ETV Bharat / bharat

'బంగాల్​లో 324 ఈసీ మోదీకిచ్చిన బహుమతి'

ఎన్నికల సంఘంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మమతా బెనర్జీ. ఈసీ బంగాల్​లో ఆర్టికల్​ 324ను అమలు చేసి మోదీకి బహుమానంగా ఇచ్చిందని విమర్శించారు. ఈ చర్య రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు.

author img

By

Published : May 16, 2019, 5:03 AM IST

'బంగాల్​లో 324 ఈసీ మోదీకిచ్చిన బహుమతి'
'బంగాల్​లో 324 ఈసీ మోదీకిచ్చిన బహుమతి'

బంగాల్​లో లోక్​సభ తుదిదశ ఎన్నికల ప్రచార సమయాన్ని కుదించటంపై బంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్టికల్​ 324ను బంగాల్​లో అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచార సమయాన్ని తగ్గించటం అనైతిక చర్యని దుయ్యబట్టారు. ఈసీ అనైతికంగా మోదీకిచ్చిన బహుమతని ఆరోపించారు. మొత్తం ఆరెస్సెస్​ కార్యకర్తలతో నిండిన ఇలాంటి ఎన్నికల సంఘాన్ని ఇంతకముందెన్నడూ చూడలేదని విమర్శించారు దీదీ.

"ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత అంతా మీ అధీనంలోనే ఉంటుంది, నిజమే. కానీ దయచేసి గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మాత్రం ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వం ఉంటుంది. ఎన్నికైన ప్రభుత్వాన్ని మీరు అధీనంలోకి తీసుకోలేరు ఎన్నికల కమిషనర్ గారూ. గుర్తుంచుకోండి."
- మమతా బెనర్జీ, పశ్చిమబంగ ముఖ్యమంత్రి

బంగాల్​లో ఎన్నికల ప్రచారం సమయాన్ని కుదించింది కేంద్ర ఎన్నికల సంఘం. కోల్​కతాలో టీఎంసీ, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఆర్టికల్ 324 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు. బంగాల్​లో ఎన్నికలు జరగాల్సిన 9 లోక్​సభ నియోజకవర్గాల పరిధిలోనూ గురువారం రాత్రి 10 గంటలకే ప్రచారం ముగియనుంది.

'బంగాల్​లో 324 ఈసీ మోదీకిచ్చిన బహుమతి'

బంగాల్​లో లోక్​సభ తుదిదశ ఎన్నికల ప్రచార సమయాన్ని కుదించటంపై బంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్టికల్​ 324ను బంగాల్​లో అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచార సమయాన్ని తగ్గించటం అనైతిక చర్యని దుయ్యబట్టారు. ఈసీ అనైతికంగా మోదీకిచ్చిన బహుమతని ఆరోపించారు. మొత్తం ఆరెస్సెస్​ కార్యకర్తలతో నిండిన ఇలాంటి ఎన్నికల సంఘాన్ని ఇంతకముందెన్నడూ చూడలేదని విమర్శించారు దీదీ.

"ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత అంతా మీ అధీనంలోనే ఉంటుంది, నిజమే. కానీ దయచేసి గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మాత్రం ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వం ఉంటుంది. ఎన్నికైన ప్రభుత్వాన్ని మీరు అధీనంలోకి తీసుకోలేరు ఎన్నికల కమిషనర్ గారూ. గుర్తుంచుకోండి."
- మమతా బెనర్జీ, పశ్చిమబంగ ముఖ్యమంత్రి

బంగాల్​లో ఎన్నికల ప్రచారం సమయాన్ని కుదించింది కేంద్ర ఎన్నికల సంఘం. కోల్​కతాలో టీఎంసీ, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఆర్టికల్ 324 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు. బంగాల్​లో ఎన్నికలు జరగాల్సిన 9 లోక్​సభ నియోజకవర్గాల పరిధిలోనూ గురువారం రాత్రి 10 గంటలకే ప్రచారం ముగియనుంది.

Intro:Body:

vfvf


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.