ETV Bharat / bharat

బంపర్​ ఆఫర్​: మొక్క నాటు.. రూ.1000 పట్టు!

author img

By

Published : Jun 13, 2020, 12:27 PM IST

మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాలని పలువురు నిపుణులు సూచిస్తున్నా.. ఎక్కువమంది ఆసక్తి చూపటం లేదు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నాందేడ్​కు చెందిన ఓ కుటుంబం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మొక్క నాటితే.. రూ. 1000 ఇస్తామని చెబుతోంది.

Plant a tree .. get a thousand rupees
హరిత్​ కంధార్

పర్యావరణ సమతుల్యతకు మొక్కలే ఆధారం. కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని రక్షించేందుకు విరివిగా మొక్కలు నాటాలని, అడవులను రక్షించాలని పర్యావరణవేత్తలు ఉద్యమాలు చేస్తున్నారు. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నా.. ఫలితాలు అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నాందేడ్​కు చెందిన ఓ కుటుంబం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మొక్కల పెంపునకు ప్రజలు ఆసక్తి చూపేలా కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. మొక్క నాటి.. దానిని చెట్టుగా మారిస్తే.. రూ. 1000 ఇస్తామని చెబుతోంది.

మొక్కల పెంపకంపై హరిత్​ కంధార్​ కుటుంబం వినూత్న ప్రయత్నం

నాందేడ్​ నగరానికి చెందిన 'హరిత్​ కంధార్'​ అనే కుటుంబం.. పర్యావరణాన్ని కాపాడేందుకు మొక్కలు నాటాలని సంకల్పించుకుంది. ఇంటి పరిసరాలు, దారుల పక్కన విరివిగా మొక్కలు నాటి గ్రీన్​ సిటీగా మార్చేందుకు కృషి చేయాలని ప్రతి ఒక్కరిని కోరింది. కానీ పెద్దగా స్పందన రాలేదు. ఈ క్రమంలో ప్రజలను భాగస్వాములు చేసేందుకు వినూత్న ఆలోచన చేసింది ఆ కుటుంబం. "మొక్క నాటు.. రూ. 1000 పట్టు" అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది.

500 మొక్కలు..

ఈ ప్రచారం ప్రజల్లోకి వేగంగా వెళ్లింది. మంచి స్పందన లభించింది. నాందేడ్​ నగరంలో రోడ్ల పక్కన, ఖాళీ ప్రదేశాల్లో సుమారు 500లకుపైగా మొక్కలు నాటారు. వాటిపై నిరంతరం నిఘా పెడుతూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.

ఇదీ చూడండి: రికార్డు​ స్థాయిలో నమోదైన భూమి సగటు ఉష్ణోగ్రత

పర్యావరణ సమతుల్యతకు మొక్కలే ఆధారం. కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని రక్షించేందుకు విరివిగా మొక్కలు నాటాలని, అడవులను రక్షించాలని పర్యావరణవేత్తలు ఉద్యమాలు చేస్తున్నారు. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నా.. ఫలితాలు అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నాందేడ్​కు చెందిన ఓ కుటుంబం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మొక్కల పెంపునకు ప్రజలు ఆసక్తి చూపేలా కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. మొక్క నాటి.. దానిని చెట్టుగా మారిస్తే.. రూ. 1000 ఇస్తామని చెబుతోంది.

మొక్కల పెంపకంపై హరిత్​ కంధార్​ కుటుంబం వినూత్న ప్రయత్నం

నాందేడ్​ నగరానికి చెందిన 'హరిత్​ కంధార్'​ అనే కుటుంబం.. పర్యావరణాన్ని కాపాడేందుకు మొక్కలు నాటాలని సంకల్పించుకుంది. ఇంటి పరిసరాలు, దారుల పక్కన విరివిగా మొక్కలు నాటి గ్రీన్​ సిటీగా మార్చేందుకు కృషి చేయాలని ప్రతి ఒక్కరిని కోరింది. కానీ పెద్దగా స్పందన రాలేదు. ఈ క్రమంలో ప్రజలను భాగస్వాములు చేసేందుకు వినూత్న ఆలోచన చేసింది ఆ కుటుంబం. "మొక్క నాటు.. రూ. 1000 పట్టు" అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది.

500 మొక్కలు..

ఈ ప్రచారం ప్రజల్లోకి వేగంగా వెళ్లింది. మంచి స్పందన లభించింది. నాందేడ్​ నగరంలో రోడ్ల పక్కన, ఖాళీ ప్రదేశాల్లో సుమారు 500లకుపైగా మొక్కలు నాటారు. వాటిపై నిరంతరం నిఘా పెడుతూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.

ఇదీ చూడండి: రికార్డు​ స్థాయిలో నమోదైన భూమి సగటు ఉష్ణోగ్రత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.