ETV Bharat / bharat

నిర్భయ: దిల్లీ కోర్టుకు వినయ్.. వైద్యం కోసం వినతి​

author img

By

Published : Feb 20, 2020, 3:20 PM IST

Updated : Mar 1, 2020, 11:12 PM IST

తన మానసిక స్థితి బాగోలేదని, తలకు తగిలిన గాయాలకు మెరుగైన వైద్యం అందించాలంటూ దిల్లీకోర్టుకు విజ్ఞప్తి చేశాడు నిర్భయ దోషి వినయ్​. ఈ నేపథ్యంలో తిహార్​ జైలు అధికారులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. వినయ్​ వ్యాజ్యంపై తమ స్పందన తెలియజేయాలని ఆదేశించింది.

Nirbhaya: Court seeks Tihar jail authorities' reply on convict Vinay's plea for medical treatment
నిర్భయ: దిల్లీ కోర్టుకు వినయ్.. వైద్యం కోసం వినతి​

ఉరిశిక్ష తప్పించుకోవడానికి నిర్భయ దోషులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. తాజాగా నలుగురు దోషుల్లో ఒకడైన వినయ్​.. దిల్లీ కోర్టులో పిటిషన్​ దాఖలు చేశాడు. తన మానసిక స్థితి సరిగా లేదని, తలకూ గాయాలయ్యాయని.. అందుకే మెరుగైన వైద్యం అందించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశాడు.

వినయ్​ మానసిక పరిస్థితి బాలేదని.. తల్లిని కూడా గుర్తుపట్టలేకపోతున్నాడని అతడి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే ఆయన వాదనలను ప్రభుత్వం తరఫు న్యాయవాది ఖండించారు. ఇవేవీ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.

ఈ పూర్తి వ్యవహారంపై స్పందించాలంటూ తిహార్​ జైలు అధికారులకు నోటీసులను జారీ చేసింది దిల్లీ కోర్టు. శనివారం నాడు తమ స్పందన తెలియజేయాలని ఆదేశించింది.

ఉరి పరిస్థితి..?

ఈ నెల 16న జైలులో వినయ్​ ఆత్మహత్యకు యత్నించినట్టు తిహార్​ జైలు ఓ ప్రకటన విడుదల చేసింది. జైలులోని గోడలకు తన తలను బలంగా కొట్టుకుని.. తన అంతట తానే గాయపరుచుకున్నాడని స్పష్టం చేసింది.

రెండు వాయిదాల అనంతరం మార్చి 3న నలుగురు దోషుల ఉరికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఉరి నుంచి తప్పించుకోవడానికి దోషులు అన్ని మార్గాలు వెతుక్కుంటున్నారు.

ఇదీ చూడండి:- డెత్​ వారెంట్ల జారీపై సుప్రీం కోర్టు అసంతృప్తి

ఉరిశిక్ష తప్పించుకోవడానికి నిర్భయ దోషులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. తాజాగా నలుగురు దోషుల్లో ఒకడైన వినయ్​.. దిల్లీ కోర్టులో పిటిషన్​ దాఖలు చేశాడు. తన మానసిక స్థితి సరిగా లేదని, తలకూ గాయాలయ్యాయని.. అందుకే మెరుగైన వైద్యం అందించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశాడు.

వినయ్​ మానసిక పరిస్థితి బాలేదని.. తల్లిని కూడా గుర్తుపట్టలేకపోతున్నాడని అతడి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే ఆయన వాదనలను ప్రభుత్వం తరఫు న్యాయవాది ఖండించారు. ఇవేవీ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.

ఈ పూర్తి వ్యవహారంపై స్పందించాలంటూ తిహార్​ జైలు అధికారులకు నోటీసులను జారీ చేసింది దిల్లీ కోర్టు. శనివారం నాడు తమ స్పందన తెలియజేయాలని ఆదేశించింది.

ఉరి పరిస్థితి..?

ఈ నెల 16న జైలులో వినయ్​ ఆత్మహత్యకు యత్నించినట్టు తిహార్​ జైలు ఓ ప్రకటన విడుదల చేసింది. జైలులోని గోడలకు తన తలను బలంగా కొట్టుకుని.. తన అంతట తానే గాయపరుచుకున్నాడని స్పష్టం చేసింది.

రెండు వాయిదాల అనంతరం మార్చి 3న నలుగురు దోషుల ఉరికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఉరి నుంచి తప్పించుకోవడానికి దోషులు అన్ని మార్గాలు వెతుక్కుంటున్నారు.

ఇదీ చూడండి:- డెత్​ వారెంట్ల జారీపై సుప్రీం కోర్టు అసంతృప్తి

Last Updated : Mar 1, 2020, 11:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.