ETV Bharat / bharat

ఉరిశిక్ష తీర్పు పునఃసమీక్ష కోసం నిర్భయ దోషి వ్యాజ్యం

author img

By

Published : Dec 10, 2019, 3:39 PM IST

Updated : Dec 10, 2019, 4:14 PM IST

నిర్భయ కేసులో తనకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేశాడు దోషి అక్షయ్​కుమార్​ సింగ్​. నిర్భయ కేసు దోషులకు ఈ నెలలోనే ఉరిశిక్ష అమలు చేసే అవకాశం ఉందన్న ఊహాగానాలు నేపథ్యంలో ఈ వ్యాజ్యం వేశాడు.

Nirbhaya
ఉరిశిక్షను పునఃసమీక్షించాలని సుప్రీంకు నిర్భయ దోషి

నిర్భయ కేసులో దోషిగా తేలిన అక్షయ్‌కుమార్‌ సింగ్‌... తనకు ఉరిశిక్ష ఖరారు చేయడాన్ని పునఃసమీక్షించాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. ఈ నెలలోనే ఉరిశిక్ష అమలు చేసే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ వ్యాజ్యం వేశాడు.

నిర్భయపై అత్యాచారం, హత్య కేసులో దోషులకు దిల్లీ ట్రయల్​ కోర్టు విధించిన మరణశిక్షను 2017లో సుప్రీం కోర్టు సమర్థించింది. ఈ కేసులోని మరో ముగ్గురు దోషులు గతంలో దాఖలు చేసిన సమీక్ష పిటిషన్లను.. సుప్రీంకోర్టు 2018 జులై 9న కొట్టివేసింది.

నలుగురు దోషులలో ఇప్పటివరకు సమీక్ష పిటిషన్​ దాఖలు చేయని అక్షయ్​కుమార్​.. నేడు న్యాయస్థానాన్ని ఆశ్రయిచినట్లు అతని తరఫు న్యాయవాది ఎ.పి. సింగ్​ వెల్లడించారు.

తిహార్​ జైలుకు నాలుగో దోషి..

ఆరుగురు ముద్దాయిల్లో ఒకడు బాల నేరస్థుడు కాగా మరో వ్యక్తి రామ్‌సింగ్‌ 2013 మార్చిలో తిహార్‌ కారాగారంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మిగిలిన నలుగురు ఊచలు లెక్కపెడుతున్నారు. వీరిలో వినయ్‌శర్మ, అక్షయ్‌ ఠాకుర్‌, ముకేష్‌ సింగ్‌ తిహార్‌ జైల్లో ఉన్నారు. ఉరి తీయడానికి వీలుగా నాలుగో వ్యక్తి పవన్‌ గుప్తాను మండోలి కారాగారం నుంచి తిహార్‌కు తరలించారు. చట్టపరంగా ఉన్న అవకాశాలన్నీ అయిపోయాయని, చివరి ప్రయత్నంగా కావాలంటే రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం ప్రయత్నించుకోవచ్చని ఈ నలుగురికి ఈ ఏడాది అక్టోబరు 29నే కారాగార వర్గాలు తెలిపాయి. వీరిలో వినయ్‌ ఒక్కడే అర్జీ పెట్టుకోగా దానిని తిరస్కరించాలని దిల్లీ ప్రభుత్వం, కేంద్ర కేబినెట్‌ కూడా ఇటీవలే రాష్ట్రపతికి సిఫార్సు చేశాయి.

2012లో ఘటన..

దేశ రాజధాని నడిబొడ్డున ఏడేళ్ల క్రితం 2012 డిసెంబరు 16వ తేదీ రాత్రి 23 ఏళ్ల పారామెడికల్‌ విద్యార్థినిపై దిల్లీలో ఐదుగురు సామూహిక అత్యాచారానికి, అత్యంత హేయమైన చర్యలకు పాల్పడ్డారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం ఆమెను సింగపూర్‌కు తరలించగా అక్కడ కన్నుమూసింది.

