ETV Bharat / bharat

రాహుల్ గాంధీకి కరోనా పరీక్షలు..!

ఇటీవలే ఇటలీకి వెళ్లి వచ్చిన కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీకి కరోనా స్క్రీనింగ్‌​ చేయాలని భాజపా నాయకులు చేసిన డిమాండ్​పై స్పందించింది కాంగ్రెస్​. దిల్లీ విమానాశ్రయంలో అధికారులు రాహుల్​కు వైరస్​ స్క్రీనింగ్‌ నిర్వహించినట్లు స్పష్టం చేసింది. సాధారణ ప్రయాణికులతో కలిసి అరగంట పాటు క్యూలో నిల్చొని మరీ స్క్రీనింగ్‌లో పాల్గొన్నట్లు వెల్లడించింది.

author img

By

Published : Mar 7, 2020, 12:35 PM IST

Updated : Mar 7, 2020, 1:20 PM IST

Officials who conducted the screening of Rahul Gandhi's corona
రాహుల్ గాంధీ కరోనా స్క్రీనింగ్ నిర్వహించిన అధికారులు

ఇటీవలే విదేశీ పర్యటన చేసిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి దిల్లీ విమానాశ్రయంలో కరోనా స్క్రీనింగ్‌ నిర్వహించారని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ఈ మధ్యే ఇటలీకి వెళ్లి వచ్చిన రాహుల్‌ గాంధీ కరోనా స్క్రీనింగ్‌ చేయాలని భాజపా నాయకులు డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే, భాజపా ఎంపీలు చేసిన ఈ వ్యాఖ్యలపై తాజాగా కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. జడ్‌ప్లస్‌ కేటగిరి భద్రత ఉన్నప్పటికీ రాహుల్‌ గాంధీ.. ఎయిర్‌పోర్టులో కరోనా స్క్రీనింగ్‌ చేయించుకున్నారని తెలిపింది.

ఫిబ్రవరి 29న విదేశీ తిరుగు ప్రయాణంలో భాగంగా రాహుల్‌ గాంధీ దిల్లీ ఎయిర్‌పోర్టులో విదేశీ ప్రయాణికులకు చేసే స్క్రీనింగ్‌లో పాల్గొన్నట్లు వెల్లడించింది. తనతో భద్రతను పక్కన పెట్టిన రాహల్‌ గాంధీ సాధారణ ప్రయాణికులతో అరగంటపాటు క్యూలో నిల్చొని మరీ స్క్రీనింగ్‌లో పాల్గొన్నారని స్పష్టం చేసింది.

మొత్తం 31 కేసులు నమోదు...

ఇటలీలో ప్రస్తుతం కరోనా వైరస్‌ విజృంభన కారణంగా దాదాపు 80మంది మరణించడంతో పాటు 2వేల కేసులు నమోదయ్యాయి. ఈ సమయంలోనే రాహుల్‌ గాంధీ కూడా ఇటలీ పర్యటన చేసిన నేపథ్యంలో ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించాలని భాజపా నేతలు పట్టుబట్టారు. అంతేకాకుండా కరోనా వైరస్‌పై రాహుల్‌ గాంధీ తగు జాగ్రత్తలు పాటించలేదనే అనుమానం వ్యక్తం చేశారు. దీనిని ఖండించిన కాంగ్రెస్‌ పార్టీ నియమాలను రాహల్‌ గాంధీ పాటించారని స్పష్టం చేశారు. మరోవైపు దేశంలో కరోనా విజృంభిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందని చెబుతోందని రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకుండా ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 31కరోనా కేసులు నమోదుకాగా, వీరిలో 16మంది ఇటలీ పర్యాటకులు కావడం గమనార్హం.

ఇదీ చూడండి:బిహార్​లో ఘోర రోడ్డు ప్రమాదం-12మంది మృతి

ఇటీవలే విదేశీ పర్యటన చేసిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి దిల్లీ విమానాశ్రయంలో కరోనా స్క్రీనింగ్‌ నిర్వహించారని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ఈ మధ్యే ఇటలీకి వెళ్లి వచ్చిన రాహుల్‌ గాంధీ కరోనా స్క్రీనింగ్‌ చేయాలని భాజపా నాయకులు డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే, భాజపా ఎంపీలు చేసిన ఈ వ్యాఖ్యలపై తాజాగా కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. జడ్‌ప్లస్‌ కేటగిరి భద్రత ఉన్నప్పటికీ రాహుల్‌ గాంధీ.. ఎయిర్‌పోర్టులో కరోనా స్క్రీనింగ్‌ చేయించుకున్నారని తెలిపింది.

ఫిబ్రవరి 29న విదేశీ తిరుగు ప్రయాణంలో భాగంగా రాహుల్‌ గాంధీ దిల్లీ ఎయిర్‌పోర్టులో విదేశీ ప్రయాణికులకు చేసే స్క్రీనింగ్‌లో పాల్గొన్నట్లు వెల్లడించింది. తనతో భద్రతను పక్కన పెట్టిన రాహల్‌ గాంధీ సాధారణ ప్రయాణికులతో అరగంటపాటు క్యూలో నిల్చొని మరీ స్క్రీనింగ్‌లో పాల్గొన్నారని స్పష్టం చేసింది.

మొత్తం 31 కేసులు నమోదు...

ఇటలీలో ప్రస్తుతం కరోనా వైరస్‌ విజృంభన కారణంగా దాదాపు 80మంది మరణించడంతో పాటు 2వేల కేసులు నమోదయ్యాయి. ఈ సమయంలోనే రాహుల్‌ గాంధీ కూడా ఇటలీ పర్యటన చేసిన నేపథ్యంలో ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించాలని భాజపా నేతలు పట్టుబట్టారు. అంతేకాకుండా కరోనా వైరస్‌పై రాహుల్‌ గాంధీ తగు జాగ్రత్తలు పాటించలేదనే అనుమానం వ్యక్తం చేశారు. దీనిని ఖండించిన కాంగ్రెస్‌ పార్టీ నియమాలను రాహల్‌ గాంధీ పాటించారని స్పష్టం చేశారు. మరోవైపు దేశంలో కరోనా విజృంభిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందని చెబుతోందని రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకుండా ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 31కరోనా కేసులు నమోదుకాగా, వీరిలో 16మంది ఇటలీ పర్యాటకులు కావడం గమనార్హం.

ఇదీ చూడండి:బిహార్​లో ఘోర రోడ్డు ప్రమాదం-12మంది మృతి

Last Updated : Mar 7, 2020, 1:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.