ETV Bharat / bharat

కశ్మీరీలకు టీవీ ఛానళ్లే సందేశ మాధ్యమాలు!

జమ్ముకశ్మీర్​ ప్రజలకు, ఇతర ప్రాంతాల్లో ఉండే కుటుంబ సభ్యులకు టీవీ ఛానళ్లు సందేశ మాధ్యమాలుగా నిలుస్తున్నాయి. దేశ నలుమూలలు, ఇతర దేశాల నుంచి తమ శ్రేయోభిలాషుల యోగ క్షేమాలను ఛానళ్ల ద్వారా తెలుసుకుంటున్నారు కశ్మీర్​ ప్రజలు. ఆ రాష్ట్రంలో ల్యాండ్​లైన్ ఫోన్లు, మొబైల్స్​, ఇంటర్​నెట్ సర్వీసు నిలిపివేయడమే ఇందుకు కారణం.

author img

By

Published : Aug 17, 2019, 6:31 AM IST

Updated : Sep 27, 2019, 6:16 AM IST

కశ్మీరీలకు టీవీ ఛానళ్లే సందేశ మాధ్యమాలు!

టీవీ ఛానళ్లు జమ్ముకశ్మీర్ ప్రజలకు సందేశ మాధ్యమాలుగా అవతరించాయి. ఆ రాష్ట్రంలో ల్యాండ్​లైన్​ ఫోన్లు, మొబైల్స్​, ఇంటర్​నెట్ సదుపాయాల నిలిపివేతతో.. ఇతర ప్రాంతాల్లో నివసించే కశ్మీరీలు తమ కుటుంబ సభ్యుల యోగ క్షేమాలను టీవీ ఛానళ్ల ద్వారా తెలుసుకుంటున్నారు. దేశ నలుమూలలు, ఇతర దేశాల నుంచి ఛానళ్ల ద్వారా తమ శ్రేయోభిలాషులకు సందేశాన్ని చేరవేస్తున్నారు.

లోకల్​ కేబుల్​ ఛానల్​, ప్రాంతీయ, జాతీయ టీవీ ఛానళ్లకు సందేశాలు వెల్లువెత్తాయని ఓ ప్రైవేటు ఛానల్ ప్రతినిధి తెలిపారు. కశ్మీర్​ ప్రభుత్వం 300 ప్రజా టెలిఫోన్​లను అందుబాటులోకి తీసుకొచ్చాక ఈ సందేశాల ప్రవాహం తగ్గిందని చెప్పారు.

కొంత మంది తమ కుటుంబ సభ్యుల గురించి తెలుసుకునేందుకు, మరికొంత మంది తాము క్షేమంగా ఉన్నట్లు తల్లిదండ్రులకు తెలిపేందుకు సందేశాలు పంపేవారని ప్రైవేటు ఛానల్​ ప్రతినిధి చెప్పారు.

టీవీ ఛానళ్లకు పంపిన కొన్ని సందేశాలు

ఇటీవలే సైన్యంలో చేరి కశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న తన సోదరుడి గురించి తెలుసుకోవాలని అసోం నుంచి పూజా మిశ్రా సందేశం పంపారు.
తన స్నేహితుడు, అతని కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారో తెలుసుకోవాలని ఉత్తర్​ప్రదేశ్ నుంచి పింకి సందేశం పంపారు.

పెళ్లి వేడుకలు నిరాడంబరంగా నిర్వహిస్తున్నట్లు చాలా సందేశాలు వచ్చాయి.

తాను క్షేమంగా ఉన్నానని, వచ్చే నెలలో తన సోదరితో పుస్తకాలు పంపించాలని కుటుంబ సభ్యులకు సందేశం పంపాడు బెంగళూరు​లో చదువుకుంటున్న ఖలీద్​.

దేశ నలుమూలల నుంచే కాదు ఖతార్​​, సౌదీ అరేబియా, దుబాయ్, కువైట్​ ఇలా ప్రపంచ దేశాల నుంచి టీవీ ఛానళ్లకు సందేశాలు వచ్చాయి.

ఛానల్ వాట్సాప్ నంబర్​కు హైదరాబాద్​ నుంచి ఎక్కువ సందేశాలు వచ్చినట్లు ఓ టీవీ ఛానల్ ప్రతినిధి తెలిపారు. వాటిని స్క్రోలింగ్​లో ప్రచారం చేశామన్నారు.

టీవీ ఛానళ్లు జమ్ముకశ్మీర్ ప్రజలకు సందేశ మాధ్యమాలుగా అవతరించాయి. ఆ రాష్ట్రంలో ల్యాండ్​లైన్​ ఫోన్లు, మొబైల్స్​, ఇంటర్​నెట్ సదుపాయాల నిలిపివేతతో.. ఇతర ప్రాంతాల్లో నివసించే కశ్మీరీలు తమ కుటుంబ సభ్యుల యోగ క్షేమాలను టీవీ ఛానళ్ల ద్వారా తెలుసుకుంటున్నారు. దేశ నలుమూలలు, ఇతర దేశాల నుంచి ఛానళ్ల ద్వారా తమ శ్రేయోభిలాషులకు సందేశాన్ని చేరవేస్తున్నారు.

లోకల్​ కేబుల్​ ఛానల్​, ప్రాంతీయ, జాతీయ టీవీ ఛానళ్లకు సందేశాలు వెల్లువెత్తాయని ఓ ప్రైవేటు ఛానల్ ప్రతినిధి తెలిపారు. కశ్మీర్​ ప్రభుత్వం 300 ప్రజా టెలిఫోన్​లను అందుబాటులోకి తీసుకొచ్చాక ఈ సందేశాల ప్రవాహం తగ్గిందని చెప్పారు.

కొంత మంది తమ కుటుంబ సభ్యుల గురించి తెలుసుకునేందుకు, మరికొంత మంది తాము క్షేమంగా ఉన్నట్లు తల్లిదండ్రులకు తెలిపేందుకు సందేశాలు పంపేవారని ప్రైవేటు ఛానల్​ ప్రతినిధి చెప్పారు.

టీవీ ఛానళ్లకు పంపిన కొన్ని సందేశాలు

ఇటీవలే సైన్యంలో చేరి కశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న తన సోదరుడి గురించి తెలుసుకోవాలని అసోం నుంచి పూజా మిశ్రా సందేశం పంపారు.
తన స్నేహితుడు, అతని కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారో తెలుసుకోవాలని ఉత్తర్​ప్రదేశ్ నుంచి పింకి సందేశం పంపారు.

పెళ్లి వేడుకలు నిరాడంబరంగా నిర్వహిస్తున్నట్లు చాలా సందేశాలు వచ్చాయి.

తాను క్షేమంగా ఉన్నానని, వచ్చే నెలలో తన సోదరితో పుస్తకాలు పంపించాలని కుటుంబ సభ్యులకు సందేశం పంపాడు బెంగళూరు​లో చదువుకుంటున్న ఖలీద్​.

దేశ నలుమూలల నుంచే కాదు ఖతార్​​, సౌదీ అరేబియా, దుబాయ్, కువైట్​ ఇలా ప్రపంచ దేశాల నుంచి టీవీ ఛానళ్లకు సందేశాలు వచ్చాయి.

ఛానల్ వాట్సాప్ నంబర్​కు హైదరాబాద్​ నుంచి ఎక్కువ సందేశాలు వచ్చినట్లు ఓ టీవీ ఛానల్ ప్రతినిధి తెలిపారు. వాటిని స్క్రోలింగ్​లో ప్రచారం చేశామన్నారు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Sep 27, 2019, 6:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.