ETV Bharat / bharat

ఆపరేషన్​ కశ్మీర్​: రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం!

జమ్ముకశ్మీర్​లో ప్రశాంత వాతావరణం నెలకొంది. ఆర్టికల్​ 370 రద్దును అనేక మంది స్థానికులు స్వాగతించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. పరిస్థితిపై సమీక్షించేందుకు శ్రీనగర్​లో సైనికాధికారులు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

author img

By

Published : Aug 6, 2019, 12:32 PM IST

ఆపరేషన్​ కశ్మీర్​: రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం
రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం

ఆర్టికల్​ 370 రద్దయిన ఒక రోజు అనంతరం జమ్ముకశ్మీర్​లో ప్రశాంత వాతావరణం నెలకొంది. ప్రజలు తమ దినచర్యల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్​ షా రాజ్యసభలో ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని పెద్దల సభ ఆమోదించింది.

జమ్ముకశ్మీర్​ను కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉంచడం ప్రభుత్వానికి ఇష్టం లేదన్నారు షా. సాధారణ పరిస్థితి నెలకొనేందుకు ఎంత సమయం పడితే అప్పటివరకు కేంద్ర పాలిత ప్రాంతంగానే ఉంటుందన్నారు. ఈ ప్రకటనను అనేక మంది స్థానికులు స్వాగతించినట్టు అధికారులు వెల్లడించారు.

నిత్యం నిఘా నేత్రాల్లో...

ఆర్టికల్​ 370 రద్దుకు ముందే వేల సంఖ్యలో భద్రతా సిబ్బందిని కశ్మీర్​ లోయలో మోహరించిన కేంద్రం... ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తపడింది. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోబాల్​ శ్రీనగర్​లో సమీక్షా సమావేశం నిర్వహించారు.

మంగళవారం శ్రీనగర్​లో సైన్యం ఉన్నతాధికారుల​ నేతృత్వంలో నిఘా, భద్రతా విభాగాల సమావేశం జరిగింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు అధికారులు వివరించారు.

కమాండింగ్​ ఇన్​ ఛీఫ్​ జనరల్​, నార్తర్న్​ కమాండ్​ లెఫ్టినెంట్ జనరల్​ రణ్​బీర్​ సింగ్​ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ భేటీలో సీనియర్​ ఆర్మీ, పోలీసులు, పారామిలిటరీ అధికారులు, నిఘా అధికారులు పాల్గొన్నారు.

జమ్ముకశ్మీర్​లో 144 సెక్షన్​ కొనసాగుతోంది. కర్ఫ్యూ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై నిత్యం నిఘా ఏర్పాటు చేశారు అధికారులు.

ఇదీ చూడండి:- ఆర్టికల్​ 370 సమస్యకు పరిష్కారం 370నే

రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం

ఆర్టికల్​ 370 రద్దయిన ఒక రోజు అనంతరం జమ్ముకశ్మీర్​లో ప్రశాంత వాతావరణం నెలకొంది. ప్రజలు తమ దినచర్యల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్​ షా రాజ్యసభలో ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని పెద్దల సభ ఆమోదించింది.

జమ్ముకశ్మీర్​ను కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉంచడం ప్రభుత్వానికి ఇష్టం లేదన్నారు షా. సాధారణ పరిస్థితి నెలకొనేందుకు ఎంత సమయం పడితే అప్పటివరకు కేంద్ర పాలిత ప్రాంతంగానే ఉంటుందన్నారు. ఈ ప్రకటనను అనేక మంది స్థానికులు స్వాగతించినట్టు అధికారులు వెల్లడించారు.

నిత్యం నిఘా నేత్రాల్లో...

ఆర్టికల్​ 370 రద్దుకు ముందే వేల సంఖ్యలో భద్రతా సిబ్బందిని కశ్మీర్​ లోయలో మోహరించిన కేంద్రం... ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తపడింది. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోబాల్​ శ్రీనగర్​లో సమీక్షా సమావేశం నిర్వహించారు.

మంగళవారం శ్రీనగర్​లో సైన్యం ఉన్నతాధికారుల​ నేతృత్వంలో నిఘా, భద్రతా విభాగాల సమావేశం జరిగింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు అధికారులు వివరించారు.

కమాండింగ్​ ఇన్​ ఛీఫ్​ జనరల్​, నార్తర్న్​ కమాండ్​ లెఫ్టినెంట్ జనరల్​ రణ్​బీర్​ సింగ్​ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ భేటీలో సీనియర్​ ఆర్మీ, పోలీసులు, పారామిలిటరీ అధికారులు, నిఘా అధికారులు పాల్గొన్నారు.

జమ్ముకశ్మీర్​లో 144 సెక్షన్​ కొనసాగుతోంది. కర్ఫ్యూ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై నిత్యం నిఘా ఏర్పాటు చేశారు అధికారులు.

ఇదీ చూడండి:- ఆర్టికల్​ 370 సమస్యకు పరిష్కారం 370నే

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.