ETV Bharat / bharat

'ఎక్కడివారక్కడే ఉండి పరీక్షలు రాసుకోవచ్చు'

author img

By

Published : May 27, 2020, 9:19 PM IST

లాక్​డౌన్​తో వాయిదాపడ్డ సీబీఎస్​ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు కేంద్రం తీపి కబురు అందించింది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లోని సొంతూళ్లకు వెళ్లిన విద్యార్థులు.. అక్కడి నుంచే పరీక్షలు రాసుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు త్వరలోనే సీబీఎస్ఈ ఓ నోటిఫికేషన్​ను జారీ చేస్తుందని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి రమేశ్​ పోక్రియాల్​.​

Students who moved to different state, district can appear for pending board exams there
సొంత జిల్లాలోనే బోర్డు పరీక్షలు రాసుకునేందుకు కేంద్రం అనుమతి

కరోనా వైరస్​ నేపథ్యంలో విధించిన లాక్​డౌన్​ కారణంగా వాయిదాపడ్డ 10,12 తరగతుల బోర్డు పరీక్షలు.. జులై 1 నుంచి తిరిగి ప్రారంభంకానున్నాయి. అయితే ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లోని సొంతూళ్లకు చేరుకున్న విద్యార్థులకు కేంద్రం ఉపశమనం కలిగించింది. వారు ఉన్న చోటు నుంచే పరీక్షలు రాసుకోవచ్చని కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి రామేశ్​ పోక్రియాల్​ ప్రకటించారు. పరీక్షల కోసం విద్యార్థులు తాము వచ్చిన ప్రాంతాలకు తిరిగి వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

ఈ విద్యార్థుల కోసం సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్​(సీబీఎస్​ఈ) త్వరలోనే నోటిఫికేషన్​ జారీచేస్తుందని పేర్కొన్న మంత్రి.. విద్యార్థులు రిజిస్టర్​ చేసుకోవాలన్నారు.

కరోనా వైరస్​ నేపథ్యంలో విధించిన లాక్​డౌన్​ కారణంగా వాయిదాపడ్డ 10,12 తరగతుల బోర్డు పరీక్షలు.. జులై 1 నుంచి తిరిగి ప్రారంభంకానున్నాయి. అయితే ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లోని సొంతూళ్లకు చేరుకున్న విద్యార్థులకు కేంద్రం ఉపశమనం కలిగించింది. వారు ఉన్న చోటు నుంచే పరీక్షలు రాసుకోవచ్చని కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి రామేశ్​ పోక్రియాల్​ ప్రకటించారు. పరీక్షల కోసం విద్యార్థులు తాము వచ్చిన ప్రాంతాలకు తిరిగి వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

ఈ విద్యార్థుల కోసం సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్​(సీబీఎస్​ఈ) త్వరలోనే నోటిఫికేషన్​ జారీచేస్తుందని పేర్కొన్న మంత్రి.. విద్యార్థులు రిజిస్టర్​ చేసుకోవాలన్నారు.


ఇదీ చదవండి:
ఎంసెట్​ విద్యార్థులకు వర్గసమీకరణాలపై ఆన్​లైన్​ పాఠాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.