ETV Bharat / bharat

'లాక్​డౌన్​పై కేంద్రం వద్ద సరైన వ్యూహం లేదు' - Lockdown imposed in unplanned manner

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ విధించటంపై కేంద్రంపై మరోమారు విమర్శలు గుప్పించింది కాంగ్రెస్​. లాక్​డౌన్​ విధించటం, ఎత్తివేయటంలోనూ ప్రభుత్వం వద్ద సరైన ప్రణాళిక లేదని ఆరోపించింది. సరైన వ్యూహం లేకపోవటం వల్ల లాక్​డౌన్​లో 383 మంది ప్రాణాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేసింది.

Cong
'లాక్​డౌన్​పై కేంద్రం వద్ద సరైన వ్యూహం లేదు'
author img

By

Published : May 20, 2020, 7:49 PM IST

కరోనా కట్టడి కోసం ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా అనాలోచితంగా దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ విధించారని మరోమారు కేంద్రంపై విమర్శలు చేసింది కాంగ్రెస్​. లాక్​డౌన్​ ఎత్తివేసేందుకూ ప్రభుత్వం వద్ద ఎలాంటి సరైన వ్యూహం లేదని ఎద్దేవా చేసింది.

కేంద్ర ప్రభుత్వం అసమర్థత, అలసత్వానికి ప్రతిరూపమని విమర్శించారు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి అభిషేక్​ సింఘ్వీ.

" కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్​డౌన్​ సరైన నిర్ణయం. దానికి మా మద్దతు ఉంటుంది. కానీ... లాక్​డౌన్​ విధించటం, ఎత్తివేయటంలో ప్రభుత్వానికి సరైన వ్యూహం లేదు. ప్రణాళిక లేని లాక్​డౌన్​తో ఎంత ప్రయోజనం చేకూరింది? ఈ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందా? దేశంలో కరోనా పరిస్థితులను అంచనా వేయడానికి కేసులు, మరణాలు, పరీక్షలు చాలా ముఖ్యమైన పారామితులు. వీటి విషయంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. లాక్​డౌన్​తో మే 10 వరకు 383 మంది ప్రాణాలు కోల్పోయారు."

– అభిషేక్​ మను సింఘ్వీ, కాంగ్రెస్​ అధికార ప్రతినిధి

దేశంలో నిరుద్యోగ రేటు రికార్డు స్థాయిలో పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు సింఘ్వీ. సీఎంఐఈ అధ్యయనం ప్రకారం భారత్​లో మే 3 వరకు నిరుద్యోగ రేటు 27.1 శాతానికి చేరుకున్నట్లు తెలిపారు. అమెరికాతో పోలిస్తే నాలుగు రెట్లు అధికమన్నారు. దేశవ్యాప్తంగా 122 మిలియన్ల​ మంది ఉపాధి కోల్పోయారని.. అందులో 91 మిలియన్లు చిన్న వ్యాపారులు, కార్మికులు, 18 మిలియన్ల మంది వేతనజీవులని పేర్కొన్నారు.

కరోనా కట్టడి కోసం ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా అనాలోచితంగా దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ విధించారని మరోమారు కేంద్రంపై విమర్శలు చేసింది కాంగ్రెస్​. లాక్​డౌన్​ ఎత్తివేసేందుకూ ప్రభుత్వం వద్ద ఎలాంటి సరైన వ్యూహం లేదని ఎద్దేవా చేసింది.

కేంద్ర ప్రభుత్వం అసమర్థత, అలసత్వానికి ప్రతిరూపమని విమర్శించారు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి అభిషేక్​ సింఘ్వీ.

" కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్​డౌన్​ సరైన నిర్ణయం. దానికి మా మద్దతు ఉంటుంది. కానీ... లాక్​డౌన్​ విధించటం, ఎత్తివేయటంలో ప్రభుత్వానికి సరైన వ్యూహం లేదు. ప్రణాళిక లేని లాక్​డౌన్​తో ఎంత ప్రయోజనం చేకూరింది? ఈ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందా? దేశంలో కరోనా పరిస్థితులను అంచనా వేయడానికి కేసులు, మరణాలు, పరీక్షలు చాలా ముఖ్యమైన పారామితులు. వీటి విషయంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. లాక్​డౌన్​తో మే 10 వరకు 383 మంది ప్రాణాలు కోల్పోయారు."

– అభిషేక్​ మను సింఘ్వీ, కాంగ్రెస్​ అధికార ప్రతినిధి

దేశంలో నిరుద్యోగ రేటు రికార్డు స్థాయిలో పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు సింఘ్వీ. సీఎంఐఈ అధ్యయనం ప్రకారం భారత్​లో మే 3 వరకు నిరుద్యోగ రేటు 27.1 శాతానికి చేరుకున్నట్లు తెలిపారు. అమెరికాతో పోలిస్తే నాలుగు రెట్లు అధికమన్నారు. దేశవ్యాప్తంగా 122 మిలియన్ల​ మంది ఉపాధి కోల్పోయారని.. అందులో 91 మిలియన్లు చిన్న వ్యాపారులు, కార్మికులు, 18 మిలియన్ల మంది వేతనజీవులని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.