ETV Bharat / bharat

కాంగ్రెస్​లో ఎన్​సీపీ విలీనం కాదు : పవార్​

కాంగ్రెస్​లో నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ (ఎన్​సీపీ) విలీనమవుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు ఆ పార్టీ అధినేత శరద్​ పవార్​. తమ పార్టీకి సొంత గుర్తింపు ఉంది దానిని అలాగే కొనసాగిస్తామన్నారు. మిత్రపక్షాలతో తమ పార్టీ కలిసి ఉండటం ఇష్టం లేని వాళ్లు చేస్తోన్న తప్పుడు ప్రచారాలని కొట్టిపారేశారు.

author img

By

Published : Jun 1, 2019, 11:55 PM IST

కాంగ్రెస్​లో ఎన్​సీపీ విలీనం కాదు : పవార్​

కాంగ్రెస్​ పార్టీలో నేషనలిస్ట్ కాంగ్రెస్​ పార్టీ (ఎన్​సీపీ) విలీనమవుతుందన్న వార్తలపై స్పష్టతనిచ్చారు ఆ పార్టీ అధినేత శరద్​ పవార్​. ఈ ఊహాగానాలన్నీ తప్పుడు వార్తలుగా కొట్టిపారేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధత, లోక్​సభ ఫలితాలపై చర్చించేందుకు శనివారం ముంబయిలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు పవార్. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎన్​సీపీకి సొంత గుర్తింపు ఉందని.. దానిని అలాగే నిలుపుకుంటామని స్పష్టం చేశారు.

కాంగ్రెస్​లో ఎన్​సీపీ విలీనం చేయటమనేది మిత్రపక్షాలతో తమ పార్టీ కలిసి ఉండటం ఇష్టం లేని వాళ్లు చేస్తోన్న తప్పుడు ప్రచారాలని కొట్టిపారేశారు.

లోక్​సభ ఎన్నికల ఫలితాల అనంతరం శరద్​ పవార్​ను కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ కలవటమే కాంగ్రెస్​-ఎన్​సీపీ విలీనంపై ఊహాగానాలకు తెరలేపింది.

ఈవీఎంలపై ఆరోపణలు..

పార్టీ నేతలతో సమావేశమైన పవార్​ ఈవీఎంలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈవీఎంల సాంకేతికతపై తనకు అనుమానాలున్నాయని తెలిపారు. భాజపా అధికారంలో ఉన్నప్పుడు రాజస్థాన్​, మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైందని గుర్తు చేశారు. అప్పుడు ఓటమి చెందిన పార్టీ..జాతీయ ఎన్నికల్లో విజయం సాధించటం అనుమానాలకు తావిస్తోందన్నారు.

ఇదీ చూడండి: 'దీదీకి 10 వేల జై శ్రీరామ్​ పోస్టుకార్డులు'

కాంగ్రెస్​ పార్టీలో నేషనలిస్ట్ కాంగ్రెస్​ పార్టీ (ఎన్​సీపీ) విలీనమవుతుందన్న వార్తలపై స్పష్టతనిచ్చారు ఆ పార్టీ అధినేత శరద్​ పవార్​. ఈ ఊహాగానాలన్నీ తప్పుడు వార్తలుగా కొట్టిపారేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధత, లోక్​సభ ఫలితాలపై చర్చించేందుకు శనివారం ముంబయిలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు పవార్. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎన్​సీపీకి సొంత గుర్తింపు ఉందని.. దానిని అలాగే నిలుపుకుంటామని స్పష్టం చేశారు.

కాంగ్రెస్​లో ఎన్​సీపీ విలీనం చేయటమనేది మిత్రపక్షాలతో తమ పార్టీ కలిసి ఉండటం ఇష్టం లేని వాళ్లు చేస్తోన్న తప్పుడు ప్రచారాలని కొట్టిపారేశారు.

లోక్​సభ ఎన్నికల ఫలితాల అనంతరం శరద్​ పవార్​ను కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ కలవటమే కాంగ్రెస్​-ఎన్​సీపీ విలీనంపై ఊహాగానాలకు తెరలేపింది.

ఈవీఎంలపై ఆరోపణలు..

పార్టీ నేతలతో సమావేశమైన పవార్​ ఈవీఎంలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈవీఎంల సాంకేతికతపై తనకు అనుమానాలున్నాయని తెలిపారు. భాజపా అధికారంలో ఉన్నప్పుడు రాజస్థాన్​, మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైందని గుర్తు చేశారు. అప్పుడు ఓటమి చెందిన పార్టీ..జాతీయ ఎన్నికల్లో విజయం సాధించటం అనుమానాలకు తావిస్తోందన్నారు.

ఇదీ చూడండి: 'దీదీకి 10 వేల జై శ్రీరామ్​ పోస్టుకార్డులు'

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST:
1. 00:00
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: SNTV
DURATION:
STORYLINE:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.