ETV Bharat / bharat

అభివృద్ధికి మారుపేరు మోదీ 2.0: అమిత్​షా

మోదీ 2.0 ప్రభుత్వానికి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మంత్రివర్గ సహచరులకు అభినందనలు తెలిపారు హోంమంత్రి అమిత్​షా. పేద ప్రజల సంక్షేమానికి, జాతీయ భద్రతకు ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని ట్విట్టర్​లో వరుస పోస్టులు చేశారు.

author img

By

Published : Sep 8, 2019, 12:23 PM IST

Updated : Sep 29, 2019, 9:03 PM IST

అభివృద్ధికి మారుపేరు మోదీ 2.0: అమిత్​షా

జాతీయ భద్రత, అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మారుపేరని ఉద్ఘాటించారు కేంద్ర హోంమంత్రి అమిత్​షా. పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వం అన్ని వర్గాలకు ఆశాజ్యోతి వంటిదని వ్యాఖ్యానించారు. మోదీ 2.0 ప్రభుత్వానికి వంద రోజులు పూర్తయిన నేపథ్యంలో అభినందనలు తెలుపుతూ వరుస ట్వీట్లు చేశారు అమిత్​ షా.

ఆర్టికల్ 370 రద్దు సహా 70 ఏళ్ల నుంచి ప్రతి భారతీయుడు వేచి చూస్తున్న కీలక, చారిత్రక నిర్ణయాలను మోదీ 2.0 ప్రభుత్వం తీసుకుందని గుర్తుచేశారు షా.

"ఆర్టికల్ 370, 35ఎ రద్దు, ముమ్మారు తలాక్​ నుంచి ముస్లిం మహిళలకు విముక్తి, యూఏపీఏ చట్టానికి సవరణ వంటి అనేక చారిత్రక నిర్ణయాలు మోదీ నాయకత్వం వల్లే జరిగాయి."

-అమిత్​షా, కేంద్ర హోమంత్రి

దేశ అభివృద్ధి, సంక్షేమం, భద్రత కోసం ఉన్న ఏ అవకాశాన్నీ మోదీ ప్రభుత్వం వదిలిపెట్టదని పేర్కొన్నారు అమిత్ షా.

shah
అమిత్​షా ట్వీట్లు

ఇదీ చూడండి: అండర్​ వరల్డ్​ డాన్​లు,​ అగ్రనేతలు జెఠ్మలానీ క్లయింట్లే!

జాతీయ భద్రత, అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మారుపేరని ఉద్ఘాటించారు కేంద్ర హోంమంత్రి అమిత్​షా. పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వం అన్ని వర్గాలకు ఆశాజ్యోతి వంటిదని వ్యాఖ్యానించారు. మోదీ 2.0 ప్రభుత్వానికి వంద రోజులు పూర్తయిన నేపథ్యంలో అభినందనలు తెలుపుతూ వరుస ట్వీట్లు చేశారు అమిత్​ షా.

ఆర్టికల్ 370 రద్దు సహా 70 ఏళ్ల నుంచి ప్రతి భారతీయుడు వేచి చూస్తున్న కీలక, చారిత్రక నిర్ణయాలను మోదీ 2.0 ప్రభుత్వం తీసుకుందని గుర్తుచేశారు షా.

"ఆర్టికల్ 370, 35ఎ రద్దు, ముమ్మారు తలాక్​ నుంచి ముస్లిం మహిళలకు విముక్తి, యూఏపీఏ చట్టానికి సవరణ వంటి అనేక చారిత్రక నిర్ణయాలు మోదీ నాయకత్వం వల్లే జరిగాయి."

-అమిత్​షా, కేంద్ర హోమంత్రి

దేశ అభివృద్ధి, సంక్షేమం, భద్రత కోసం ఉన్న ఏ అవకాశాన్నీ మోదీ ప్రభుత్వం వదిలిపెట్టదని పేర్కొన్నారు అమిత్ షా.

shah
అమిత్​షా ట్వీట్లు

ఇదీ చూడండి: అండర్​ వరల్డ్​ డాన్​లు,​ అగ్రనేతలు జెఠ్మలానీ క్లయింట్లే!

New Delhi, Sep 08 (ANI): The Federal Aviation Minister of Pakistan Ghulam Sarwar Khan on September 07 denied President Ram Nath Kovind the use of Pakistani airspace for his flight to Iceland this month because of India's "continued aggression against and oppression of the Kashmiri people". While speaking to ANI, Defence Expert PK Sehgal said, "The denial of airspace for presidential aircraft is a bad gesture and apparently it has major diplomatic form of Pakistan. They could have earned several brownie points but they missed the opportunity." "India and Pakistan are not at war and they could have told the international audience that strain in relation not with sending they have been graceful but they completely missed the chance," Sehgal added.
Last Updated : Sep 29, 2019, 9:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.