ETV Bharat / bharat

చైనా డీల్​పై చిక్కుల్లో సోనియా, రాహుల్​!

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కాంగ్రెస్ హయాంలో భారత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందానికి సంబంధించిన వివరాలను దాచిపెట్టడంపై ఈ వ్యాజ్యం వేశారు. దీనిపై ఎన్​ఐఏ, సీబీఐ ద్వారా సమగ్ర విచారణ జరిపించాలని సుప్రీంకోర్టును పిటిషనర్లు అభ్యర్థించారు.

author img

By

Published : Jun 24, 2020, 7:21 PM IST

PIL in SC against Sonia Gandhi, Rahul Gandhi
సోనియా, రాహుల్​లపై కేసు

చైనాతో 2008లో కుదుర్చుకున్న ఒప్పందానికి సంబంధించిన వివరాలు బయటపెట్టనందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సహా ఆ పార్టీ నేత రాహుల్​ గాంధీపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

న్యాయవాది శశాంక్ శేఖర్ ఝా, గోవా క్రానికల్ ఎడిటర్ సావియో రోడ్రిగ్స్​ సంయుక్తంగా ఈ పిల్​ను దాఖలు చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం ప్రకారం ఎన్​ఐఏ, సీబీఐ ద్వారా ఈ విషయంపై దర్యాప్తుకు ఆదేశించాలని ధర్మాసనాన్ని కోరారు. చైనాతో శత్రు సంబంధం ఉన్నప్పటికీ.. ఆ దేశంతో ఒప్పందం చేసుకొని వాటి వివరాలను యూపీఏ ప్రభుత్వం దాచిపెట్టిందని పిటిషనర్లు ఆరోపించారు.

"జాతీయ ప్రాముఖ్యం ఉన్న విషయాల్లో పారదర్శకంగా వ్యవహరించడంలో కాంగ్రెస్ విఫలమైంది. జాతి ప్రయోజనాల విషయంలోనూ సమాచార హక్కును కొల్లగొట్టే అధికారం రాజకీయ పార్టీలకు ఉందా? శత్రు దేశంతో చేసుకున్న ఒప్పందం ద్వారా జాతి భద్రతను నాశనం చేయవచ్చా?"

-పిటిషనర్లు

ప్రజల ముందు ప్రశ్నించినప్పటికీ ఒప్పందానికి సంబంధించిన వివరాలేవీ బయటకు చెప్పలేదని పలు మీడియా సంస్థల కథనాలను పిటిషనర్లను ప్రస్తావించారు. ఇందులో పారదర్శకమైన దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: చైనా దుర్నీతి- చర్చలు అంటూనే బలగాల మోహరింపు

చైనాతో 2008లో కుదుర్చుకున్న ఒప్పందానికి సంబంధించిన వివరాలు బయటపెట్టనందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సహా ఆ పార్టీ నేత రాహుల్​ గాంధీపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

న్యాయవాది శశాంక్ శేఖర్ ఝా, గోవా క్రానికల్ ఎడిటర్ సావియో రోడ్రిగ్స్​ సంయుక్తంగా ఈ పిల్​ను దాఖలు చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం ప్రకారం ఎన్​ఐఏ, సీబీఐ ద్వారా ఈ విషయంపై దర్యాప్తుకు ఆదేశించాలని ధర్మాసనాన్ని కోరారు. చైనాతో శత్రు సంబంధం ఉన్నప్పటికీ.. ఆ దేశంతో ఒప్పందం చేసుకొని వాటి వివరాలను యూపీఏ ప్రభుత్వం దాచిపెట్టిందని పిటిషనర్లు ఆరోపించారు.

"జాతీయ ప్రాముఖ్యం ఉన్న విషయాల్లో పారదర్శకంగా వ్యవహరించడంలో కాంగ్రెస్ విఫలమైంది. జాతి ప్రయోజనాల విషయంలోనూ సమాచార హక్కును కొల్లగొట్టే అధికారం రాజకీయ పార్టీలకు ఉందా? శత్రు దేశంతో చేసుకున్న ఒప్పందం ద్వారా జాతి భద్రతను నాశనం చేయవచ్చా?"

-పిటిషనర్లు

ప్రజల ముందు ప్రశ్నించినప్పటికీ ఒప్పందానికి సంబంధించిన వివరాలేవీ బయటకు చెప్పలేదని పలు మీడియా సంస్థల కథనాలను పిటిషనర్లను ప్రస్తావించారు. ఇందులో పారదర్శకమైన దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: చైనా దుర్నీతి- చర్చలు అంటూనే బలగాల మోహరింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.