ETV Bharat / bharat

సీఎంపై విమర్శలు తగవని విపక్ష నేతకు హైకోర్టు సూచన

author img

By

Published : Dec 14, 2020, 7:11 PM IST

డీఎం​కే అధినేత​ స్టాలిన్​... తమిళనాడు ముఖ్యమంత్రి పళనిసామిపై విమర్శలు చేయడం మానుకోవాలని సూచించింది మద్రాసు హైకోర్టు. తమిళనాడు ప్రభుత్వం వేసిన పరువునష్టం దావాను కొట్టివేయాలని కోరుతూ స్టాలిన్​ దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ చేపట్టిన కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఆరోపణలు చేయకూడదని.. ఆధారాలుంటే కోర్టు వద్దకు రావాలని స్పష్టం చేసింది.

'M.K. Stalin should stop criticizing Chief Minister Edappadi Palanichamy' says Madras High court
'స్టాలిన్​.. విమర్శలు చేయడం మానుకోండి'

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిసామిపై విమర్శలు చేయడం మానుకోవాలని డీఎం​కే చీఫ్​ స్టాలిన్​కు సూచించింది మద్రాసు హైకోర్టు. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వ్యక్తి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం తగదని పేర్కొంది.

ముఖ్యమంత్రి, స్పీకర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ స్టాలిన్​పై పరువునష్టం దావా వేసింది తమిళనాడు ప్రభుత్వం. దీనిని కొట్టివేయాలని స్టాలిన్​ మరో పిటిషన్​ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన జస్టిస్​ సతీశ్​ కుమార్​.. స్టాలిన్​ వ్యాఖ్యలతో కోర్టు తీవ్ర అసంతృప్తి చెందినట్టు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:- తలైవా.. తమిళ రాజకీయాలను మార్చేస్తారా?

స్టాలిన్​తో పాటు ఇతర నేతలు.. తమ రాజకీయ లబ్ధి కోసం తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని జస్టిస్​ సతీశ్​ వ్యాఖ్యానించారు. ఆరోపణలకు ఆధారాలుంటే.. కోర్టును సంప్రదించాలని, అంతేకానీ భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని స్పష్టం చేశారు. ప్రజలను ఇవి తప్పుదోవ పట్టిస్తాయన్నారు.

ఇప్పటికే స్టాలిన్​పై ఉన్న పలు పరువునష్టం దావాలను కొట్టివేసింది హైకోర్టు. అయితే దాని అర్థం.. ఘాటు వ్యాఖ్యలు చేయడానికి అనుమతులిచ్చినట్టు కాదని జస్టిస్​ సతీశ్​ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:- ఈ నెల 13 నుంచి కమల్​ ఎన్నికల ప్రచారం

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిసామిపై విమర్శలు చేయడం మానుకోవాలని డీఎం​కే చీఫ్​ స్టాలిన్​కు సూచించింది మద్రాసు హైకోర్టు. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వ్యక్తి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం తగదని పేర్కొంది.

ముఖ్యమంత్రి, స్పీకర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ స్టాలిన్​పై పరువునష్టం దావా వేసింది తమిళనాడు ప్రభుత్వం. దీనిని కొట్టివేయాలని స్టాలిన్​ మరో పిటిషన్​ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన జస్టిస్​ సతీశ్​ కుమార్​.. స్టాలిన్​ వ్యాఖ్యలతో కోర్టు తీవ్ర అసంతృప్తి చెందినట్టు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:- తలైవా.. తమిళ రాజకీయాలను మార్చేస్తారా?

స్టాలిన్​తో పాటు ఇతర నేతలు.. తమ రాజకీయ లబ్ధి కోసం తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని జస్టిస్​ సతీశ్​ వ్యాఖ్యానించారు. ఆరోపణలకు ఆధారాలుంటే.. కోర్టును సంప్రదించాలని, అంతేకానీ భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని స్పష్టం చేశారు. ప్రజలను ఇవి తప్పుదోవ పట్టిస్తాయన్నారు.

ఇప్పటికే స్టాలిన్​పై ఉన్న పలు పరువునష్టం దావాలను కొట్టివేసింది హైకోర్టు. అయితే దాని అర్థం.. ఘాటు వ్యాఖ్యలు చేయడానికి అనుమతులిచ్చినట్టు కాదని జస్టిస్​ సతీశ్​ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:- ఈ నెల 13 నుంచి కమల్​ ఎన్నికల ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.