ETV Bharat / bharat

'వందే భారత్​'తో స్వదేశానికి చేరిన 15 లక్షల మంది

author img

By

Published : Sep 6, 2020, 5:16 AM IST

Updated : Sep 6, 2020, 9:51 AM IST

వందే భారత్​ మిషన్​లో భాగంగా వివిధ మార్గాల ద్వారా విదేశాల్లో చిక్కుకున్న15 లక్షలకుపైగా మందిని భారత్​కు చేర్చినట్లు తెలిపింది పౌరవిమానయాన శాఖ. విదేశాల్లో చిక్కుకున్న వారి కోసం అంతర్జాతీయ విమానాల సేవలు కొనసాగుతాయని వెల్లడించింది.

vande bharat mission
'వందే భారత్​'తో స్వదేశానికి చేరిన 15 లక్షల మంది

వందే భారత్​ మిషన్​ ద్వారా ఇప్పటి వరకు 15 లక్షలకుపైగా భారతీయులను వివిధ మార్గాల ద్వారా స్వదేశానికి చేర్చినట్లు తెలిపారు పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్​ సింగ్​ పూరీ. విదేశాల్లో చిక్కుకున్న వారి కోసం వందే భారత్​ అంతర్జాతీయ విమానాల సేవలు కొనసాగుతాయని వెల్లడించారు. కేవలం విమానాల ద్వారానే 4.5 లక్షలమందికిపైగా భారత్​కు తీసుకొచ్చినట్లు చెప్పారు.

కరోనా మహమ్మారి నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని భారత్​కు తీసుకొచ్చేందుకు మే 7న ఈ మిషన్​ ప్రారంభించింది కేంద్రం. వందే భారత్​లో భాగంగా అమెరికా, కెనడా, బ్రిటన్​ వంటి 40కిపైగా దేశాలతో ఎయిర్​ బబుల్​ ఒప్పందం చేసుకుని.. ద్వైపాక్షిక ఒప్పందాల సాయంతో నిబంధనల మేరకు భారతీయులను తరలింపు చేపట్టింది.

వందే భారత్​ మిషన్​ ద్వారా ఇప్పటి వరకు 15 లక్షలకుపైగా భారతీయులను వివిధ మార్గాల ద్వారా స్వదేశానికి చేర్చినట్లు తెలిపారు పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్​ సింగ్​ పూరీ. విదేశాల్లో చిక్కుకున్న వారి కోసం వందే భారత్​ అంతర్జాతీయ విమానాల సేవలు కొనసాగుతాయని వెల్లడించారు. కేవలం విమానాల ద్వారానే 4.5 లక్షలమందికిపైగా భారత్​కు తీసుకొచ్చినట్లు చెప్పారు.

కరోనా మహమ్మారి నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని భారత్​కు తీసుకొచ్చేందుకు మే 7న ఈ మిషన్​ ప్రారంభించింది కేంద్రం. వందే భారత్​లో భాగంగా అమెరికా, కెనడా, బ్రిటన్​ వంటి 40కిపైగా దేశాలతో ఎయిర్​ బబుల్​ ఒప్పందం చేసుకుని.. ద్వైపాక్షిక ఒప్పందాల సాయంతో నిబంధనల మేరకు భారతీయులను తరలింపు చేపట్టింది.

ఇదీ చూడండి: 'బుల్లెట్‌' ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేం!

Last Updated : Sep 6, 2020, 9:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.