్యంగా బొగ్గు మంత్రిత్వ శాఖ వాణిజ్య మైనింగ్ కోసం 41 బ్లాకుల వేలం ప్రక్రియ చేపట్టింది. వచ్చే ఐదేళ్లలో బొగ్గు గనుల వాణిజ్య మైనింగ్ ద్వారా దాదాపు రూ.33 వేల కోట్ల మూలధనం సృష్టించనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ ప్రక్రియ ఆత్మ నిర్భర భారత్ అభియాన్ కింద చేపట్టినట్లు పేర్కొంది.  

2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ గనుల ద్వారా దాదాపు 22.5 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలోని మొత్తం బొగ్గు ఉత్పత్తిలో వీటి వాటా 15 శాతంగా ఉంటుందని వెల్లడించింది. బొగ్గు నిక్షేపాల వేలం ద్వారా దాదాపు 2.80 లక్షల మందికి ప్రత్యక్షంగా, 70 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని వివరించింది.

12:51 June 18

కరోనా పూర్వస్థితికి వినియోగ సామర్థ్యం, డిమాండ్​: మోదీ

దేశంలో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో వినియోగం, డిమాండ్​ పెరుగుతున్నాయని ప్రధాని మోదీ వెల్లడించారు. కరోనా విపత్తు పూర్వ స్థితికి చేరుకుంటున్నాయని స్పష్టం చేశారు.  

బొగ్గు గనుల వేలం ప్రక్రియ ప్రారంభోత్సవంలో ప్రసంగించిన మోదీ.. వాణిజ్య కార్యకలాపాలు వేగంగా సాధారణ పరిస్థితులకు వస్తున్నాయన్నారు. విద్యుత్​, ఇంధన వినియోగంలో పెరిగిన డిమాండ్​ను మోదీ ఉదహరించారు.

"ఈ సూచనలు భారత ఆర్థిక వ్యవస్థ ఎంత మేర తిరిగి పురోగమిస్తోందో తెలియజేస్తున్నాయి. గతంలో భారత్ చాలా పెద్ద సంక్షోభం నుంచి బయటపడింది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతోంది. దిగుమతులు తగ్గించుకుని స్వయం సమృద్ధి సాధిస్తే భారత వృద్ధి, విజయం రెండు సాధ్యమవుతాయి."

- ప్రధాని నరేంద్రమోదీ

11:23 June 18

బొగ్గు గనుల వేలంలో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న మోదీ

కరోనా సంక్షోభాన్ని భారత్​ అవకాశంగా మలుచుకుంటుందని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. దిగుమతుల కోసం ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గించి స్వావలంబన సాధించాల్సిన అవసరాన్ని ఈ విపత్తు గుర్తుచేసిందని అన్నారు. వాణిజ్య మైనింగ్ కోసం 41 బొగ్గు గనుల వేలం ప్రక్రియ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ విధంగా వ్యాఖ్యానించారు మోదీ.  

వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రసగించిన మోదీ.. విద్యుత్​ రంగంలో భారత్​ను స్వయం సమృద్ధి సాధించే దిశగా బొగ్గు గనుల వేలం కీలక నిర్ణయమని అభిప్రాయపడ్డారు.  

"దశాబ్దాలుగా బొగ్గు ఉత్పత్తి రంగం వలలో బందీగా చిక్కుకుపోయింది. ఈ రంగంలో పోటీతత్వం పూర్తిగా కొరవడింది. ఫలితంగా పారదర్శకత లోపించింది. 2014 తర్వాత ఈ  పరిస్థితిని మార్చేందుకు తీసుకున్న చర్యలతో బొగ్గు ఉత్పత్తి రంగం బలపడింది."

   - ప్రధాని నరేంద్రమోదీ

3.5 లక్షలమందికి ఉపాధి..

దేశ ఇంధన రంగంలో స్వయం సమృద్ధి, పారిశ్రామిక వృద్ధిని గణనీయంగా పెంచడమే లక్ష్యంగా బొగ్గు మంత్రిత్వ శాఖ వాణిజ్య మైనింగ్ కోసం 41 బ్లాకుల వేలం ప్రక్రియ చేపట్టింది. వచ్చే ఐదేళ్లలో బొగ్గు గనుల వాణిజ్య మైనింగ్ ద్వారా దాదాపు రూ.33 వేల కోట్ల మూలధనం సృష్టించనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ ప్రక్రియ ఆత్మ నిర్భర భారత్ అభియాన్ కింద చేపట్టినట్లు పేర్కొంది.  

2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ గనుల ద్వారా దాదాపు 22.5 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలోని మొత్తం బొగ్గు ఉత్పత్తిలో వీటి వాటా 15 శాతంగా ఉంటుందని వెల్లడించింది. బొగ్గు నిక్షేపాల వేలం ద్వారా దాదాపు 2.80 లక్షల మందికి ప్రత్యక్షంగా, 70 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని వివరించింది.

Last Updated : Jun 18, 2020, 1:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.