ఇదీ చూడండి: పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా 1000 మంది శాస్త్రవేత్తల పిటిషన్​

నిర్భయ కేసులో దోషిగా తేలిన అక్షయ్‌కుమార్‌ సింగ్‌... తనకు ఉరిశిక్ష ఖరారు చేయడాన్ని పునఃసమీక్షించాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. ఈ నెలలోనే ఉరిశిక్ష అమలు చేసే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ వ్యాజ్యం వేశాడు.

నిర్భయపై అత్యాచారం, హత్య కేసులో దోషులకు దిల్లీ ట్రయల్​ కోర్టు విధించిన మరణశిక్షను 2017లో సుప్రీం కోర్టు సమర్థించింది. ఈ కేసులోని మరో ముగ్గురు దోషులు గతంలో దాఖలు చేసిన సమీక్ష పిటిషన్లను.. సుప్రీంకోర్టు 2018 జులై 9న కొట్టివేసింది.

నలుగురు దోషులలో ఇప్పటివరకు సమీక్ష పిటిషన్​ దాఖలు చేయని అక్షయ్​కుమార్​.. నేడు న్యాయస్థానాన్ని ఆశ్రయిచినట్లు అతని తరఫు న్యాయవాది ఎ.పి. సింగ్​ వెల్లడించారు.

తిహార్​ జైలుకు నాలుగో దోషి..

ఆరుగురు ముద్దాయిల్లో ఒకడు బాల నేరస్థుడు కాగా మరో వ్యక్తి రామ్‌సింగ్‌ 2013 మార్చిలో తిహార్‌ కారాగారంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మిగిలిన నలుగురు ఊచలు లెక్కపెడుతున్నారు. వీరిలో వినయ్‌శర్మ, అక్షయ్‌ ఠాకుర్‌, ముకేష్‌ సింగ్‌ తిహార్‌ జైల్లో ఉన్నారు. ఉరి తీయడానికి వీలుగా నాలుగో వ్యక్తి పవన్‌ గుప్తాను మండోలి కారాగారం నుంచి తిహార్‌కు తరలించారు. చట్టపరంగా ఉన్న అవకాశాలన్నీ అయిపోయాయని, చివరి ప్రయత్నంగా కావాలంటే రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం ప్రయత్నించుకోవచ్చని ఈ నలుగురికి ఈ ఏడాది అక్టోబరు 29నే కారాగార వర్గాలు తెలిపాయి. వీరిలో వినయ్‌ ఒక్కడే అర్జీ పెట్టుకోగా దానిని తిరస్కరించాలని దిల్లీ ప్రభుత్వం, కేంద్ర కేబినెట్‌ కూడా ఇటీవలే రాష్ట్రపతికి సిఫార్సు చేశాయి.

2012లో ఘటన..

దేశ రాజధాని నడిబొడ్డున ఏడేళ్ల క్రితం 2012 డిసెంబరు 16వ తేదీ రాత్రి 23 ఏళ్ల పారామెడికల్‌ విద్యార్థినిపై దిల్లీలో ఐదుగురు సామూహిక అత్యాచారానికి, అత్యంత హేయమైన చర్యలకు పాల్పడ్డారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం ఆమెను సింగపూర్‌కు తరలించగా అక్కడ కన్నుమూసింది.

ఇదీ చూడండి: పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా 1000 మంది శాస్త్రవేత్తల పిటిషన్​

AP Video Delivery Log - 0900 GMT Horizons
Tuesday, 10 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0430: HZ India Christmas Preps AP Clients Only 4243894
Christmas cheer celebrated in parts of India
AP-APTN-0430: HZ Rwanda Gorillas AP Clients Only 4242954
What Can Be Saved? Gorillas rise against the odds ++REPLAY++
AP-APTN-0430: HZ US iGym AP Clients Only 4243873
Researchers level playing field for disabled kids
AP-APTN-1423: HZ World Christmas Wrap AP Clients Only 4243842
Christmas festivities celebrated around the globe
AP-APTN-1317: HZ Middle East Bethlehem Tourism AP Clients Only 4243818
Bethlehem welcomes a growth in tourism
AP-APTN-0946: HZ Albania Rivers AP Clients Only 4242952
What Can Be Saved? Dams threaten wild rivers ++REPLAY++
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Dec 10, 2019, 4:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.