ETV Bharat / bharat

కరోనా సాంపిల్స్​ కోసం వెళ్లిన సిబ్బందిపై దాడి

ఉత్తర్​ప్రదేశ్​లోని షామ్లీ ప్రాంతంలో వైద్య బృందంపై ఓ యువకుడు దాడి చేశాడు. మురికివాడల్లో కరోనా కట్టడి కోసం నమూనాలు సేకరిస్తుండగా.. అర్వింద్​ అనే వ్యక్తి వారితో దురుసుగా ప్రవర్తించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

author img

By

Published : Nov 20, 2020, 3:57 PM IST

Medical team taking corona test sample attacked in Shamli
వైద్య బృందంపై దాడి

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఉత్తర్​ ప్రదేశ్​ షామ్లీలోని మురికివాడల్లో నమూనాలు సేకరించేందుకు వైద్య నిపుణుల బృందం పర్యటిస్తోంది. డా. మీనాక్షి ధీమాన్​ నేతృత్వంలోని బృందం.. ధేవా బస్తీ సిటీ బ్లాక్​ రోడ్డు వద్ద నమూనాలు తీసుకుంటుండగా.. అర్వింద్​ అనే యువకుడు హల్​చల్​ చేశాడు.

వైద్య బృందంపై దాడి

వారితో తప్పుగా ప్రవర్తించడమే కాకుండా.. పనికి పదే పదే ఆటంకం కలిగించాడు. ఆపేందుకు ప్రయత్నించిన వైద్య బృందంలోని డ్రైవర్​పై కర్రతో దాడికి దిగాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ.. అప్పటికే దుండగుడు పారిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: కాళ్లు, చేతులకు బేడీలతో 10 కి.మీ ఈత

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఉత్తర్​ ప్రదేశ్​ షామ్లీలోని మురికివాడల్లో నమూనాలు సేకరించేందుకు వైద్య నిపుణుల బృందం పర్యటిస్తోంది. డా. మీనాక్షి ధీమాన్​ నేతృత్వంలోని బృందం.. ధేవా బస్తీ సిటీ బ్లాక్​ రోడ్డు వద్ద నమూనాలు తీసుకుంటుండగా.. అర్వింద్​ అనే యువకుడు హల్​చల్​ చేశాడు.

వైద్య బృందంపై దాడి

వారితో తప్పుగా ప్రవర్తించడమే కాకుండా.. పనికి పదే పదే ఆటంకం కలిగించాడు. ఆపేందుకు ప్రయత్నించిన వైద్య బృందంలోని డ్రైవర్​పై కర్రతో దాడికి దిగాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ.. అప్పటికే దుండగుడు పారిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: కాళ్లు, చేతులకు బేడీలతో 10 కి.మీ ఈత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.