ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా 'అన్న క్యాంటీన్ల'కై సుప్రీంలో పిటిషన్​

ఆహార కొరత, పోషకాహార లోపాన్ని అధిగమించడానికి కమ్యూనిటీ ఆహార కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఆదేశాలివ్వాలని సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్​పై అత్యున్నత ధర్మాసనం నేడు విచారణ చేపట్టనుంది.

author img

By

Published : Sep 2, 2019, 6:45 AM IST

Updated : Sep 29, 2019, 3:27 AM IST

సుప్రీంకోర్టు

ఆహార కొరత, పోషకాహార లోపం సమస్యలపై సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ సమస్యను అధిగమించేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కమ్యూనిటీ ఆహార కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఆదేశాలివ్వాలని కోరారు పిటిషనర్లు.

సామాజిక కార్యకర్తలు అరుణ్​ ధావన్​, ఇషాన్ ధావన్​, కుంజనా సింగ్​లు దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ ఎన్​వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ జరపనుంది.

ఆహార గిడ్డంగులు...

ఆకలి, పోషకాహార లోపంతో ఐదేళ్లలోపు చిన్నారులు ప్రతి రోజు ఎంతో మంది మరణిస్తున్నారని పిటిషన్​లో పేర్కొన్నారు. అది ప్రజల ప్రాథమిక హక్కులను ఉల్లఘిస్తోందని తెలిపారు. ఈ పరిస్థితిని అడ్డుకునేందుకు జాతీయ ఆహార గిడ్డంగులు ఏర్పాటు చేయాలని, ప్రస్తుతమున్న పంపిణీ విధానం పరిధిని విస్తరించాలని విన్నవించారు.

ఆంధ్రప్రదేశ్​, ఉత్తరాఖండ్, ఒడిశా, ఝార్ఖండ్, దిల్లీలలో ఉన్న రాయితీ భోజన పథకాలను ఇందుకు ఉదాహరణగా చూపించారు.
ఆకలి మరణాలను నిర్మూలించేందుకు కొత్త పథకాన్ని రూపొందించి.. జాతీయ న్యాయ సేవా అథారిటీని ఆదేశించాలని వ్యాజ్యంలో పేర్కొన్నారు.

ఇదీ చూడండి: చంద్రయాన్​-2కు ఆఖరి కక్ష్య కుదింపు

ఆహార కొరత, పోషకాహార లోపం సమస్యలపై సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ సమస్యను అధిగమించేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కమ్యూనిటీ ఆహార కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఆదేశాలివ్వాలని కోరారు పిటిషనర్లు.

సామాజిక కార్యకర్తలు అరుణ్​ ధావన్​, ఇషాన్ ధావన్​, కుంజనా సింగ్​లు దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ ఎన్​వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ జరపనుంది.

ఆహార గిడ్డంగులు...

ఆకలి, పోషకాహార లోపంతో ఐదేళ్లలోపు చిన్నారులు ప్రతి రోజు ఎంతో మంది మరణిస్తున్నారని పిటిషన్​లో పేర్కొన్నారు. అది ప్రజల ప్రాథమిక హక్కులను ఉల్లఘిస్తోందని తెలిపారు. ఈ పరిస్థితిని అడ్డుకునేందుకు జాతీయ ఆహార గిడ్డంగులు ఏర్పాటు చేయాలని, ప్రస్తుతమున్న పంపిణీ విధానం పరిధిని విస్తరించాలని విన్నవించారు.

ఆంధ్రప్రదేశ్​, ఉత్తరాఖండ్, ఒడిశా, ఝార్ఖండ్, దిల్లీలలో ఉన్న రాయితీ భోజన పథకాలను ఇందుకు ఉదాహరణగా చూపించారు.
ఆకలి మరణాలను నిర్మూలించేందుకు కొత్త పథకాన్ని రూపొందించి.. జాతీయ న్యాయ సేవా అథారిటీని ఆదేశించాలని వ్యాజ్యంలో పేర్కొన్నారు.

ఇదీ చూడండి: చంద్రయాన్​-2కు ఆఖరి కక్ష్య కుదింపు

AP Video Delivery Log - 2300 GMT News
Sunday, 1 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2120: US FL Dorian Jacksonville Beach AP Clients Only 4227728
Jacksonville Beach life guards prepare for Dorian
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 29, 2019, 3:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.