ETV Bharat / bharat

లోక్​సభ సమావేశాలు బహిష్కరించిన విపక్షాలు

author img

By

Published : Sep 22, 2020, 3:33 PM IST

Updated : Sep 22, 2020, 5:46 PM IST

Lok Sabha adjourned for one hour, following sloganeering by Opposition MPs
వ్యవసాయ బిల్లులపై విపక్షాల నిరసన-లోక్​సభ వాయిదా

17:41 September 22

లోక్​సభ సమావేశాలను బహిష్కరించిన విపక్షాలు

కాంగ్రెస్​ నేతృత్వంలోని విపక్షాలు లోక్​సభ సమావేశాలను బహిష్కరించాయి. రాజ్యసభలో సస్పెండైన 8 మంది ఎంపీలకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు లోక్​సభలో కాంగ్రెస్​ పక్ష నేత అధీర్​ రంజన్​ చౌధరి. బాయ్​కాట్​ ఎంతకాలం కొనసాగుతుందో స్పష్టం చేయలేదు. ఈ నేపథ్యంలో రాజ్యసభ కార్యకలాపాల గురించి లోక్​సభలో ప్రస్తావించవద్దని హెచ్చరించారు సభాపతి ఓం బిర్లా. సభ్యులు చేసిన అన్ని సూచనలను రికార్డుల నుంచి తొలగించనున్నట్లు స్పష్టం చేశారు.  

వాకౌట్​ చేసిన పార్టీల్లో కాంగ్రెస్​, తృణమూల్​ కాంగ్రెస్​, బహుజన్​ సమాజ్​ పార్టీ, తెరాస ఉన్నాయి. అంతకుముందు వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలంటూ విపక్షాలు చేసిన నిరనసలతో లోక్‌సభ పలుమార్లు వాయిదా పడింది.

16:37 September 22

లోక్​సభ సమావేశాలు బహిష్కరించిన విపక్షాలు

8 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్​ను నిరసిస్తూ విపక్షాలు.. లోక్​సభ సమావేశాలను బహిష్కరించాయి. వారం రోజుల పాటు సభకు దూరంగా ఉండనున్నట్లు కాంగ్రెస్​ నేతృత్వంలోని విపక్షాల సభ్యులు స్పష్టం చేశారు. వ్యవసాయ బిల్లులపైనా వ్యతిరేకత వ్యక్తం చేశారు. 

15:26 September 22

వ్యవసాయ బిల్లులపై విపక్షాల నిరసన-లోక్​సభ వాయిదా

ఇటీవల పార్లమెంటు ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలంటూ విపక్షాలు లోక్​సభలో నిరసనకు దిగాయి. ఆందోళనల నడుమ.. సభను గంట వాయిదా వేశారు స్పీకర్​ ఓం బిర్లా. 

17:41 September 22

లోక్​సభ సమావేశాలను బహిష్కరించిన విపక్షాలు

కాంగ్రెస్​ నేతృత్వంలోని విపక్షాలు లోక్​సభ సమావేశాలను బహిష్కరించాయి. రాజ్యసభలో సస్పెండైన 8 మంది ఎంపీలకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు లోక్​సభలో కాంగ్రెస్​ పక్ష నేత అధీర్​ రంజన్​ చౌధరి. బాయ్​కాట్​ ఎంతకాలం కొనసాగుతుందో స్పష్టం చేయలేదు. ఈ నేపథ్యంలో రాజ్యసభ కార్యకలాపాల గురించి లోక్​సభలో ప్రస్తావించవద్దని హెచ్చరించారు సభాపతి ఓం బిర్లా. సభ్యులు చేసిన అన్ని సూచనలను రికార్డుల నుంచి తొలగించనున్నట్లు స్పష్టం చేశారు.  

వాకౌట్​ చేసిన పార్టీల్లో కాంగ్రెస్​, తృణమూల్​ కాంగ్రెస్​, బహుజన్​ సమాజ్​ పార్టీ, తెరాస ఉన్నాయి. అంతకుముందు వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలంటూ విపక్షాలు చేసిన నిరనసలతో లోక్‌సభ పలుమార్లు వాయిదా పడింది.

16:37 September 22

లోక్​సభ సమావేశాలు బహిష్కరించిన విపక్షాలు

8 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్​ను నిరసిస్తూ విపక్షాలు.. లోక్​సభ సమావేశాలను బహిష్కరించాయి. వారం రోజుల పాటు సభకు దూరంగా ఉండనున్నట్లు కాంగ్రెస్​ నేతృత్వంలోని విపక్షాల సభ్యులు స్పష్టం చేశారు. వ్యవసాయ బిల్లులపైనా వ్యతిరేకత వ్యక్తం చేశారు. 

15:26 September 22

వ్యవసాయ బిల్లులపై విపక్షాల నిరసన-లోక్​సభ వాయిదా

ఇటీవల పార్లమెంటు ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలంటూ విపక్షాలు లోక్​సభలో నిరసనకు దిగాయి. ఆందోళనల నడుమ.. సభను గంట వాయిదా వేశారు స్పీకర్​ ఓం బిర్లా. 

Last Updated : Sep 22, 2020, 5:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.