ETV Bharat / bharat

'బై ఫ్రమ్​ చైనా'గా మారిన 'మేక్​ ఇన్​ ఇండియా': రాహుల్​

author img

By

Published : Nov 4, 2019, 5:04 PM IST

Updated : Nov 4, 2019, 6:36 PM IST

ఆర్​సెప్​ ఒప్పందంపై భారత్​ సంతకం చేస్తే.. దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందని రాహుల్​ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్​సెప్​ వల్ల భారత్​లో తయారీ(మేకిన్​ ఇండియా) కాస్త చైనా నుంచి కొనుగోలు(బై ఫ్రమ్​ చైనా)గా మారిపోయిందని ఎద్దేవా చేశారు.

'బై ఫ్రమ్​ చైనా'గా మారిన 'మేక్​ ఇన్​ ఇండియా': రాహుల్​

'బై ఫ్రమ్​ చైనా'గా మారిన 'మేక్​ ఇన్​ ఇండియా': రాహుల్​

ప్రపంచ దేశాధినేతల ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(ఆర్​సెప్​)పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. ఆర్​సెప్​ ద్వారా భారత్​లో తయారీ (మేక్​ ఇన్​ ఇండియా) కాస్త.. చైనా నుంచి కొనుగోలు (బై ఫ్రమ్​ చైనా)గా మారిందన్నారు. ఈ స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం కుదిరితే భారత్​లోకి చౌక ధర సరుకులు వెల్లువెత్తుతాయని.. దీని వల్ల దేశంలో నిరుద్యోగ సమస్య మరింత పెరుగుతుందని ఆరోపించారు. ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ నష్టాల్లో కూరుకుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:- నేడే 'ఆర్‌సెప్‌' సమావేశం- కీలక నిర్ణయం.. ఎటు?

"మేక్​ ఇండియా కాస్త.. బై ఫ్రమ్​ చైనాగా మారిపోయింది. ఒక్కో భారతీయుడికి ప్రతి ఏడాది రూ. 6వేలు విలువ చేసే సరుకులు దిగుమతవుతున్నాయి. 2014 నుంచి 100శాతం పెరిగిపోయింది. ఆర్​సెప్​ వల్ల భారత్​లోకి చౌక ధర సరుకులు భారీగా వచ్చిపడతాయి. దాని వల్ల లక్షల ఉద్యోగాలు పోతాయి."
- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత.

కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ఆర్​సెప్​పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్​సెప్​ ఒప్పందంపై భారత్​ సంతకం చేస్తే.. ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎదురుదెబ్బ తగులుతుందన్నారు. దీని వల్ల రైతులు, చిరు వ్యాపారులు, దుకాణదారులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.

'బై ఫ్రమ్​ చైనా'గా మారిన 'మేక్​ ఇన్​ ఇండియా': రాహుల్​

ప్రపంచ దేశాధినేతల ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(ఆర్​సెప్​)పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. ఆర్​సెప్​ ద్వారా భారత్​లో తయారీ (మేక్​ ఇన్​ ఇండియా) కాస్త.. చైనా నుంచి కొనుగోలు (బై ఫ్రమ్​ చైనా)గా మారిందన్నారు. ఈ స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం కుదిరితే భారత్​లోకి చౌక ధర సరుకులు వెల్లువెత్తుతాయని.. దీని వల్ల దేశంలో నిరుద్యోగ సమస్య మరింత పెరుగుతుందని ఆరోపించారు. ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ నష్టాల్లో కూరుకుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:- నేడే 'ఆర్‌సెప్‌' సమావేశం- కీలక నిర్ణయం.. ఎటు?

"మేక్​ ఇండియా కాస్త.. బై ఫ్రమ్​ చైనాగా మారిపోయింది. ఒక్కో భారతీయుడికి ప్రతి ఏడాది రూ. 6వేలు విలువ చేసే సరుకులు దిగుమతవుతున్నాయి. 2014 నుంచి 100శాతం పెరిగిపోయింది. ఆర్​సెప్​ వల్ల భారత్​లోకి చౌక ధర సరుకులు భారీగా వచ్చిపడతాయి. దాని వల్ల లక్షల ఉద్యోగాలు పోతాయి."
- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత.

కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ఆర్​సెప్​పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్​సెప్​ ఒప్పందంపై భారత్​ సంతకం చేస్తే.. ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎదురుదెబ్బ తగులుతుందన్నారు. దీని వల్ల రైతులు, చిరు వ్యాపారులు, దుకాణదారులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Nov 4, 2019, 6:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.