ETV Bharat / bharat

కశ్మీర్, కేరళలో నిరాడంబరంగా ఈద్

author img

By

Published : May 24, 2020, 12:45 PM IST

జమ్ము కశ్మీర్, కేరళలో ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు జరుగుతున్నాయి. మిగతా రాష్ట్రాల్లో సోమవారంనాడు ఈ పండుగ జరుపుకోనున్నారు. లాక్​డౌన్ నేపథ్యంలో ముస్లింలు తమ ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు చేసుకుంటున్నారు.

Eid prayers in Jammu and Kashmir
జమ్ము కశ్మీర్​లో నిరాడంబరంగా ఊద్ వేడుకలు

జమ్ము కశ్మీర్, కేరళలో ఈద్-ఉల్ ఫితర్ వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ముస్లింలు తమ ఇళ్లలోనే, కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు చేసుకుంటున్నారు. లాక్​డౌన్ నిబంధనలు అమల్లో ఉన్న కారణంగా మసీదుల్లో సామూహిక ప్రార్థనలకు అవకాశం లేకుండా పోయింది.

A mosque in Jammu and Kashmir
జమ్ము కశ్మీర్​లోని ఓ మసీదు

జమ్ము కశ్మీర్​, కేరళలో ఆదివారం ఈద్​ ఉల్ ఫితర్ జరుపుకుంటుండగా... మిగతా రాష్ట్రాల్లో సోమవారం జరుపుకోనున్నారు. ముస్లింలు రంజాన్ ఉపవాస దీక్షకు ఈద్ వేడుకతో ముగింపు పలుకుతారు.

ఇది రెండోసారి..

జమ్ము కశ్మీర్​లో సామూహిక ఈద్ ప్రార్థనలు జరగకపోవడం ఇది రెండోసారి. ఆర్టికల్ 370 రద్దు సమయంలో పోలీసులు కర్ఫ్యూ విధించడం వల్ల.. మొదటిసారి వేడుకలు జరగలేదు. ప్రస్తుతం కరోనా నివారణ కోసం లాక్​డౌన్ కొనసాగుతుండడం వల్ల వీలుపడలేదు.

నిబంధనలు ఉల్లంఘించి..

Eid prayers in Jammu and Kashmir
జమ్ము కశ్మీర్​లో ఈద్ ప్రార్థనలు

లాక్​డౌన్ ఆంక్షలు ఉన్నందున మసీదుల్లో సామూహిక ఈద్​ ప్రార్థనలు జరపకూడదని పోలీసులు ప్రసార మాధ్యమాల ద్వారా విజ్ఞప్తి చేశారు. అయితే పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ పట్టణాలు, నగరాల్లోని కొన్ని మసీదుల్లో సామూహిక ప్రార్థనలు జరుగుతున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి: వలస విషాదం: 100కి.మీ నడిచి ప్రసవం- బిడ్డ మృతి

జమ్ము కశ్మీర్, కేరళలో ఈద్-ఉల్ ఫితర్ వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ముస్లింలు తమ ఇళ్లలోనే, కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు చేసుకుంటున్నారు. లాక్​డౌన్ నిబంధనలు అమల్లో ఉన్న కారణంగా మసీదుల్లో సామూహిక ప్రార్థనలకు అవకాశం లేకుండా పోయింది.

A mosque in Jammu and Kashmir
జమ్ము కశ్మీర్​లోని ఓ మసీదు

జమ్ము కశ్మీర్​, కేరళలో ఆదివారం ఈద్​ ఉల్ ఫితర్ జరుపుకుంటుండగా... మిగతా రాష్ట్రాల్లో సోమవారం జరుపుకోనున్నారు. ముస్లింలు రంజాన్ ఉపవాస దీక్షకు ఈద్ వేడుకతో ముగింపు పలుకుతారు.

ఇది రెండోసారి..

జమ్ము కశ్మీర్​లో సామూహిక ఈద్ ప్రార్థనలు జరగకపోవడం ఇది రెండోసారి. ఆర్టికల్ 370 రద్దు సమయంలో పోలీసులు కర్ఫ్యూ విధించడం వల్ల.. మొదటిసారి వేడుకలు జరగలేదు. ప్రస్తుతం కరోనా నివారణ కోసం లాక్​డౌన్ కొనసాగుతుండడం వల్ల వీలుపడలేదు.

నిబంధనలు ఉల్లంఘించి..

Eid prayers in Jammu and Kashmir
జమ్ము కశ్మీర్​లో ఈద్ ప్రార్థనలు

లాక్​డౌన్ ఆంక్షలు ఉన్నందున మసీదుల్లో సామూహిక ఈద్​ ప్రార్థనలు జరపకూడదని పోలీసులు ప్రసార మాధ్యమాల ద్వారా విజ్ఞప్తి చేశారు. అయితే పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ పట్టణాలు, నగరాల్లోని కొన్ని మసీదుల్లో సామూహిక ప్రార్థనలు జరుగుతున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి: వలస విషాదం: 100కి.మీ నడిచి ప్రసవం- బిడ్డ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.