కేరళలోని శబరిమల ఆలయంతో సహా వివిధ మతాలలో, మత ప్రదేశాల్లో మహిళలపై ఉన్న వివక్షకు సంబంధించిన విషయాలను సుప్రీంకోర్టు ఇవాళ క్రోడీకరించనుంది.
తొమ్మిది మంది సభ్యులు గల రాజ్యాంగ ధర్మాసనం పరిశీలించనున్న అంశాలు:
- శబరిమల అయ్యప్ప ఆలయంలో యుక్తవయస్సు మహిళలకు ప్రవేశార్హత లేకపోవడం.
- మసీదుల్లోకి ముస్లిం మహిళలకు ప్రవేశార్హత లేకపోవడం.
- దావూది బోహ్రా ముస్లింల్లో మహిళలకు సున్తీ చేయించడం.
- ఇతర మతస్థులను వివాహం చేసుకున్న పార్శీ స్త్రీలకు పవిత్ర అగియారీలో ప్రవేశించకుండా నిషేధించడం.
రాజ్యాంగ ధర్మాసనంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డేతో సహా జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ ఎమ్ఎమ్ సంతానగౌండర్, జస్టిస్ ఎస్ఏ నజీర్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు.
కేరళలోని శబరిమల ఆలయంతో సహా వివిధ మతాలలో, మత ప్రదేశాల్లో మహిళలపై ఉన్న వివక్షకు సంబంధించిన విషయాలపై ఈ ధర్మాసనం విచారణ చేయనుంది.
ఇందుకోసం న్యాయవాదులందరూ శబరిమల, ఇతర అంశాలపై ఎలా వాదించాలనే విషయమై చర్చించుకొని ఒక నిర్ణయానికి రావాలని సుప్రీం సూచించింది. దీని కోసం మూడువారాల గడువు ఇస్తున్నట్లు తెలిపింది. తాజాగా దీనిపై విచారణ సందర్భంగా పదిరోజుల్లోగా వాదనలు ముగించాలని విస్తృత ధర్మాసనానికి సూచించింది.
ఇదీ చూడండి: కరోనాతో యుద్ధంలోనూ చైనా 'శక్తి' భేష్!